విద్య, వైద్యంపై వరాల జల్లు.. వ్యవసాయం, సాగునీటి రంగానికి నిధుల కోత!
హైదరాబాద్: 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు మిశ్రమ ఫలితాలను చూపుతున్నాయి. ప్రభుత్వం విద్య, వైద్యం మరియు గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేయగా, కీలకమైన వ్యవసాయం, సాగునీటి రంగాల్లో నిధుల కోత విధించడం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే పలు శాఖల కేటాయింపుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
ఆశాజనకంగా విద్య, వైద్య రంగాల కేటాయింపులు
సామాజిక మౌలిక సదుపాయాల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
విద్యా శాఖ: గత ఏడాది ₹23,108 కోట్లు ఉండగా, ఈసారి దీనిని ఏకంగా ₹26,674 కోట్లకు పెంచారు.
ఆరోగ్య శాఖ: వైద్య రంగానికి గతంలో కంటే సుమారు 1,300 కోట్లు అదనంగా కేటాయించి, మొత్తాన్ని ₹13,679 కోట్లకు చేర్చారు.
గ్రామీణాభివృద్ధి: పంచాయతీ రాజ్ శాఖకు ఈసారి ₹33,688 కోట్లు కేటాయించగా, గత బడ్జెట్లో ఇది ₹31,605 కోట్లుగా ఉంది.
వ్యవసాయం, సాగునీటి రంగాలకు నిరాశే..
అన్నదాతకు అ...




