One Nation One Election : జమిలి ఎన్నికలు.. పార్లమెంటరీ కమిటీ కీలక సమావేశం
జమిలి ఎన్నికలు (One Nation One Election) బిల్లులను పరిశీలించేందుకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (Joint Parliamentary Committee) తొలి సమావేశం ఈ రోజు జరిగింది. ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. కేంద్ర మంత్రివర్గం నిర్ణయాన్ని బీజేపీ (BJP) సభ్యులు సమర్థించగా ప్రతిపక్షాల నేతలు వ్యతిరేకించారు. ఈ క్రమంలో రెండు పక్షాల వాదనలను పార్లమెంటరీ కమిటీ (JPC) రికార్డు చేసింది.
One Nation One Electionపై వాడీవేడి చర్చ
బీజేపీ ఎంపీ, కేంద్ర న్యాయ శాఖ మాజీ సహాయ మంత్రి పి.పి. చౌదరి నేతృత్వంలో 39 మంది సభ్యుల కమిటీ సమావేశమైంది. వీరిలో ప్రాధాన పార్టీల ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ప్రియాంకా గాంధీ వాద్రా, జేడీయూ నుంచి సంజయ్ ఝా, శివసేన నుంచి శ్రీకాంత్ షిండే, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సంజయ్ సింగ్, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కల్యాణ్ బెనర్జీ హాజరయ్యారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ అ...




