Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Fertilizer Crisis : రైతుల సమస్యలపై స‌ర్కారు నిర్ల‌క్ష్యం : కేటీఆర్
State, Hyderabad

Fertilizer Crisis : రైతుల సమస్యలపై స‌ర్కారు నిర్ల‌క్ష్యం : కేటీఆర్

గన్ పార్క్ వద్ద భారత రాష్ట్ర సమితి ధర్నా సచివాలయం ముట్టడికి బీఆర్ఎస్ శ్రేణుల యత్నం.. Fertilizer Crisis in Telanganan | రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఎరువుల సంక్షోభంపైన భారత రాష్ట్ర సమితి (BRS Party) శనివారం నిరసన ప్రదర్శన చేపట్టింది. యూరియా కొరత తీర్చాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. స‌చివాల‌యాన్ని ముట్ట‌డించారు. ఈ సందర్భం బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం 15 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్నారు. అంతకు మించి నిర్వహించినా మేము సిద్ధమేనని, రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాన్ని సభలో పెట్టినా, అన్నింటికీ సరైన సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగం నుంచి మొదలుకొని ఏ అంశం పైననైనా సభలో చర్చకు పెడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వ్యవసాయ విస్తీర్ణంతో పాటు వ్యవసాయ సంక్షేమానికి కేసీఆర్ చేసిన కార్యక్రమాలు, పథకాల గురించి వ...
ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య – Hyderabad Murder Case
Crime, Hyderabad

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య – Hyderabad Murder Case

Hyderabad Murder Case : హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం మరో నిండు ప్రాణాన్ని బ‌లిగొంది. ఓ మహిళ ప్రియుడి మోజులో ప‌డి కలిసి క‌ట్టుకున్న భర్త‌నే అంత‌మొందించింది. పైగా నిద్రలో చనిపోయాడంటూ స్థానికులను, పోలీసులను నమ్మించేందుకు య‌త్నించింది. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు విస్తుగొలిపే విష‌యాలు వెలుగులోకి వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ (NagarKarnool) జిల్లా ఊర్కొండ మండలం మాదారం గ్రామానికి చెందిన జల్లెల శేఖర్ (40)కు రంగారెడ్డి (Rangareddy ) జిల్లా వెల్దండ మండలం కుప్పగుండ్లకు చెందిన చిట్టి (33)తో 2009లో వివాహమైంది. వీరికి 14 ఏళ్ల కుమార్తె, 12 ఏళ్ల కుమారుడు ఉన్నారు. శేఖ‌ర్ కుటుంబం ఉపాధి కోసం హైదరాబాద్‌ (Hyderabad) సరూర్ నగర్ (SaroorNagar) లోని కోదండరామనగర్‌కు వలస వచ్చింది. శేఖర్ కారు డ్రైవర్ గా పనిచేస్తుండగా.. చిట్టి బ‌ట్ట‌ల షాపులో పని...
Bribe | ఇంటి నెంబ‌ర్ కేటాయించడానికి రూ.20,000 లంచం డిమాండ్..
State, Karimnagar

Bribe | ఇంటి నెంబ‌ర్ కేటాయించడానికి రూ.20,000 లంచం డిమాండ్..

Karimnagar News | ఏసీబీ అధికారులు ఒక వైపు దాడులు ముమ్మ‌రం చేస్తున్నా.. ఏదో ఒక‌చోట అవినీతి అధికారులు లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డుతూనే ఉన్నారు. చిన్న ప‌నుల‌కు కూడా పెద్ద మొత్తంలో లంచం (Bribe) డిమాండ్ చేస్తున్నారు. తాజాగా శుక్రవారం కరీంనగర్ జిల్లాలో ఓ లంచగొండి అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా వీణ‌వంక (Veenavanka) మండ‌లంలో పంచాయతీ కార్యదర్శి కంబం నాగరాజు చల్లూర్ గ్రామంలో ఇంటి నెంబర్ కేటాయించ‌డానికి రూ.20,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. చెప్పిన టైం లో డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాల‌ని స‌ద‌రు కార్య‌ద‌ర్శి చెప్పాడు. దీంతో బాధితుడి నుంచి రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హండెడ్ గా పట్టుకున్నారు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వ...
Raja Singh : ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా అసెంబ్లీ స‌మావేశాల‌కు వ‌స్తా..
State

Raja Singh : ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా అసెంబ్లీ స‌మావేశాల‌కు వ‌స్తా..

Hyderabad : స్వతంత్ర ఎమ్మెల్యేగా అసెంబ్లీకి సమావేశాలకు హాజరవుతానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) స్పష్టం చేశారు. ‘ఒకప్పుడు అసెంబ్లీలో ఏం మాట్లాడాలన్నా పార్టీ అగ్ర నాయకత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉండేది. బీజేపీ సభలో మాట్లాడే అవకాశమే ఇచ్చేది కాదని ఆయన తెలిపారు.. ఇప్పుడు నాకు స్వేచ్ఛ ఎక్కువ. నాలాగే చాలా మంది బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. దీనికి తాజా ఉదాహరణ చేవెళ్ల ఎంపీ వ్యవహరమే’ అని తెలిపారు. కాగా ఇటీవలే రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవల చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy) పార్టీ అగ్ర నాయకత్వానికి ఫుట్‌బాల్‌ను బహుమతిగా పంపిన విషయంపై రెండురోజుల క్రితం రాజా సింగ్ స్పందించారు. భారీ మెజారిటీతో గెలిచిన ఒక ఎంపీ ఎంతగా మనస్తాపానికి గురైతే అలాంటి పని చేస్తారని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో మరింత మంది ఎంప...
Holidays | వర్షాల ఎఫెక్ట్..  13 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు
State, Hyderabad

Holidays | వర్షాల ఎఫెక్ట్.. 13 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు

వ‌రంగ‌ల్‌ : తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాల నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 13 జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవులు (Holidays) ప్రకటించింది. ‌అందులో నల్లగొండ, యాదాద్రి భువనగిరి, కరీంనగర్‌, ‌సిద్దిపేట, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్‌, ‌నిర్మల్‌, ఆదిలాబాద్‌, ‌ఆసిఫాబాద్‌, ‌నిజామాబాద్‌, ‌ఖమ్మం జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయకు రాకూడదని అధికారులు సూచించారు. వర్ష ప్రభావం కారణంగా కామారెడ్డి జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు ఆగస్ట్ 29, 30 ‌వరకు సెలవులు ప్రకటించినట్లు ప్రభుత్వం తెలిపింది. భారీ వర్షాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సెలవులను మరో రెండు రోజులు పొడిగించింది. అందువల్ల  పాఠశాలలు, కళాశాలలు బంద్‌ ‌కానున్నాయి.సిద్దిపేట జిల్లాలో గత రెండు ...
error: Content is protected !!