Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Kadapa | ఇంట‌ర్ విద్యార్థిని హ‌త్య‌లో ట్విస్ట్‌..
AndhraPradesh

Kadapa | ఇంట‌ర్ విద్యార్థిని హ‌త్య‌లో ట్విస్ట్‌..

Kadapa News | కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో ఇంటర్మీడియ‌ట్‌ విద్యార్థిని వైష్ణవి హత్య కేసులో కీల‌క మ‌లుపు చోటుచేసుకుంది. పోలీసుల దర్యాప్తులో అనేక ముఖ్య‌మైన‌ ఆధారాలు సేకరించారు. వైష్ణవి హత్యలో తన స్నేహితుడు లోకేశ్ పాత్ర లేదని డీఐజీ ప్రవీణ్ స్ప‌ష్టం చేశారు. విద్యార్థినిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని తెలిపారు. కాగా, ఎర్రగుంట్ల మండలానికి చెందిన వైష్ణవి గ‌త‌ సోమవారం క‌ళాశాల‌కు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చేప‌ట్ట‌గా గండికోటలో విద్యార్థిని మృతదేహం ల‌భ్య‌మైంది.. వైష్ణవి చివరిసారిగా స్నేహితులు లోకేష్ ద్విచక్ర వాహనంపై గండికోటకు వెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో అతనే హత్య చేశాడని కుటుంబం ఆరోపిస్తోంది. దీనితో పోలీసులు లోకేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించ‌గా.. ఇప్పటివరకు దర్యాప్తులో అతనికి హత్యకు సంబంధం లేదని డీఐజీ కోయ ప్రవీణ్ స్పష...
TGBKS | ఎమ్మెల్సీ కవితకు షాక్‌..! బొగ్గు గని కార్మిక సంఘం నుంచి ఉద్వాసన.. ?
State

TGBKS | ఎమ్మెల్సీ కవితకు షాక్‌..! బొగ్గు గని కార్మిక సంఘం నుంచి ఉద్వాసన.. ?

TGBKS | తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TGBKS) నుంచి MLC కవితకు ఉద్వాసన పలికారు. ఇప్పటివరకు ఆ సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవిత స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించారు. తెలంగాణ భవన్‌లో సమావేశమైన సంఘం నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై TGBKS.. బీఆర్ఎస్‌కు అనుబంధంగా పనిచేయాలని నిర్ణయించారు. కవిత, KTRల మధ్య విభేదాలు పెరుగుతున్న తరుణంలో KTR కొప్పుల ఈశ్వర్‌ను నియమించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతల సమావేశం బుధ‌వారం సాయంత్రం జ‌రిగింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పార్టీకి అనుబంధంగా అనేక కార్యక్రమాలను చేపట్టాలని ఈ స‌మావేశంలో నిర్ణ‌యించారు. ఈ దిశగా సింగరేణి ప్రాంతంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జీలు, మాజీ మంత్రులతో సమన్వయం చేసుకోవాల‌ని కేటీఆర్ సూచించార...
ACB | ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌
Crime

ACB | ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌

హైదరాబాద్‌లో పంచాయతీరాజ్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ కనకరత్నం ఏసీబీ (ACB ) వలకు చిక్కారు. డీఈని బదిలీ చేసేందుకు కనకరత్నం రూ. 50వేలు డిమాండ్‌ చేశారు. సరిగ్గా ఆ లంచం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ తో ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఎర్రమంజిల్‌లోని పంచాయతీరాజ్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ACB కి ఇలా ఫిర్యాదు చేయవచ్చు.. వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ...
Illegal Registrations | జీవో నెం.. 257 కు తూట్లు..
Special Stories

Illegal Registrations | జీవో నెం.. 257 కు తూట్లు..

గతంలో సస్పెండ్ అయినా తీరు మార్చుకోని సబ్ రిజిస్ట్రార్ గుట్టుచప్పుడు కాకుండా జీవో నెం 257 ను అతిక్రమించి రిజిస్ట్రేషన్లు రూల్స్ అంటే ఏమిటో లెక్కచేయకపోవడం కొంతమంది అధికారులకు అలవాటు. గతంలో జీవో నెం. 257 నిబంధనలను ఉల్లంఘించి సస్పెండ్ అయిన ఓ సబ్ రిజిస్ట్రార్, మరోసారి అదే జీవోను ఉల్లంఘిస్తూ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయన గతంలో నల్గొండ జిల్లాలో అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడి వార్తల్లో నిలిచారు. సస్పెండ్ అయినా తీరు మార్చుకోలేదు. ఇటీవల వరంగల్ (రూరల్)కి బదిలీ అయిన ఆయన, అక్కడ కూడా అదే తంతు కొనసాగించారు. రిజిస్ట్రేషన్ శాఖలో తాను నిజాయితీ పరుడినన్న పేరు కోసం ప్రయత్నించినా, అఫీసు లోపల గుసగుసలు మాత్రం వేరే కధ చెబుతున్నాయి. Illegal Registrations in Warangal | ఆ సబ్ రిజిస్ట్రార్ నిబంధనలు అతిక్రమించడంలో ఘనాపాటి అని విశ్వసనీయంగా తెలిసింది.గతంలో నిబంధనలు అతిక్రమించి...
Yadadri | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య.. రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించే యత్నం..
Crime

Yadadri | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య.. రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించే యత్నం..

Yadadri Bhuvanagiri News | వివాహేతర సంబంధం ఓ ప‌చ్చ‌ని సంసారాన్ని విచ్ఛిన్నం చేసింది. తన వివాహేత‌ర సంబంధానికి అడ్డుగా మారాడన్న కోపంతో భార్య ప్రియుడితో కలిసి పక్కా ప్రణాళిక ప్రకారం క‌ట్టుకున్న‌ భర్తను అంత‌మొందించింది. రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేసినా… చివరికి పోలీసుల విచార‌ణ‌తో కుట్ర బయటపడింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘాతుకం అంద‌రినీ తీవ్రంగా కలిచివేసింది. పోలీసులు, స్థానికుల క‌థ‌నం ప్ర‌కారం.. యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District) ఆత్మకూరు మండలం పల్లెర్లకు చెందిన వస్తువుల స్వామి (38) ను మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన స్వాతితో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. స్వామి స్వగ్రామంలోనే ఉంటూ భువనగిరిలో ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. భార్య స్వాతి కూడా ఇదే షో రూంలో పనిచేస్తోంది. ఈ ...
error: Content is protected !!