Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
ECI |  నిషేధిత జాబితాలో మరిన్ని పార్టీలు.. తెలంగాణ నుంచి 9 పార్టీలు
National

ECI | నిషేధిత జాబితాలో మరిన్ని పార్టీలు.. తెలంగాణ నుంచి 9 పార్టీలు

- రెండోదశలో 476 పార్టీలను గుర్తించిన ఈసీ న్యూదిల్లీ :  ‌చట్టబద్ధత, నిబంధనలు పాటించని రాజకీయ పార్టీలపై ఈసీ (ECI) కఠిన చర్యలకు ఉపక్రమించింది. దేశవ్యాప్తంగా మరో 476 పార్టీలను రద్దు చేసే దిశగా చర్యలను మొదలు పెట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇటీవల 334 పార్టీలను రద్దు చేసిన ఈసీఐ.. తాజాగా రెండో రౌండ్‌లో మరో 476 పార్టీలను గుర్తించి.. వాటిపై వేటు వేసేందుకు ప్రక్రియను మొదలుపెట్టింది. ఈసీ గుర్తించిన పార్టీల జాబితాలో ఏపీ నుంచి 17 పార్టీలు ఉండగా.. తెలంగాణ నుంచి 9 పార్టీలు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల వ్యవస్థను పటిష్టం చేసేందుకు చేపట్టిన సమగ్రమైన వ్యూహాల్లో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 2019 నుంచి ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయని రాజకీయ పార్టీలను గుర్తించి, జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడిం...
Hanmakonda |  మంత్రి కొండా సురేఖ ఇంటి ఎదుట ధ‌ర్నా..
State

Hanmakonda | మంత్రి కొండా సురేఖ ఇంటి ఎదుట ధ‌ర్నా..

Hanmakonda News : హనుమకొండ రాంనగర్ లోని దేవాదాయ శాఖ‌ మంత్రి కొండా సురేఖ (Konda Surekha ) ఇంటి వద్ద సీఐటీయూ (CITU) ఆధ్వర్యంలో కార్మికులు ధ‌ర్నా నిర్వ‌హించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని(Mid-day meal ) అక్షయపాత్రకు ఇన్వొద్దని డిమాండ్ చేస్తూ సోమవారం ఇంటిలోకి చొచ్చుకుపోయేందుకు మ‌ధ్యాహ్న భోజ‌న కార్మికులు (Mid-Day Meal Workers) యత్నించారు. నెలకు వేతనం ఇస్తానని చెప్పిన ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి మధ్యాహ్న భోజనం పథకాన్ని అక్షయపాత్రకు అప్పగించడం చాలా బాధకరమ‌ని పేర్కొన్నారు. ఓట్ల కోసం మధ్యాహ్న భోజన కార్మికులను కాంగ్రెస్ పార్టీ (Congress Party) మోసం చేసింద‌ని ఫైర్ అయ్యారు. తమ స‌మ‌స్య‌ల‌ను వెల్ల‌బోసుకుందామ‌ని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్దకు వెళ్తే.. పోలీసులు అరెస్టు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు. ఎలాంటి జీతాలు లేకున్నా కూడా అప్పులు తెచ్చి మ‌రీ విద్యార్థుల కోసం వండిపెట్టామని, ఇప్పుడు మాకు ఉపాధి లేక...
IMD Alert | వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు – దేశవ్యాప్తంగా వాతావరణ శాఖ అలర్ట్
National

IMD Alert | వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు – దేశవ్యాప్తంగా వాతావరణ శాఖ అలర్ట్

ప‌లు రాష్ట్రాల‌కు రెడ్ ఆరెంజ్ అల‌ర్ట్‌ IMD Alert | దేశవ్యాప్తంగా వాతావరణంలో ఒక్క‌సారిగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ దేశంలోని పలు రాష్టాల్రకు రెడ్‌, ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ (IMD Alert) చేసింది. తెలంగాణతోపాటు దిల్లీ, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ఝార్ఖండ్‌, హర్యానా, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న‌ మూడు నుంచి ఏడు రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈనేప‌థ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్ర‌యాణాలు చేయొద్దని ఐఎండీ అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. దిల్లీ ప్రాంతంలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ. ఇక్కడ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఆగస్టు 13, 14 తేదీల్లో వర్షం కారణంగా వాతావ‌ర‌ణం చల్లగా ఉంటుంది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌, లక్నో, గోరఖ్‌పూర్‌, వారణాసి, మీరట్‌ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది...
KTR | ఆరు గ్యారెంటీలే ఆర్థిక రంగానికి నష్టం – కేటీఆర్
Hyderabad, State

KTR | ఆరు గ్యారెంటీలే ఆర్థిక రంగానికి నష్టం – కేటీఆర్

KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మ‌రోసారి తీవ్ర‌స్థాయిలో ఫైర్ అయ్యారు. కాగ్(CAG) క్వార్ట‌ర్లీ రిపోర్టుపై కేటీఆర్ స్పందిస్తూ కాంగ్రెస్ పాల‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. కాగ్ త్రైమాసిక నివేదిక ప్ర‌కారం రాష్ట్ర ఆదాయం బాగా త‌గ్గింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయం త‌గ్గ‌డం ప్ర‌మాద ఘంటిక‌ల‌ను మోగిస్తోంది. కాంగ్రెస్ ప్ర‌భుత్వ నిర్లక్ష్యం వైఫ‌ల్యంతో ఆర్థిక రంగం దెబ్బ‌తింటోంది. ఆరు గ్యారెంటీల కాంగ్రెస్ హామీ.. ఆర్థిక రంగానికి న‌ష్టం చేసింది. రాష్ట్ర ఆదాయం త‌గ్గుతుంటే.. అప్పులు మాత్రం అమాంతం పెరిగిపోతున్నాయి. ఆదాయం తగ్గుముఖం పడుతోంది, అప్పులు పెరుగుతున్నాయి. ఇది రాకెట్ సైన్స్ కాదు. ఇది సాధారణ గణితం. కాంగ్రెస్ అసమర్థత భారంతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోంది రూ. 2,738 కోట్ల మిగులు ఉంటుంద‌ని బ‌డ్జెట్‌లో చూపారు. మొద‌టి ...
Rain Alert |  మ‌రో మూడు రోజులు భారీ వ‌ర్షాలు
State, AndhraPradesh

Rain Alert | మ‌రో మూడు రోజులు భారీ వ‌ర్షాలు

IMD Rain Alert to Telangana and AP : బంగాళాఖాతంలోని రుతుపవన ద్రోణి, కోస్తాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతోంది. మ‌రోవైపు వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 13న (బుధవారం) అల్పపీడనం ఏర్పడుతుందని భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక విష‌యాల‌ను వెల్ల‌డించింది. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిందాఇ. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలోని రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని 13 జిల్లాలకు హైద‌రాబాద్‌ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌, సిరిసిల్ల, కరీంనగర్‌, సిద్దిపేట, హన్మ‌కొండ‌, వరంగల్‌, ములుగు, మ...
error: Content is protected !!