TTD : ఆన్లైన్లో తిరుపతి వైకుంఠ ఏకాదశి టికెట్లు.. బుకింగ్ షురూ
TTD Vaikunta Ekadasi 2025 tickets | తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఆన్లైన్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అశేష భక్తజనం పాల్గొనే ఈ ఆధ్యాత్మిక ఉత్సవం 2025 జనవరి 10 నుంచి 19 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల ఆన్లైన్ బుకింగ్ 2024 డిసెంబరు 23 ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం (SED) టికెట్ల బుకింగ్ 2024 డిసెంబరు 24 ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయ్యింది. భక్తులు తమ టికెట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
అందుబాటులోకి SSD టోకెన్లు
వైకుంఠ ద్వారం అనేది ఆలయ గర్భగృహాన్ని ప్రదక్షిణ చేసే పవిత్ర మార్గం. 10 రోజుల వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా ఇది తెరిచి ఉంటుంది. ఈ దర్శనానికి భక్తులు పోటెత్తనుండటంతో స్లాటెడ్ సర్వ దర్శనం (SSD) టోకెన్లను అందుబాటులో ఉంచారు. ఇవి క...




