Telangana Govt| తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..!
Hyderabad : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కారు (Telangana Govt) గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ నెలకు సంబంధించిన బకాయిలు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖలకు పెండింగ్ బిల్లులు మొత్తం రూ.1,031 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) ఆదేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు నిధులను విడుదల చేశారు. శుక్రవారం ప్రజా భవన్ లో ఆర్థిక శాఖ అధికారులతో ఉపముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల బకాయిలను దశలవారీగా ప్రతినెలా డిప్యూటీ సీఎం క్లియర్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా అక్టోబర్ నెలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లు డిప్యూటీ సీఎం ఆదేశం మేరకు ఆర్థిక శాఖ విడుదల చేసింది.
మరోవైపు రూ.10 లక్షల లోపు పెండింగ్ లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలని ప్రభుత్వం ని...




