Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
HYDRAA : మూసీ నది ఆక్రమణలపై కొరడా – షెడ్లు, షాపుల తొలగింపు
State, Hyderabad

HYDRAA : మూసీ నది ఆక్రమణలపై కొరడా – షెడ్లు, షాపుల తొలగింపు

మూసపేటలో ఆక్రమణల నుంచి పార్కుకు విముక్తి పార్కు స్థలంలో కబ్జాలు తొలగించిన హైడ్రా హైదరాబాద్ (Hyderabad) లోని మూసీ నది (Musi River)లో ఆక్రమణలను హైడ్రా (HYDRAA) తొలగించింది. మూసీ పరీవాహక ప్రాంతంలోని చాదర్ ఘాట్ బ్రిడ్జి నుంచి ఉస్మానియా హాస్పిటల్ వరకు పలు అక్రమ నిర్మాణాలను మంగళవారం హైడ్రా నేలమట్టం చేసింది. ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్ల నుంచి మూసీని ఆక్రమించి, పలు నిర్మాణాలు చేపట్టారు. వాటిని ప్రయివేట్ బస్సులకు, లారీలకు కిరాయికి ఇస్తున్నారు. అంతేకాకుండా రాత్రి వేళల్లో ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్నట్టు స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో మూసీ ప్రాంతంలో విచారణ చేపట్టిన అధికారులు, ఆక్రమణలు నిజమేనని నిర్ధారించారు.మంగళవారం ఉదయం నుంచి పోలీసు భారీ బందోబస్తు మధ్య మూసీలో తిష్టవేసిన షెడ్డులను తొలగించారు. ఇలా ఉండగా న‌గ‌రంలోని మూసాపేట ఆంజ‌నేయ న‌గ‌ర్‌లో అక్...
రావితేజ కొత్త మల్టీప్లెక్స్ ‘ART Cinemas’ జూలై 31న గ్రాండ్ ఓపెనింగ్
Cinema

రావితేజ కొత్త మల్టీప్లెక్స్ ‘ART Cinemas’ జూలై 31న గ్రాండ్ ఓపెనింగ్

టాలీవుడ్ హీరో, మాస్ మహారాజా రవితేజ థియేటర్ బిజినెస్‌ను ప్రారంభించారు. ఏషియన్ సినిమాస్‌తో కలిసి హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఆరు స్క్రీన్లతో అత్యాధునిక హంగుల‌తో లగ్జరీ మల్టీఫ్లెక్స్ ' ART Cinemas ' థియేటర్‌ను నిర్మించారు. జూలై 31న దీని ప్రారంభోత్సవం జరగనుండగా, తొలి సినిమాగా విజ‌య్ దేవ‌ర‌కొండ కింగ్‌డమ్ మూవీని ప్రదర్శించనున్నారు. 60 అడుగుల భారీ స్క్రీన్‌, డాల్బీ అట్మాస్ సౌండ్‌తో ఈ మల్టీఫ్లెక్స్‌ ఈస్ట్ హైదరాబాద్‌లో అత్యుత్తమ సినిమాటిక్ అనుభవం అందించనుంద‌ని ప‌లువురు పేర్కొన్నారు. ఈ అత్యాధునిక మల్టీప్లెక్స్ జూలై 31, 2025న ప్రారంభం కానుంది, ఆరు స్క్రీన్లతో ఉన్న ఈ థియేట‌ర్ ఈస్ట్‌ హైదరాబాద్ వాసుల‌కు సినిమాటిక్ అప్‌గ్రేడ్‌ను అందిస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ యాక్షన్ డ్రామా, కింగ్‌డమ్ మొద‌టిసినిమాగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. ART Cinemas : అత్యాధునిక సాంకేతికత QUBE అభివృద్ధి చేసిన ప్రీమియం లార...
TGSRTC | ప్రయాణికుల‌కు టీజీఎస్ ఆర్టీసీ బంప‌ర్ ఆఫ‌ర్‌..
State

TGSRTC | ప్రయాణికుల‌కు టీజీఎస్ ఆర్టీసీ బంప‌ర్ ఆఫ‌ర్‌..

హైదరాబాద్-విజయవాడ మార్గంలో RTC బస్సులకు భారీ డిస్కౌంట్లు! హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో రాకపోకలు సాగించేవారికి తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) శుభ‌వార్త చెప్పింది. ఈ మార్గంలో ప్ర‌యాణించే బస్సుల్లో టికెట్‌ ధరలపై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. కనీసం 16 శాతం నుంచి గరిష్ఠంగా 30శాతం వరకు టికెట్‌ ధరల్లో ప్రత్యేక ఆఫర్‌ ఇస్తున్నట్లు ‘ఎక్స్‌’లో ఓ పోస్టులో పేర్కొంది. దీని ప్రకారం.. గరుడ ప్లస్‌ బస్సుల్లో టికెట్‌ ధరపై 30శాతం, ఈ-గరుడ బస్సుల్లో 26 శాతం ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. అలాగే, సూపర్‌ లగ్జరీ, లహరి నాన్‌ ఏసీ బస్సుల్లో 20 శాతం, రాజధాని, లహరి ఏసీ బస్సుల్లో టికెట్లపై 16శాతం మేర త‌గ్గించిన‌ట్లు తెలిపింది. ఈ రాయితీలు ఆన్‌లైన్ తోపాటు ఆఫ్‌లైన్‌ బుకింగ్‌లకు సైతం వర్తించనున్నాయి. . అలాగే టికెట్లు అధికారిక వెబ్ సైట్ https://www.tgsrtcbus.in/ లో బుక్ చేసుకోవాలని రెండు నగరాల మధ్య ప్రయాణికుల్ని ఆర్టీసీ సూచించింద...
Warangal Collectorate | 25 నెలలుగా నత్తనడకే!
warangal, State

Warangal Collectorate | 25 నెలలుగా నత్తనడకే!

వరంగల్ కలెక్టరేట్ నిర్మాణం పూర్తయ్యేదెన్నడు? Warangal Collectorate | వరంగల్ నగర ప్రజల అభివృద్ధికి మూలస్తంభంగా నిలవాల్సిన కలెక్టరేట్ భవనం ఇప్పటికీ పూర్తి కావడం లేదు. 2023 జూన్ 17న ఈ సమీకృత జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఇప్పటికే 25 నెలలు గడుస్తున్నా, పనుల్లో స్పష్టమైన పురోగతి కనిపించడంలేదు. ప్రతిరోజూ పనులు జరిగినట్లుగా కనిపిస్తున్నప్పటికీ ఆశించినంత వేగం లేదు. దీంతో స్థానికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలు ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో నిర్మిస్తున్న ఈ సమీకృత భవన నిర్మాణ పనులు జాప్యం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ జిల్లాలోని ప్రజల అభివృద్ధి కలలన్నీ కొలువుదీరే కేంద్రంగా ఆశించిన కొత్త కలెక్టరేట్ భవనం ఇప్పటికీ ‘పూర్తి’ రూపం దాల్చకపోవడం స్థానికులను కలవరపెడుతోంది.అధికారికంగా నిర్మాణం ప్రారంభించి 25 నెలలు గడుస్తున్నా పనుల పురో...
అన్న‌దాత‌ల‌తో ఆప్యాయంగా మంత్రి సీతక్క –  Minister Seethakka
Trending

అన్న‌దాత‌ల‌తో ఆప్యాయంగా మంత్రి సీతక్క – Minister Seethakka

కూలీలతో ఆత్మీయ ప‌ల‌క‌రింపు.. Mulugu News | తెలంగాణలో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. రైతులు వ్య‌వ‌సాయ ప‌నుల్లో బిజీగా మారిపోయారు. అయితే మంత్రి సీతక్క (Minister Seethakka) రైతుల‌కు స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. వరి నాట్లు వేసుకుంటున్న కూలీల వద్దకు స్వయంగా వెళ్లి, బురదమ‌య‌మైన‌ పొలంలోకి దిగారు. కూలీల ఆరోగ్యం, వ్య‌వ‌సాయ ప‌నుల గురించి అడిగి తెలుసుకున్నారు. వర్షం కారణంగా పని చేస్తూ తడిసిపోతున్న కూలీలకు రక్షణగా ఉండేలా ప్రత్యేకంగా తయారు చేసిన రెయిన్ క‌వ‌ర్స్‌ను పంపిణీ చేశారు. ఆమె స్వయంగా కూలీలకు కవర్లు తొడగడం ద్వారా తన ఆప్యాయ‌త‌ను చాటుకున్నారు. ఆ తర్వాత మంత్రి సీతక్క (Minister Seethakka) కూలీలతో మాట్లాడుతూ, వారికి అందుతున్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇతర సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అర్హులందరికీ రెండు మూడు రోజుల్లో రేషన్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి వారి వద్దకు ...
error: Content is protected !!