Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Hyderabad | మున్సిపల్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Hyderabad, State

Hyderabad | మున్సిపల్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Hyderabad : మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్‌ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బుధ‌వారం అధికారులతో సమీక్ష (GHMC Review Meeting) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న తాగునీటి సరఫరా, డ్రైనేజ్, శానిటేషన్, తదితర అభివృద్ధి కార్యక్రమాలపై పురోగతిని సీఎం సమీక్షించారు. సీఎం సూచించిన కీలక అంశాలు: అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను వెనువెంట‌నే పూర్తి చేయాలి. వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ (Dengue), చికున్ గున్యా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టండి. డ్రైనేజ్ ఓవర్‌ఫ్లో ఉండకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. తాగునీరు కలుషితం కాకుండా నిరంతర పర్యవేక్షణ అవసరం. దోమల నివారణకు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. భవిష్యత్‌ నగర ద...
Hanamkonda | రెజోనెన్సు గుప్పిట్లో డీఐఈఓ..?
Special Stories

Hanamkonda | రెజోనెన్సు గుప్పిట్లో డీఐఈఓ..?

అనుమతుల్లేని బ్రాంచీలపై చర్యలేవీ? అధికారులపై తీవ్ర ఆరోపణలు బ్రాంచీలను సీజ్ చేయకుండా ఉండేందుకు జిల్లా అధికారిని మచ్చిక చేసుకున్నట్లు ఆరోపణలు..?డిఐఈఓ తెలిసే రెజోనెన్సు యాజమాన్యం అనుమతిలేకుండా బ్రాంచీలు నిర్వహిస్తున్నట్లు ప్రచారం..? హన్మకొండ డిఐఈఓ ఎలా స్పందిస్తారో ? Hanamkonda News | తమకున్న పలుకుబడితో అనుమతి లేకుండా నగరంలో బ్రాంచీలు నిర్వహిస్తున్న రెజోనెన్సు (Resonance) యాజమాన్యం ఏకంగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారినే తమ గుప్పిట్లో ఉంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. చర్యలు తీసుకోవాలన్న.. అనుమతి లేని బ్రాంచీలను సీజ్ చేయాలన్న ఆ అధికారం డీఐఈవో (DIEO) కే ఉంటుంది కనుక ఆ అధికారినే వారు ప్రసన్నం చేసుకొని అనుమతి లేకుండా 5 బ్రాంచీలు నిర్వహిస్తూ ఐఐటీ(IIT), జేఈఈ(JEE), నీట్(NEET) పేరిట విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీఐఈవోకు తె...
ACB Investigation | అక్రమాస్తుల కేసులో ఇరిగేషన్‌ ఈఈ శ్రీధర్‌ విచారణ
Crime

ACB Investigation | అక్రమాస్తుల కేసులో ఇరిగేషన్‌ ఈఈ శ్రీధర్‌ విచారణ

ACB Investigation | అక్రమ ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఈఈ) నూనె శ్రీధర్‌ను కస్టడీలోకి తీసుకుని ఏసీబీ అధికారులు మంగళవారం ఐదో రోజు విచారించారు. ఇప్పటివరకు చేపట్టిన విచారణలో శ్రీధర్‌ అక్రమంగా సంపాదించిన డబ్బును రియల్‌ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ మెంట్ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. శ్రీధర్‌ బ్యాంకు లాకర్లలో భారీగా ఆస్తి పత్రాలు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లలో స్వాధీనం చేసుకున్న ఆస్తులు విలువ సుమారు రూ. 5 కోట్లు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project ) నిర్మాణంలో 6, 7, 8 పనులు పర్యవేక్షించిన ఈఈ నూనె శ్రీధర్‌ అక్రమాస్తుల చిట్టా లెక్కించిక కొద్దీ పెరిగిపోతోంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే వందల కోట్ల విలువైన ఆస్తుల్ని గుర్తించిన అధికారులు.. కోర్టు ...
ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్య‌ద‌ర్శి
Crime

ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్య‌ద‌ర్శి

రూ.21వేలు లంచం తీసుకుంటుండగా అదుపులోకి.. Nirmal News | నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం గోడిసెర్యాల గ్రామ పంచాయతీ సెక్రటరీ (Panchayat Secretary) శివకృష్ణ లంచం (Bribe) తీసుకుంటూ ఏసీబీ అధికారులకు (ACB Trap) ప‌ట్టుబ‌డ్డాడు. మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో బాధితుడి నుంచి రూ.12 వేల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.గోడిసెర్యాల గ్రామానికి చెందిన జి.రాజేశం గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటుచేసుకోవ‌డానికి గాను పంచాయతీ కార్య‌ద‌ర్శి వ‌ద్ద అనుమ‌తి కోరాడు. దీంతో కార్య‌దర్శి శివ‌కృష్ణ‌ 12 వేల రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో రాజేశం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం గోడిసెర్యాల గ్రామపంచాయతీ కార్యాలయంలో లంచం తీసుకుంటూ పంచాయతీ సెక్రటరీని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ACB అధికారులకు ఇలా ఫిర్యాదు చేయొచ్చు ఎవరైనా ప్రభుత్వ అధికారి లేదా స...
Education Scam | అనుమతులు లేకుండా బ్రాంచీలు నిర్వహిస్తున్న ‘రెజోనెన్స్’ కళాశాలలు
Special Stories

Education Scam | అనుమతులు లేకుండా బ్రాంచీలు నిర్వహిస్తున్న ‘రెజోనెన్స్’ కళాశాలలు

రంగురంగుల బ్రోచర్ల మాయలో పడిపోతున్న తల్లిదండ్రులు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఏం చేస్తోంది? Education Scam in Hanmakonda | ఆకర్షణీయమైన యాడ్ లు, నగరంలో పెద్ద పెద్ద హోర్డింగ్ లు, తల్లిదండ్రులను బురిడీ కొట్టించే బ్రోచర్ లు, మాయమాటలతో కనికట్టు చేసే పిఆర్వోలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కార్పొరేట్ కాలేజీగా ప్రచారం చేసుకోవడంలో రెజోనెన్సు కళాశాల యాజమాన్యం జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ దాగి వుంది. పెద్ద ఎత్తున అడ్మిషన్లనే టార్గెట్ గా పెట్టుకున్న సదరు కళాశాల యాజమాన్యం.. ఎక్కడ ఖాళీ బిల్డింగ్ దొరికితే చాలు అక్కడ బ్రాంచీలు ఓపెన్ చేసి తమ విద్యా వ్యాపారాన్ని విస్తరించుకుంటూ పోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఆ కాలేజీ కి అనుమతులు ఎన్ని? వారు నిర్వహిస్తున్న బ్రాంచీలు ఎన్ని ? అనే విషయం ఇప్పుడు ఇటు విద్యాశాఖతో పాటు అటు హన్మకొండ నగరంలో చర్చనీయాంశంగా...
error: Content is protected !!