Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Mann ki Baat | ప్ర‌ధాని మోదీ మన్ కీ బాత్‌.. ఏమ‌న్నారంటే..
National

Mann ki Baat | ప్ర‌ధాని మోదీ మన్ కీ బాత్‌.. ఏమ‌న్నారంటే..

PM Modi Mann ki Baat : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ (Modi Mann ki Baat) కార్య‌క్ర‌మం (117వ ఎపిసోడ్‌) ద్వారా ప్రజలను ఉద్దేశించి నేడు మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగంపై కూడా ఆయ‌న‌ మాట్లాడారు. 2025లో జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుందన్నారు. రాజ్యాంగం మ‌నంద‌రికీ అనుస‌ర‌ణీయ‌మ‌ని, మార్గదర్శకమ‌ని అన్నారు. వీడియోలు అప్‌లోడ్ చేయండి రాజ్యాంగ వారసత్వాన్ని దేశ ప్రజలకు చేరువ‌య్యేలా constitution75.com అనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించామ‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు. రాజ్యాంగం ప్రాథమిక ఉద్దేశంపై మీ వీడియోలను ఆ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయొచ్చ‌ని అన్నారు. వివిధ భాషల్లో రాజ్యాంగాన్ని చ‌ద‌వ‌చ్చ‌ని, అలాగే ప్రశ్నలు అడిగే అవకాశం కూడా అడ‌గొచ్చ‌ని పేర్కొన్నారు. విద్యార్థులు, యువతీ ...
IIT Kanpur : కాన్పూర్‌ ఐఐటీలో పలు పోస్టుల కోసం నోటిఫికేష‌న్.. రూ. 2.16 లక్షల వరకు జీతం
State

IIT Kanpur : కాన్పూర్‌ ఐఐటీలో పలు పోస్టుల కోసం నోటిఫికేష‌న్.. రూ. 2.16 లక్షల వరకు జీతం

IIT Kanpur | కాన్పూర్ ఐఐటీ అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ కేడర్ రిక్రూట్‌మెంట్ 2024ని ప్రకటించింది. అర్హత గల అభ్యర్థులు జనవరి 31, 2025లోపు అధికారిక వెబ్‌సైట్ iitk.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు వేతనం పోస్టు ఆధారంగా రూ. 21,700 నుంచి రూ. 2,16,600 వరకు ఉంటుంది. IIT Kanpur Job Notification : అప్లికేషన్ ఫీజు కోసం, గ్రూప్ A పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా రూ. 1,000 (జనరల్, OBC, EWS), రూ. 500 (SC, ST, PH) చెల్లించాలి. మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. గ్రూప్ B, గ్రూప్‌ C పోస్టులకు, రుసుము రూ. 700 (జనరల్, OBC, EWS) ల‌కు రూ. 350 (SC, ST, PH), మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది. IIT Kanpur Job Notification : ముఖ్యమైన వివరాలు ఇంటర్వ్యూలు లేదా ప్రాక్టికల్ టెస్ట్‌ల వంటి తదుపరి దశలకు వెళ్లే ముందు, ఆన్‌లైన్ ...
Constables : ఒకేరోజు ఇద్దరు కానిస్టేబుల్స్ సూసైడ్..
Crime

Constables : ఒకేరోజు ఇద్దరు కానిస్టేబుల్స్ సూసైడ్..

ఒకరు ఉరి వేసుకోగా, మరొకరు పురుగుల మందు తాగి ఆత్మహత్య పొలీస్ శాఖలో కలకలం రేపుతున్న వరుస ఘటనలు TG Police : ఉమ్మడి మెదక్ (Medak) జిల్లాలో పోలీసు శాఖకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్య (Police Constables )కు పాల్పడ్డారు. ఒకరేమో మెదక్ జిల్లాలోని కొల్చారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుండగా, మరొకరేమో బెటాలియన్ లో కానిస్టేబుల్ గా ఉన్నారు. వీరిరువురు ఈ రోజు ఉదయం వేర్వేరు కారణాలతో సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కొల్చారం పీఎస్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సాయికుమార్ క్వార్టర్స్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, బెటాలియన్ లో కానిస్టేబుల్ గా ఉన్న బాలకృష్ణ కుటుంబ సభ్యులకు విషమిచ్చి తాను ఆత్మహత్య కు పాల్పడ్డట్లు తెలుస్తోంది. బాలకృష్ణ చనిపోగా అతని భార్య తోపాటు ఇద్దరు చిన్న పిల్లల ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో పోలీస్ శాఖలో జరుగుతున్న ఆత్మహత్య లు కలకలం...
Jasprit Bumrah : టెస్టుల్లో జస్ప్రీత్ బుమ్రా రికార్డ్
Sports

Jasprit Bumrah : టెస్టుల్లో జస్ప్రీత్ బుమ్రా రికార్డ్

Jasprit Bumrah : టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 200 వికెట్లు (200 Test wickets) తీసిన భారత పేసర్‌గా జస్ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో పేసర్ ఈ మైలురాయిని సాధించాడు. దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ అంతకుముందు మార్చి 1983లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో 50 మ్యాచ్‌లలో ఈ రికార్డును నెల‌కొల్పాడు. అయితే బుమ్రా (Jasprit Bumrah Records) తన కేవ‌లం 44వ టెస్ట్‌లో మైలురాయిని చేరుకున్నాడు.. తద్వారా రవీంద్ర జడేజాతో కలిసి 200 టెస్టు వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా బుమ్రా నిలిచాడు. బ్రిస్బేన్ టెస్ట్ తర్వాత రిటైర్ అయిన రవిఅశ్విన్, కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సెప్టెంబర్ 2016లో తన 37వ టెస్టులో తన 200వ టెస్ట్ వికెట్‌ను తీసిన తర్వాత అత్యంత వేగవంతమైన భారతీయుడిగా నిలిచాడు. అడిలైడ్, బ్...
Warangal Police | శభాష్ వరంగల్ పోలీస్..  క్రైం రేట్ తగ్గించేశారు..
Crime

Warangal Police | శభాష్ వరంగల్ పోలీస్.. క్రైం రేట్ తగ్గించేశారు..

వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో గతేడాది తో పోలిస్తే 3.21% తగ్గుదల మీడియా సమావేశంలో నేరాల వివరాలు వెల్లడించిన కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.. Warangal Police Commissionerate : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు అత్యుత్తమ పనితీరు కనబరిచి నేరాల సంఖ్యను తగ్గించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో 2023 లో 14,731 కేసులు నమోదు కాగా, 2024 ప్రస్తుత సంవత్సరం ఆ సంఖ్య కాస్త 14406 కు తగ్గింది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 3.21% క్రైమ్ రేట్ తగ్గినట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా (Amber Kishore Jha) వెల్లడించారు. నేరాలను నియంత్రించడంలో కమిషనరేట్ పోలీసులు సక్సెస్ అయినట్లు, పోలీసుల సమష్టి కృషితోనే ఈ ఏడాది నేరాలు అదుపులో ఉండటంతో పాటు తగ్గుముఖం పట్టినట్లు చెప్పవచ్చు. 2024 సంవత్సరానికి సంబంధించి క్రైమ్‌ నివేదిక ను మీడియా సమావేశంలో కమిషనర్ విడుదల చేశారు.ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసు...
error: Content is protected !!