Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Adilabad | హమ్మయ్య… పులిని పట్టుకున్నారు..
State

Adilabad | హమ్మయ్య… పులిని పట్టుకున్నారు..

ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలు Tiger Trapped in Adilabad | రెండు నెలలుగా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న పులిని ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజలు పులిసంచారంతో 2 నెలలుగా బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే కొద్దిసేపటిక్రితమే ఫారెస్ట్ అధికారులు ఆ పులిని పట్టుకున్నట్లు తెలియడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నట్లు తెలుస్తోంది. హమ్మయ్య పులిని బంధించారంట మనకేం భయం అక్కర్లేదని ప్రజలు ఖుషీగా చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోని సిర్పూర్ సరిహద్దులో పులిని బంధించిన ఫారెస్ట్ అధికారులు ఆ పులిన మగ పులిగా నిర్ధారించినట్లు సమాచారం. వరుస దాడులతో ప్రజల్లో ఆందోళన.. కాగా , ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad District )జిల్లా కాగజ్‌నగర్‌ మండలం నజ్రూల్‌నగర్‌లో నవంబర్ 29న పత్తి ఏరుతున్న కూలీ లక్ష్మి(22)పై దాడి చేసి చంపేసిన స...
Green energy 2025 | భారత్ లో  గ్రీన్ ఎన‌ర్జీ.. 2025లో 214 గిగావాట్ల సామర్థ్యం
National

Green energy 2025 | భారత్ లో గ్రీన్ ఎన‌ర్జీ.. 2025లో 214 గిగావాట్ల సామర్థ్యం

Green energy 2025 : భారతదేశంలో గ్రీన్ ఎన‌ర్జీ ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోంది. 2024 సెప్టెంబరు నాటికి మొత్తం 200 GW పునరుత్పాదక శక్తి (renewable energy) సామర్థ్యాన్ని ఇది అధిగమించింది. 2025 ప్రారంభానికి 214 GW సామర్థ్యానికి చేరుకుంది. 2030 నాటికి 500 GW నాన్ నాసిల్ ఫ్యూయల్ ఎనర్జీ లక్ష్యాన్ని చేరుకోనుంద‌ని అంచ‌నా. గ్రీన్ ఎన‌ర్జీ పున‌రుత్పాద‌క శ‌క్తినిపెంచేందుకు భార‌త‌దేశం ముంద‌డుగు వేస్తోంద‌ని, దీంతో ఈ రంగంలో దినదినాభివృద్ధి చెందుతున్నామ‌ని కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది, Green energy 2024లో సాధించిన విజయాలు గతేడాది ఏప్రిల్ నుంచి నవంబ‌రు వరకు భారతదేశం 15 GW పునరుత్పాదక శక్తిని జోడించింది. 2023 అదే కాలంలో 7.57 GW జోడించగా ఇది రెండింతలు పెరిగింది. 2024లో సౌర శక్తి (solar energy) సామర్థ్యం 94.17 GWకు, వాయు శక్తి సామర్థ్యం 47.96 GWకు చేరుకుంది. నవంబరు 2024 నాటికి మొత్తం సౌర ప్రాజెక...
Nimisha Priya | కేరళ నర్సుకు మ‌ర‌ణ శిక్ష‌.. అస‌లేం జ‌రిగింది?
Crime

Nimisha Priya | కేరళ నర్సుకు మ‌ర‌ణ శిక్ష‌.. అస‌లేం జ‌రిగింది?

Nimisha Priya: యెమ‌న్‌లో ప‌నిచేస్తున్న కేరళ న‌ర్సు నిమిషా ప్రియాకు మ‌ర‌ణ శిక్ష ప‌డింది. 2017లో జ‌రిగిన ఓ హ‌త్య కేసులో అక్క‌డి కోర్టు ఇటీవ‌ల‌ దీన్ని విధించ‌గా తాజాగా ఆ దేశ అధ్య‌క్షుడు అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఆమోదం తెలిపారు. పూర్వప‌రాలు ఏమిటంటే.. నిమిషా ప్రియా 2011లో తన కుటుంబంతో కలిసి యెమెన్ వెళ్లింది. సనా అనే ప్రాంతంలో ఆమె ఒక క్లినిక్ నడిపేది. యెమెన్ చట్టాల ప్రకారం విదేశీయులు వ్యాపారం నిర్వహించాలంటే స్థానిక భాగస్వామిని తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆమె తలాల్ అబ్దో మహదీ అనే వ్యక్తిని తన క్లినిక్‌లో బిజినెస్ పార్ట్‌న‌ర్‌గా చేర్చుకుంది. కొన్నాళ్ల తర్వాత నిమిషాను మహదీ వేధించడం ప్రారంభించాడు. వ్యాపారానికి సంబంధించిన డబ్బు బలవంతంగా తీసుకోవడం, ఆమె పాస్‌పోర్టు లాక్కోవ‌డం లాంటి దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డాడు. దీంతో నిమిషా పోలీసులను ఆశ్రయించింది. అయినప్పటికీ సరైన స్పందన లభించలేదు. చివ‌ర‌కు Nim...
Micro Finance loan | ఇంత దారుణ‌మా..?!.. దంప‌తుల‌ను బ‌లిగొన్న మైక్రో అప్పు
Crime

Micro Finance loan | ఇంత దారుణ‌మా..?!.. దంప‌తుల‌ను బ‌లిగొన్న మైక్రో అప్పు

Micro Finance loan : అప్పు ఆ కుటుంబానికి ముప్పు తెచ్చి పెట్టింది. రుణం ఇచ్చిన సంస్థ దారుణానికి ఆ ఫ్యామిలీ తుడిచిపెట్టుకుపోయింది. మైక్రో ఫైనాన్స్ వేధింపుల‌కు భార్యాభ‌ర్త‌లు బ‌లి అయ్యారు. బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చేసుకొని పిల్ల‌ల‌ను అనాథ‌లు చేశారు. పది రోజుల వ్య‌వ‌ధిలోనే దంప‌తులిద్ద‌రూ ఒక‌రి త‌ర్వాత ఒక‌రు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. భూపాల‌ప‌ల్లి జిల్లాలో ఈ విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. వారం వారం చెల్లింపులతో క‌ష్టాలు భూపాలపల్లి మండలంలోని కమలాపూర్‌ గ్రామానికి చెందిన బానోత్‌ దేవందర్‌ (37), చందన (32) అదే గ్రామంలో కూలి ప‌ని చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నారు. చాలీచాల‌ని దిన‌స‌రి వేత‌నంతో వీరికి కుటుంబ పోష‌ణ భార‌మైంది. దీంతో మైక్రో ఫైనాన్స్‌లో రూ. 3 లక్షల అప్పు తీసుకున్నారు. తీసుకున్న అప్పుకు వారం వారం కిస్తీలు క‌ట్టాల్సి ఉండ‌గా, కొన్ని రోజుల త‌ర్వాత చెల్లింపులు వీరికి క‌ష్ట‌త‌ర‌మైంది. ఒక‌రి త...
leopard : పులి సంచారంతో వణికిపోతున్న గ్రామాలు..
State

leopard : పులి సంచారంతో వణికిపోతున్న గ్రామాలు..

leopard Spotted : తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో పులి సంచారం ప్ర‌జ‌ల్లో వ‌ణుకు పుట్టిస్తోంది. ఇటీవ‌ల కుమ్రం ఆసిఫాబాద్ జిల్లా, ములుగు జిల్లా కొత్త‌గూడ ఏజెన్సీ ప్రాంతాల్లో పులి సంచ‌రించిన ఆన‌వాళ్ల‌ను అట‌వీశాఖ అధికారులు ఇటీవల గుర్తించారు. వెంట‌నే స‌మీప ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేసి మంద‌స్తు జాగ్ర‌త్త‌లుపాటించాల‌ని సూచ‌న‌లు చేశారు. అయితే సోమ‌వారం కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ మండలం కొండపల్లి గ్రామంలో సోమవారం నీటి ట్యాంకు వద్ద పులి సంచారించ‌డాన్ని చూసి గ్రామస్తులు భ‌యాందోళ‌న‌కు గురయ్యారు. పత్తి పంటను కోస్తున్న కొందరు స్థానిక రైతులు వ్య‌వ‌సాయ‌ బావి సమీపంలో పులి పాద‌ముద్ర‌ల‌ను గుర్తించి గ్రామస్థులను అప్రమత్తం చేశారు. మొబైల్ ఫోన్‌లలో పులి పాద‌ముద్ర‌ల‌ను పొటోలు తీసి అటవీ అధికారులకు తెలియజేశారు. పులి సంచారంతో గ్రామ‌స్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పులి సంచారాన్ని కుణ్ణంగా పరిశీల...
error: Content is protected !!