Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
దాహార్తిని తీర్చేందుకు గీసుగొండ పోలీసుల ముందడుగు
Crime, warangal

దాహార్తిని తీర్చేందుకు గీసుగొండ పోలీసుల ముందడుగు

కొనాయమాకుల స్టేజ్ వద్ద చలివేంద్రం ప్రారంభం ఎండలు ముదురుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు గీసుగొండ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కొనాయమాకుల స్టేజ్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మామునూరు ఏసీపీ వెంకటేష్  బుధవారం ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏసీపి మాట్లాడుతూ గీసుగొండ సీ ఐ విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించడం అభినందనీయమని అన్నారు.కేవలం శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా, సామాజిక బాధ్యతగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం వల్ల పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రయాణికులు, స్థానిక ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీఐ విశ్వేశ్వర్, ఎస్సైలు కుమార్, అనిల్ ,తోపాటు స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు....
దానం,కడియం లకు ఊరట…
Hyderabad

దానం,కడియం లకు ఊరట…

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తుది తీర్పును వెలువరించారు. గతంలో 8 మంది ఎమ్మెల్యేల విషయంలో అనుసరించిన నిర్ణయాన్నే పునరావృతం చేస్తూ, వీరిద్దరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే, కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ ఆయనపై అనర్హత వేటు పడలేదు. కడియం శ్రీహరి వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తన కుమార్తె కడియం కావ్యకు మద్దతుగా, కాంగ్రెస్ కండువా కప్పుకుని ప్రచారం చేసినా ఆయన సభ్యత్వం సురక్షితమని స్పీకర్ తేల్చిచెప్పారు.గతంలో ఇతర ఎమ్మెల్యేల పిటిషన్లను ఏ ప్రాతిపదికన కొట్టివేశారో, అదే తరహాలో వీరిపై దాఖలైన ఫిర్యాదులను కూడా స్పీకర్ తోసిపుచ్చారు. ప్రతిపక్షాలకు షాక్? చట్టసభ నిబంధనల ప్రకారం ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ గట...
సర్కారు ధాన్యం భద్రమేనా?
Special Stories

సర్కారు ధాన్యం భద్రమేనా?

రూ.2కోట్ల ధాన్యం మాయం పై అనుమానాలు Hanumakonda Paddy Scam | ఆ మిల్లులో ప్రభుత్వ ధాన్యం భద్రంగా ఉందా? అంటే అవునని చెప్పలేని పరిస్థితి నెలకొంది. హనుమకొండ జిల్లా అగ్రంపహాడ్ శివారులోని మహాదేవ ఇండస్ట్రీస్ వేదికగా సివిల్ సప్లైస్ ధాన్యం పక్కదారి పట్టిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మిల్లులో ఉండాల్సిన ధాన్యంలో సుమారు రూ. 2 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు విశ్వసనీయ సమాచారం. రికార్డుల్లో ఉన్న లెక్కలకు.. మిల్లులో ఉన్న నిల్వకు భారీ తేడా?  2025-26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పౌరసరఫరాల శాఖ 2991.920 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కోసం ఈ మిల్లుకు పంపించింది. నిబంధనల ప్రకారం.. మిల్లర్ ఆ ధాన్యాన్ని మరాడించి 2004.586 మెట్రిక్ టన్నులు  అంటే 70 ఏసికెల బియ్యాన్ని ప్రభుత్వానికి  తిరిగి అప్పగించాలి. అయితే, ఇప్పటివరకు ఆ మిల్లర్ పౌరసరఫరాల శాఖకు కేవలం 12 ఏసికెల బియ్యాన్ని మాత్రమే ప...
మడికొండలో సెగలు రేపుతున్న ‘డంపింగ్ యార్డ్’ వివాదం – Dumping Yard Controversy
warangal

మడికొండలో సెగలు రేపుతున్న ‘డంపింగ్ యార్డ్’ వివాదం – Dumping Yard Controversy

తక్షణమే ఎత్తివేయాలని నిరాహారదీక్ష కు సిద్దమైన గ్రామస్తులు.. Madikonda Dumping Yard Controversy | హన్మకొండ జిల్లా మడికొండలో డంపింగ్ యార్డ్ వివాదం ముదురుతోంది. ఊపిరి పీల్చుకోలేని స్థితిలో ఉన్నామంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ఇక పోరాటమే శరణ్యమని భావించిన స్థానికులు, తక్షణమే డంపింగ్ యార్డును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలకు సిద్ధమయ్యారు. అనారోగ్యాల నిలయంగా మడికొండ గత కొంతకాలంగా మడికొండ శివార్లలో ఉన్న డంపింగ్ యార్డ్ నుండి వెలువడుతున్న దుర్వాసన, దుమ్ము, ధూళి వల్ల స్థానికులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఆసుపత్రుల పాలు: ఇప్పటికే గ్రామంలోని అనేకమంది అనారోగ్యంతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. పరిస్థితి ఇలాగే కొనసాగితే మడికొండలో ప్రతి ఇల్లూ ఒక ఆసుపత్రిలా మారుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్వాసకోశ వ్యాధులు: డంపిం...
నోటీసుల కోసం ‘మామూళ్ల’ వేట
Crime, Hyderabad

నోటీసుల కోసం ‘మామూళ్ల’ వేట

లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఎస్ఐల అరెస్ట్. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో అవినీతి తిమింగలాలు ఏసీబీకి చిక్కాయి. బాబునాయక్, ప్రమోద్ అనే ఇద్దరు ఎస్ఐలు ఒక కేసు విషయంలో నిందితుడికి సెక్షన్ 41 నోటీసులు ఇచ్చేందుకు ప్రతిఫలంగా లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశారు.ఈ వేధింపులను తట్టుకోలేక బాధితుడు ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, ఎస్ఐలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ జరుపుతున్నారు....
error: Content is protected !!