Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Registration Buildings |  సకల సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నాలు
State, Hyderabad

Registration Buildings | సకల సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నాలు

ద‌శ‌ల వారీగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నాలు Integrated Registration Buildings : రాష్ట్రంలో అన్ని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను ద‌శ‌ల వారీగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నాల ప‌రిధిలోకి తీసుకువ‌స్తామ‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వెల్ల‌డించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బుధ‌వారం గ‌చ్చిబౌలిలోని తాలిమ్‌లో ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌న నిర్మాణానికి శంకుస్థాప‌న జ‌రిగిన సంద‌ర్బంగా ఏర్పాటైన స‌భ‌లో మంత్రి పొంగులేటి ప్ర‌సంగించారు. దేశంలోని 18 రాష్ట్రాల‌లో అధ్య‌య‌నం చేసి భూభార‌తి -2025 చ‌ట్టాన్ని రూపొందించామ‌న్నారు. రాష్ట్రంలో ఒక్కొక్క‌టిగా అభివృద్ది కార్యక్ర‌మాలు అమ‌లు జ‌రుగుతున్నాయ‌ని, దానిలో భాగంగానే ఈ ఇంటిగ్రేటెడ్ స‌బ్ రిజిస్ట్రార్ భ‌వ‌నాల శంకుస్దాప‌న అని వివ‌రించారు. ప్రస్తుతం జిహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ ప‌రిధిలోగ‌ల ...
Lok Sabha | తీవ్రమైన నేరారోపణలపై అరెస్టయిన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులను తొలగించేందుకు రంగం సిద్ధం?
National

Lok Sabha | తీవ్రమైన నేరారోపణలపై అరెస్టయిన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులను తొలగించేందుకు రంగం సిద్ధం?

లోక్‌సభ (Lok Sabha) లో బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం న్యూఢిల్లీ: పాలనలో జవాబుదారీతనాన్ని పెంచే దిశగా కేంద్రం కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగా తీవ్రమైన నేరారోపణలపై అరెస్టు అయిన లేదా జైలుకు వెళ్లిన ఏ ప్రధానమంత్రి (PM) అయినా, కేంద్ర మంత్రి లేదా సహాయ మంత్రి (MoS) ను ప‌ద‌వి నుంచి తొలగించేందుకు లోక్‌సభలో ఒక బిల్లును ప్రవేశపెట్టున్న‌ట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. 30 రోజులు పాటు జైలుకెళితే.. వెంటనే తొలగింపు కనీసం ఐదేళ్లు జైలు శిక్ష విధించదగిన నేరాలల‌కు పాల్ప‌డి అరెస్టు అయి వరుసగా 30 రోజులు నిర్బంధించబడిన ఏ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రి అయినా 31వ రోజున తమ పదవులను కోల్పోనున్నారు. దీని ద్వారా ఉన్నత స్థాయి ప్రభుత్వ పాల‌కుల‌ను జవాబుదారీగా ఉంచేలా ఈ బిల్లు రూపొందించబడింది. అయితే, చట్టపరమైన ప్రక్రియకు లోబడి, అటువంటి అధికారులు కస్టడీ నుంచి విడుదలైన తర్వాత వారిని తిరిగి ...
Telangana Rains | రాష్ట్రంపై విరుచుకుపడుతున్న వర్షాలు – ములుగులో రికార్డు వర్షపాతం
State

Telangana Rains | రాష్ట్రంపై విరుచుకుపడుతున్న వర్షాలు – ములుగులో రికార్డు వర్షపాతం

Telangana Rains | తెలంగాణ రాష్ట్రంలో వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కొన్నిచోట్ల ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పంటలు నీట మునిగిపోయి రైతులు విలవిలలాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదవుతోంది. ములుగును ముంచెత్తుతున్న ముసురు ములుగు జిల్లా మంగపేటలో అత్యధికంగా 18.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఏటూరునాగారం 16.1 సెం.మీ., వెంకటాపురం 12.1 సెం.మీ., జైనథ్‌ (ఆదిలాబాద్‌)లో 11.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మల్లూరు (ములుగు)లో 11.6 సెం.మీ., వాంకిడి (ఆసిఫాబాద్‌)లో 11.3 సెం.మీ., సాత్నాల (ఆదిలాబాద్‌)లో 11 సెం.మీ. వర్షం కురిసింది. తాడ్వాయి, కన్నాయిగూడెం, ధర్మవరం, మేడారం, సిరికొండ, రాంనగర్...
Electric Shock | వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్‌ షాక్‌..
Hyderabad, State

Electric Shock | వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్‌ షాక్‌..

ఇద్దరు యువకులు దుర్మరణం Hyderabad News | హైదరాబాద్‌ రామంతాపూర్‌లో (Ramanthapur) శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఐదుగురు మృతిచెందిన‌ విషాదక‌ర ఘ‌ట‌న మరువకముందే బండ్లగూడలో (Bandlaguda) ఇదే త‌ర‌హా మరో ఘటన చోటుచేసుకుంది. వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా క‌రెంట్ షాక్‌తో (Electric Shock) ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు యువకులు భారీ వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండ‌గా బండ్లగూడ వద్ద గ‌ణేష్‌ విగ్రహానికి హై టెన్షన్‌ వైరు తరగలడంతో ట్రాక్టర్‌కు విద్యుత్ ప్ర‌సార‌మైంది. దీంతో ఇద్దరు యువకులకు షాక్ త‌గిలి అక్కడికక్కడే మరణించారు. ఈ ఘ‌ట‌న‌లో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్క‌డికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిని అఖిల్‌ అనే యువకుడిని హాస్పిట‌ల్ కు తరలించారు. మృతులను టోని (21), వికాస్‌ (20)గా గుర్తించారు. కరెంటు షాక్‌తో ట్రాక్టర్‌ టైర్లు పూర్తిగా ద...
Floods :  వరదల్లో కారుతో సహా కొట్టుకుపోయిన ఫ్యామిలీ
National

Floods : వరదల్లో కారుతో సహా కొట్టుకుపోయిన ఫ్యామిలీ

మహారాష్ట్రలోని ఉద్గిర్ సమీపంలో వరద (Floods) ల్లో తెలంగాణకు చెందిన ఫ్యామిలీ గల్లంతయింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కారుతో సహా వరద నీటిలో కొట్టుకుపోవడం కలకలం రేపింది. మేం వరదల్లో కొట్టుకుపోతున్నాం, పిల్లలూ జాగ్రత్త అంటూ చివరి ఫోన్ కాల్ వచ్చిందని.. ఆ తర్వాత స్విచ్ఛాప్ వచ్చిందని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నలుగురు ఆచూకీ వెంటనే గుర్తించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్ కు చెందిన ఐదుగురితో పాటు మహారాష్ట్రకు చెందిన కారు డ్రైవర్ వాహనాన్ని నడుపుతుండగా ఆగస్ట్ 17న అర్ధరాత్రి మహారాష్ట్రలోని వరద నీటిలో కొట్టుకుపోయింది. మహారాష్ట్రలోని ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఉద్గిర్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాగా, గల్లంతైన వారిలో అఫ్రీనా, హసీనా, సమీనా, ఆఫ్రీన్, సోహెబ్ అనే యువకుడు, మహారాష్ట్ర కు చెందిన కారు డ్రైవ...
error: Content is protected !!