Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Holidays List |  ఆగస్టు 2025లో బ్యాంకులకు భారీ సెలవులు..  మొత్తం 15 రోజుల పాటు మూత!
Business

Holidays List | ఆగస్టు 2025లో బ్యాంకులకు భారీ సెలవులు.. మొత్తం 15 రోజుల పాటు మూత!

Bank Holidays in August 2025 | ఆగస్టు 2025 లో అనేక పండుగలు, జాతీయ సెలవులు రానున్నందున, దేశం అంతటా బ్యాంకులు 15 రోజుల వరకు మూతపడనున్నాయి. అయితే, అన్ని సెలవులు ప్రతి రాష్ట్రంలో ఒకే విధంగా వర్తించవని గమనించాలి. బ్యాంకు సెలవుల జాబితా, వాటి ప్రాంతీయ ప్రాముఖ్యత, కస్టమర్లు తమ లావాదేవీలను ముందుగానే ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకోండి. ఆగస్టు 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి జాబితా ఆగస్టు 1 – బ్యాంక్ సెలవు (రాష్ట్రాన్ని బట్టి మారుతుంది) ఆగష్టు 8 - రక్షా బంధన్ (రాజస్థాన్, ఉత్తరాఖండ్, UPలో పాటిస్తారు) ఆగస్టు 9 - రెండవ శనివారం ఆగస్టు 15 – స్వాతంత్ర్య దినోత్సవం / పార్సీ నూతన సంవత్సరం (ముంబై, నాగ్‌పూర్) ఆగస్టు 16 – కొన్ని ఈశాన్య రాష్ట్రాలలో జోనల్ సెలవు. ఆగస్టు 23 - నాల్గవ శనివారం ఆగస్టు 25 - జన్మాష్టమి (అనేక రాష్ట్రాలు) తీజ్, హర్తాలిక ఓనం వంటి స్థానిక పండుగల ఆధారంగా ఇతర ప్రాంతీయ ...
Dengue Safety | వర్షాకాలంలో డెంగ్యూ ముప్పు పెరుగుతోంది – హెచ్చరిస్తున్న ఆరోగ్య నిపుణులు
LifeStyle

Dengue Safety | వర్షాకాలంలో డెంగ్యూ ముప్పు పెరుగుతోంది – హెచ్చరిస్తున్న ఆరోగ్య నిపుణులు

Dengue Fever | భారీ వర్షాల కారణంగా విష‌జ్వ‌రాలు ముఖ్యంగా డెంగ్యూ కేసులు పెరుగుతాయని ఆరోగ్య అధికారులు హెచ్చరిస్తున్నారు. వాన‌లు కురిసిన‌పుడు నీరు నిలిచిపోతూ ఉంటుంది. కాలువ‌లు,నీటికుంట‌లు, పూల కుండలు, కూలర్లు, పాత‌ టైర్లు, నిర్మాణ ప్రదేశాలలో తరచుగా డెంగ్యూ వ్యాప్తికి కారణమైన ఏడిస్ ఈజిప్టి దోమకు సంతానోత్పత్తి ప్రదేశాలుగా పనిచేస్తాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, గత దశాబ్దంలో కర్ణాటకలో డెంగ్యూ కేసులు పదే పదే పెరుగుతున్నాయి, వేగవంతమైన పట్టణీకరణ, వ్యర్థాల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల బెంగళూరులో ఎక్కువ శాతం కేసులు నమోదయ్యాయి. 2023లో, భారతదేశంలో దేశవ్యాప్తంగా 2.7 లక్షలకు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయని నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ (NVBDCP) తెలిపింది. సకాలంలో చికిత్స చేయకపోతే డెంగ్యూ లక్షణాలు త్వరగా తీవ్రమవుతాయి. డెంగీ (Dengue) సాధా...
KCR | క్షేత్రస్థాయిలో ఉద్యమాలకు సిద్ధం కండి
State, Hyderabad

KCR | క్షేత్రస్థాయిలో ఉద్యమాలకు సిద్ధం కండి

హైదరాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారమే దిశగా రేవంత్ ప్రభుత్వంపై (Revanth Govt) క్షేత్రస్థాయిలో పోరాాటాలకు సిద్ధంకావాలని గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) పిలుపునిచ్చారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో మంగళవారం (జులై 29) బీఆర్ఎస్ శ్రేణులతో కేసీఆర్ సమావేశమయ్యారు. రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఆంధ్రా ప్రయోజనాలను కాపాడేందుకు స్వయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే పాలనా విధానాలను అమలుచేయడం దుర్మార్గమని అన్నారు. ఇక్కడ చంద్రబాబు..అక్కడ మోదీల ప్రయోజనాలను కాపాడేందుకు సీఎం తహతహ లాడుతున్నాడని, దీనిని తెలంగాణ సమాజం గమనిస్తున్నదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశాపూర్వకంగా పండబెట్టి.. వానాకాలం నాట్లు దగ్గరపడుతున్నా కూడా.. ఇంతవరకు రైతాంగానికి సాగునీరు అందించని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదీయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కన్నేపల్లి పంప్ హ...
Daya Nayak : ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌కు ప‌దోన్న‌తి.. ! అసలు ఎవరీ దయానాయక్​?
Crime

Daya Nayak : ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌కు ప‌దోన్న‌తి.. ! అసలు ఎవరీ దయానాయక్​?

మహారాష్ట్రలో దయా నాయక్‌ (Daya Nayak).. ‘ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు’గా అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయనకు ఏసీపీగా పదోన్నతి లభించడంతో మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఆయనతోపాటు మరికొందరు అధికారులు కూడా అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ACP)లుగా ప్రమోషన్‌ పొందారు. 1990ల్లో ముంబయిలో అండర్‌వరల్డ్‌ కార్యకలాపాలు తీవ్రంగా ఉన్న కాలంలో సుమారుగా 80 మంది గ్యాంగ్‌స్టర్లను దయా నాయక్‌ ఎన్‌కౌంటర్‌ చేసినట్లు సమాచారం. ఈ దయానాయక్​ స్ఫూర్తితో గతంలో హిందీతోపాటు పలు భాషల్లో సినిమాలు వచ్చాయి. దయా నాయక్‌ ఎవరు..? కర్ణాటకలోని ఉడిపికి చెందిన దయా నాయక్‌ (Daya Nayak) తన కుటుంబాన్ని పోషించుకోవడానికి 1979లో ముంబైకి వెళ్లి ఓ టీ స్టాల్‌లో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. గోరేగావ్‌లోని మునిసిపల్ పాఠశాల నుండి 12వ తరగతి పూర్తి చేసి, తరువాత అంధేరిలోని CES కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత 1995లో ముంబయిలో ఎస్సై ఉద్యోగం ...
Lok Sabha Debate | పాకిస్థాన్ వేడుకోవడంతోనే కాల్పుల విరమణ..!
National

Lok Sabha Debate | పాకిస్థాన్ వేడుకోవడంతోనే కాల్పుల విరమణ..!

‘ఆపరేషన్ సిందూర్‌’పై లోక్‌సభలో ఈ రోజు వాడీవేడీగా చ‌ర్చ‌లు (Lok Sabha Debate) సాగాయి. విప‌క్ష నేత‌లు సంధించిన ప్రశ్నలకు ప్ర‌ధాని మోదీ బృందం దీటుగా స‌మాధాన‌మిచ్చింది. మంగళవారం జరిగిన చర్చలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సహా హోం మత్రి అమిత్ షా, ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ప్రతిపక్షాల వాద‌న‌ల‌ను కొట్టిపారేశారు. పార్ల‌మెంట్ వేదిక‌గా కాల్పుల విరమణలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమేయం లేదని మోదీ తేల్చి చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం పాకిస్థాన్‌కు వణుకు పుట్టించిందని తెలిపారు.’ దయచేసి దాడులు ఆపండి’ అని పాక్ డీజీఎంఓ మన డీజీఎంఓను వేడుకోవడంతోనే కాల్పుల విరమణకు అంగీకరించామని సభకు మోదీ వివరించారు. భారత్, పాకిస్థాన్ కాల్పుల‌ విరమణలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత్ర లేదని ప్రధాని ధైర్యంగా చెప్పాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సవాల్ విసిరా...
error: Content is protected !!