Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
నేడు 3 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ ప్రారంభం – Vande Bharat Metro
National

నేడు 3 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ ప్రారంభం – Vande Bharat Metro

Vande Bharat Metro | బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈరోజు (ఆగస్టు 10)న కర్ణాటకలో పర్యటించ‌నున్నారు. ఉదయం 11 గంటలకు బెంగళూరులోని కెఎస్ఆర్ రైల్వే స్టేషన్‌లో 3 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు. దీని తర్వాత, ఆయన బెంగళూరు మెట్రో ఎల్లో లైన్‌ (Bengaluru Metro Yellow Line)ను ప్రారంభించి, ఆర్‌వి రోడ్ (రాగిగుడ్డ) నుంచి ఎలక్ట్రానిక్ సిటీ మెట్రో స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించనున్నారు. తన కర్ణాటక పర్యటన గురించి, ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X'లో పోస్ట్ చేసి, ఆగస్టు 10న బెంగళూరు ప్రజలను క‌లుసుకోవ‌డానికి ఆస‌క్తిగా ఉంద‌ని చెప్పారు. కెఎస్ఆర్ రైల్వే స్టేషన్ నుంచి 3 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తామ‌న్నారు. ఇది కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. బెంగళూరు పట్టణ మౌలిక సదుపాయాలను పెంచడానికి బెంగళూరు మెట్రో ఎల్లో లైన్‌ను ప్రారంభ...
TSRTC : ఆర్టీసీ ఐటీఐ కోర్సుల ప్రవేశాల నోటిఫికేషన్
career

TSRTC : ఆర్టీసీ ఐటీఐ కోర్సుల ప్రవేశాల నోటిఫికేషన్

Hyderabad | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) 2025–26 విద్యా సంవత్సరానికి ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు TSRTC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. హైదరాబాద్‌ శివారులోని హకీంపేట్‌లో ఐటీఐ కాలేజీలో ప్రవేశాలకు దరఖాస్తులను టీఎస్​ ఆర్టీసీ ఆహ్వానిస్తోంది. ఎనిమిది, పదో తరగతి విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కాలేజీలో మోటార్‌ వెహికల్‌ మెకానిక్‌, మెకానిక్‌ డీజిల్‌, వెల్డర్‌, పెయింటర్‌ ట్రేడ్‌లలో కోర్సులు అందిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 28వ తేదీలోగా టీఎస్​ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించింది. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకొనే అభ్యర్థులు పూర్తి వివరాల కోసం 9100664452, 6302649844, 040-69400000 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలి. ఈ మేరకు టీజీఎ...
Hyderabad Rains | మూసీ నది పునరుద్ధరణపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Hyderabad, State

Hyderabad Rains | మూసీ నది పునరుద్ధరణపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో వరదల నివారణకు ‘మూసీ పునరుజ్జీవనమే’ మంత్రం హైదరాబాద్‌లో వర్షాల ప్రభావం తగ్గించేందుకు సీఎం ప్రత్యేక ప్రణాళిక మూసీకి అనుసంధానం – చెరువులు, కుంటలు, నాలాల కలయికతో నగర భద్రత Hyderabad Rains | హైదరాబాద్ మహా నగరంలో భారీ వర్షాలు కురిసినా తట్టుకునేలా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Ravanth Reddy) ఆదేశించారు. వరద నీటి ప్రవాహనికి ఉన్న అడ్డంకులను అధిగమించాలని ఆదేశించారు. వర్షాలతో నగరం అతలాకుతలం కాకుండా ఉండేందుకు అత్యవసరంగానే శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. తాగునీరు, వరద నీరు, డ్రైనేజీలు, ట్రాఫిక్ వ్యవస్థలను మరో వందేళ్ల భవిష్యత్తు అవసరాలను అంచనా వేసుకొని కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఢిల్లీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకున్న ముఖ్యమంత్రి నిన్న రాత్ర...
Kesamudram | కేసముద్రం రైల్వేస్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం
State, warangal

Kesamudram | కేసముద్రం రైల్వేస్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం

రూ.2 కోట్ల విలువైన బోగీ దగ్ధం! మానుకోట (Mahaboobabad): మానుకోట జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్‌ (Kesamudram Railways Station)లో ఇంజినీరింగ్ సిబ్బంది మూడో లైన్ నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన రైలు బోగీలో శుక్రవారం తెల్లవారుజామున ఒక్క‌సారిగా మంటలు (Fire Accident) చెల‌రేగాయి. దీంతో ఆ బోగీలో నిద్రిస్తున్న సిబ్బంది వెంటనే మేల్కొని బయటకు ప‌రుగులు తీశారు. పక్కనే రైల్వే క్వార్టర్స్‌లో నివసిస్తున్న కొంద‌రు కార్మికులు కూడా బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో సుమారు రూ.2 కోట్ల విలువైన రైలు బొగీ పూర్తిగా దగ్ధమైంది. కేసముద్రం (Kesamudram SI) ఎస్సై మురళీధర్ రాజ్ సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని వివ‌రాలు సేక‌రించారు. మహబూబాబాద్ నుంచి అగ్నిమాప‌క సిబ్బంది హుటాహుటిన అక్క‌డికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, ఈ ఫైర్ యాక్సిడెంట్‌కు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రాథమిక సమాచారం ప్రక...
సీతాపూర్ జర్నలిస్ట్ హత్య కేసు..  ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నిందితులు హతం – Sitapur Encounter
Crime

సీతాపూర్ జర్నలిస్ట్ హత్య కేసు.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నిందితులు హతం – Sitapur Encounter

Sitapur Encounter : ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో అర్థరాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో, జర్నలిస్ట్ రాఘవేంద్ర బాజ్‌పాయ్ హత్య కేసులో ఇద్దరు నేరస్థులను పోలీసులు కాల్చి చంపారు . నివేదికల ప్రకారం, రాజు అలియాస్ రిజ్వాన్, సంజయ్ అలియాస్ అకీల్‌గా గుర్తించబడిన ఇద్దరు దుండగులు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), క్రైమ్ బ్రాంచ్ మరియు స్థానిక పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో మరణించారు. పిసావన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్లాపూర్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. జర్నలిస్ట్ హత్య జరిగినప్పటి నుండి ఇద్దరూ పరారీలో ఉన్నారు మరియు వారిపై ఒక్కొక్కరికి రూ. లక్ష రివార్డు ప్రకటించారు. ఈ సంఘటన తర్వాత కాల్పులు జరిపిన వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు. రాఘవేంద్ర బాజ్‌పేయి హత్య కేసు ఉత్తరప్రదేశ్​లోని​ సీతాపూర్‌కు చెందిన జర్నలిస్ట్ రాఘవేంద్ర వాజ్‌పేయి మార్చి 8న హత్యకు గురయ్యాడు. కుటుంబ సభ్యుల ప్రకారం, ఆ రోజు...
error: Content is protected !!