Sarkar Live

Author: Avunuri virat

ఆవునూరి విరాట్.. స‌ర్కార్ లైవ్ లో ఆయ‌న డిజిట‌ల్ కంటెంట్ ప్రొవైడ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 6 సంవ‌త్స‌రాలకుపైగా అనుభవం ఉంది. రాష్ట్ర‌, జాతీయ, అంత‌ర్జాతీయ అంశాల‌కు సంబంధించిన క‌థ‌నాల‌ను అందిస్తుంటారు.
ACB Arrest  : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై
Crime

ACB Arrest : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

ACB Raids | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఓ కేసు విషయంలో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ. 40 వేల డిమాండ్ చేశారనే ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. వీడియో, ఆడియోటేపుల ఆధారంగా ఎస్ఐ రంజిత్ ను పక్కా ప్లాన్​ వేసి పట్టుకున్నారు. సుమారు మూడు గంటలపాటు విచారించిన అధికారులు.. రంజిత్ లంచం డిమాండ్ చేసినట్లు నిర్ధారించారు. ఎస్ ఐ రంజిత్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసు వివరాలను ఖమ్మం ఏసీబీ ఇంచార్జ్ డీఎస్పీ విజయ్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన ఇద్దరు వ్యక్తులకు స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు వారి వద్ద నుంచి రూ.40వేలు ఎస్సై రంజిత్ డిమాండ్ చేశాడు. బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో వారు పక్కాగా వల పన్ని ఎస్ఐని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ సంఘటనతో మణుగూరులో కలకలం రేగింది. ప్రభుత్వ ఉద్యోగులు అవి...
Chhattisgarh | ఛత్తీస్‌గఢ్ నారాయణ్‌పూర్‌లో ఎన్‌కౌంటర్
National

Chhattisgarh | ఛత్తీస్‌గఢ్ నారాయణ్‌పూర్‌లో ఎన్‌కౌంటర్

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో సోమవారం భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక నక్సలైట్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్రకు ఆనుకుని ఉన్న అభుజ్‌మాద్ ప్రాంతంలోని అడవిలో ఉదయం భద్రతా దళాల బృందం సోదాలు నిర్వహిస్తుండగా కాల్పులు జరిగాయని ఇక్కడి పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆ ప్రాంతంలో నక్సలైట్లు ఉన్నారనే సమాచారం అంద‌డంతో ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు, ఒక నక్సలైట్ మృతదేహాన్ని సంఘటనా స్థలం నుండి స్వాధీనం చేసుకున్నామని, ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ ఏడాది 248 మంది నక్సలైట్లు హతం తాజా ఎన్‌కౌంట‌ర్‌తో ఈ సంవత్సరం ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 248 మంది నక్సలైట్లు హతమయ్యారు. వారిలో 219 మంది ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ డివిజన్‌లో హతమార్చబడ్డారు, మరో 27 మంది రాయ్‌పూర్ డివిజన్‌లోని ...
Medaram | మరింత విశాలంగా మేడారం గుడి ప్రాంగణం
State, warangal

Medaram | మరింత విశాలంగా మేడారం గుడి ప్రాంగణం

Medaram Temple | ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆదివాసి జాతరగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణం (Medaram Temple) అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర స‌ర్కారు నిర్ణయించింది. మేడారం ఆలయానికి విచ్చేసే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతున్న నేపథ్యంలో, పూజారుల అభిప్రాయాలు, ఆలోచనల మేరకు అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో గురువారం సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఆలయ అభివృద్ధికి సంబంధించి డిజైన్లు దాదాపు ఖరారు చేశారు. సీఎం ఆమోదం తర్వాత పనులు ప్రారంభం కానున్నాయి. సీఎం ఆమోదం తర్వాత ఆలయ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని శంకుస్థచేస్తారని మంత్రులు ప్రకటించారు. ప్రస్తుతం మేడారం ఆలయ ప్రాంగణంలో ఒకేసారి సుమారు 7,000 మంది భక్తులు తల్లులను దర్శించుకునే సౌకర్యం ఉంది. అయితే విస్తరణ పనులు పూర్తయ్య...
Wanaparthy | ఏసీబీ వ‌ల‌లో అవినీతి అధికారులు
Crime

Wanaparthy | ఏసీబీ వ‌ల‌లో అవినీతి అధికారులు

Wanaparthy District : మ‌రో ఇద్ద‌రు అవినీతి అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారుల‌కు చిక్కారు. వ‌న‌ప‌ర్తి జిల్లా (Wanaparthy) కొత్తకోట మండలం నీర్వేన్ గ్రామానికి చెందిన ఓ రైతు ఇనాం భూముల ఓఆర్సీ కోసం ఆర్డీవో (RDO)కు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాలని ఆర్డీఓ కొత్తకోట ఎమ్మార్వోకు పంపారు. దీంతో తహసీల్దార్ ఇనాం భూములకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని ఎమ్మారై వాసు, డిప్యూటీ సర్వేయర్ నవీన్ రెడ్డిని ఆదేశించారు. ఈ మేరకు వీరిద్ద‌రు సదరు రైతు నుంచి రూ.40 వేలు ఇస్తేనే ప‌నిచేసి పెడ‌తామ‌ని చెప్పారు. స‌ద‌రు రైతు అంత‌పెద్ద మొత్తంలో డ‌బ్బులు ఇవ్వ‌లేని మొర‌పెట్టుకున్నా వారు విన‌లేదు.దీంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వెంట‌నే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం కోసం ఎంఆర్ఐ వాసు, డిప్యూటీ సర్వేయర్ నవీన్ రెడ్డి డిమాండ్‌ చేసినట్లు ఆధారాలను సే...
TGSRTC : బ‌తుక‌మ్మ‌, దసరాకు టీజీఎస్ఆర్టీసీ 7754 ప్రత్యేక బస్సులు
State, Hyderabad

TGSRTC : బ‌తుక‌మ్మ‌, దసరాకు టీజీఎస్ఆర్టీసీ 7754 ప్రత్యేక బస్సులు

ఈనెల 20 నుంచి అక్టోబ‌ర్ 2 వరకు స్పెష‌ల్ స‌ర్వీసులు ప్ర‌జ‌ల‌ను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేలా ఏర్పాట్లు TGSRTC Special Buses 2025 : బ‌తుక‌మ్మ‌, దసరా పండుగల నేప‌థ్యంలో ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ పండుగ‌ల‌కు రాష్ట్రవ్యాప్తంగా 7,754 ప్ర‌త్యేక‌ బ‌స్సుల‌ను (Bathukamma Dasara Special Services) బస్సులను నడపడానికి ప్రణాళికను సిద్ధం చేసింది. అందులో 377 స్పెష‌ల్ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని క‌ల్పించింది. ఈనెల 20 నుంచి అక్టోబ‌ర్ 2 వరకు ప్ర‌త్యేక బ‌స్సులను న‌డ‌ప‌నుంది. సద్దుల బ‌తుకమ్మ ఈనెల 30న‌, దసరా అక్టోబ‌ర్ 2న ఉన్నందున.. ఈ నెల 27 నుంచే సొంతూళ్ల‌కు ప్ర‌యాణికుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌త్యేక బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచ‌నుంది. అలాగే, తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6వ తేదీల్లోనూ రద్దీ...
error: Content is protected !!