Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
ACB Raids | ఏసీబీ రైడ్ కలకలం…
Special Stories

ACB Raids | ఏసీబీ రైడ్ కలకలం…

రవాణా శాఖ డిటిసి పై ఏసీబీ దాడులు ఏకకాలంలో 3 చోట్ల సోదాలు చేస్తున్నట్లు ప్రచారం..? ACB Raids | తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ అధికారులు యమ స్పీడు మీద ఉన్నారు. చిన్న క్లూ దొరికితే చాలు అక్రమారుల భరతం పడుతున్నారు. ఇటీవలి కాలంలో వరుస దాడులతో అవినీతి అధికారుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. రవాణా శాఖలో ఇప్పటికే పలుమార్లు అనేక జిల్లాల్లో దాడులు చేసి కొంతమంది అవినీతి అధికారులను జైలుకు పంపించిన అధికారులు.. ఈరోజు ఉదయమే హన్మకొండలోని రవాణా శాఖ (RTA)లోని డిప్యూటీ ట్రాన్స్ ఫోర్ట్ కమిషనర్ (DTC) పుప్పాల శ్రీనివాస్ కు చెందిన ఇళ్ళల్లో సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్, జగిత్యాల హన్మకొండ లోని ఆయనకు చెందిన ఇండ్లలో ఏకకాలంలో మెరుపుదాడులు చేశారు. కాగా ఇప్పటికే పుప్పాల శ్రీనివాస్ పై అవినీతి ఆరోపణలు అనేకం ఉన్నాయి. రవాణా శాఖ లో డిటిసి స్థాయి అధికారిపై ఏసీబీ రైడ్స్ జరగడం రాష్ట్రంలో చర్చనీయాంశం కాగా.. ర...
Kumbh Mela | కుంభామేళాలో నిజాం క్లినిక్‌.. భ‌క్తుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు
Trending

Kumbh Mela | కుంభామేళాలో నిజాం క్లినిక్‌.. భ‌క్తుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు

Kumbh Mela 2025 | మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌.. హైద‌రాబాద్ ఏడో నిజాం (VII Nizam of Hyderabad). మ‌హా కుంభామేళాలో భ‌క్తుల‌కు ఆయ‌న ఎన‌లేని సేవ‌లు అందించారు. భ‌క్తుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అక్క‌డ ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 1942 నాటి విష‌యం ఇది. ఆ స‌మ‌యంలో ప్ర‌యాగ్ (ప్ర‌స్తుత ప్ర‌యాగ్‌రాజ్) న‌గ‌రంలో జ‌రిగిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (Mir Osman Ali Khan) సేవ‌లు అందించారు. కుంభామేళా (Kumbh Mela) ల‌లో లక్షలాది మంది భక్తులు హాజరు కాగా నిజాం ఆయుర్వేదిక్ సఫారీ దవాఖానా (Nizam Ayurvedic Mobile Clinic) అనే చికిత్సాల‌యాన్ని నిజాం రాజు ఏర్పాటు చేశారు. ఎస్‌.ఎ.హుస్సేన్‌, వినోద్ కుమార్ భ‌ట్నాగ‌ర్ అనే ప‌రిశోధ‌కులు ఈ వివ‌రాలు వెల్ల‌డించారు. వీరు జాతీయ భారతీయ వైద్య వారసత్వ సంస్థ (NIIMH)కు చెందిన పరిశోధకులు. Kumbh Mela : నిజాం క్లినిక్ ఏర్పాటుకు కార‌ణాలు? ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే మహా కుంభామేళాలో వే...
S Jaishankar : తిరిగి వ‌చ్చే వారిని స్వీక‌రించ‌డం త‌ప్ప‌దు.. అమెరికా వ‌ల‌సదారుల‌పై మంత్రి వ్యాఖ్య‌
National

S Jaishankar : తిరిగి వ‌చ్చే వారిని స్వీక‌రించ‌డం త‌ప్ప‌దు.. అమెరికా వ‌ల‌సదారుల‌పై మంత్రి వ్యాఖ్య‌

S Jaishankar : అక్రమంగా నివ‌సిస్తున్నారంటూ అమెరికా నుంచి భారతీయులను తిరిగి పంపించ‌డం ( deportation of alleged illegal Indian immigrants)పై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (External Affairs Minister S Jaishankar) స్పందించారు. విదేశాల్లో అక్రమంగా నివసిస్తున్న భార‌త పౌరుల‌ను తిరిగి స్వీకరించడం స‌ర్కారు బాధ్య‌త అన్నారు. దాన్ని పాటించ‌క త‌ప్ప‌ద‌న్నారు. జైశంక‌ర్ మొద‌టి ప్రసంగం ఈ రోజు రాజ్యసభ (Rajya Sabha)లో జరిగింది. ఆ త‌ర్వాత లోక్‌సభలో కూడా ఆయ‌న మాట్లాడారు. చ‌ర్చ‌నీయాంశంగా Jaishankar కామెంట్స్‌ అమెరికా (US)లో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను తిరిగి పంపడంపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఉభ‌య స‌భ‌ల్లో చేసిన ప్రకటన పెద్ద చర్చనీయాంశమైంది. ఏ దేశమైనా తమ పౌరులను చట్టబద్ధంగా పరిరక్షించుకోవడానికి, వారికి సహాయం చేయడానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని, అదే సమయంలో ఇతర దేశాల్లో అక్రమంగా నివసించే వారి విషయంలో...
Kodangal |  సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ లో రోడ్డెక్కిన విద్యార్థులు..
State

Kodangal | సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ లో రోడ్డెక్కిన విద్యార్థులు..

Kodangal : ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల వంటి రుచిపచీ లేని సాంబారు, ఒక్కపూట మాత్రమే అన్నం వడ్డింపు.. ఇదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సొంత నియోజకవర్గంలో విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనం తీరు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలం చెన్నారం పాఠశాలలో ఉడకని అన్నం నీళ్లలాంటి సాంబారు పెడుతున్నారని, అన్నం ఒక్కపూట మాత్రమే వడ్డిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. అలాగే గుడ్డు (Egg), అరటిపండు నెలలో ఒక్కసారి మాత్రమే పెడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై పిల్లల తల్లిదండ్రులు పలుమార్లు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని చెబుతున్నారు. ఈమేరకు గురువారం పాఠశాలలో భోజనం పెట్టకపోవడంతో ఆగ్రహించి పాఠశాల ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన (Students Protest) తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు, వంట నిర్వాహకులను వెంటనే మార్చాలని విద్...
TG News | శాశ్వ‌త జ‌డ్జిల‌ను నియ‌మించండి.. తెలంగాణ‌కు సుప్రీం సిఫార్సు
State

TG News | శాశ్వ‌త జ‌డ్జిల‌ను నియ‌మించండి.. తెలంగాణ‌కు సుప్రీం సిఫార్సు

TG News | తెలంగాణ హైకోర్టు (Telangana High court)కు ముగ్గురు న్యాయ‌మూర్తుల‌ను శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న నియ‌మించాల‌ని సుప్రీంకోర్టు సిఫార్సు చేసింది. మ‌ద్రాస్ హైకోర్టుకు ఇద్ద‌రిని నియ‌మించాల‌ని కూడా పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలో సుప్రీం కొలేజియం స‌మావేశంలో ఈ మేర‌కు ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చాయి. ఆ న్యాయ‌మూర్తులు ఎవ‌రెవ‌రంటే.. తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులు(Judges)గా ఉన్న న్యాయమూర్తి లక్ష్మీనారామ‌య‌ణ‌ అలిశెట్టి, న్యాయమూర్తి అనిల్ కుమార్ జుకంటి, న్యాయమూర్తి సుజానా కళాసికంలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని ప్ర‌తిపాదించిన‌ట్టు సుప్రీం (Supreme Court ) త‌న అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. అలాగే మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తులు వెంకటాచారి లక్ష్మీనారాయణన్, పెరియసామి వడమలైలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సిఫార్సు చేసినట్లు కొలేజియం తెలిపింది. ఏయే అంశాల‌ను ప...
error: Content is protected !!