Sarkar Live

Author: SreeRam

శ్రీరామ్ వెన్ను గారికి పదిహేను సంవత్సరాలకు పైగా జర్నలిజంలో అనుభవం ఉంది. ప్రముఖ పత్రికలు ఆంధ్ర‌జ్యోతి, ఈనాడులలో పనిచేసారు. రాము వెన్ను వెబ్ సైట్ రూపకల్పన మరియు కంటెంట్ జనరేషన్ లలో నిష్ణాతులు.
Bomb Threat | కువైట్-హైదరాబాద్ ఇండిగో విమానంలో ‘మానవబాంబు’ బెదిరింపు!
State, Crime

Bomb Threat | కువైట్-హైదరాబాద్ ఇండిగో విమానంలో ‘మానవబాంబు’ బెదిరింపు!

హుటాహుటిన ముంబైకి మళ్లింపు.. ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్! హైదరాబాద్‌ | కువైట్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఇండిగో విమానంలో 'మానవబాంబు' బెదిరింపు (Indigo Bomb Threat) కలకలం సృష్టించింది. ఈ తెల్లవారుజామున ఈమెయిల్ ద్వారా హెచ్చరిక అందడంతో, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ విమానాన్ని అత్యవసరంగా ముంబైకి దారి మళ్లించారు. Bomb Threat : ప్రమాద హెచ్చరిక ఎలా వచ్చింది? కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఈరోజు వేకువజామున 1:20 నిమిషాలకు బయలుదేరిన ఈ ఇండిగో విమానం (Flight) ఉదయం 7:42 నిమిషాలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే, విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే.. "విమానంలో మానవబాంబు ఉంది, దీన్ని పేల్చివేస్తాం" అంటూ దిల్లీ విమానాశ్రయానికి ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు వ‌చ్చాయి.. ముంబైలో కట్టుదిట్టమైన భద్రత ఈమెయిల్‌ను తీవ్రంగా పరిగణించిన అధికారులు వెంటనే అప్రమత్తమై, విమ...
‘అయ్యప్ప దీక్ష’ దుమారం: డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. అసలేం జరిగిందంటే? – Telangana Police
State, Hyderabad

‘అయ్యప్ప దీక్ష’ దుమారం: డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. అసలేం జరిగిందంటే? – Telangana Police

Hyderabad : తెలంగాణ పోలీస్ శాఖ (Telangana Police) లో 'అయ్యప్ప దీక్ష' అంశం తాజాగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విధుల్లో ఉన్నప్పుడు అయ్యప్ప మాల ధారణ కోసం నలుపు రంగు దుస్తులు ధరించడానికి ఒక సబ్ ఇన్‌స్పెక్టర్‌కు (SI) ఉన్నతాధికారులు అనుమతి నిరాకరించడం వివాదాస్ప‌ద‌మైంది. దీనిని నిరసిస్తూ గురువారం లక్డికాపూల్‌లోని డీజీపీ కార్యాలయం వద్ద అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన (Ayyappa Devotees Protest,)కు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసలేం జరిగింది? కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ సబ్ ఇన్‌స్పెక్టర్, తాను అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నానని, ఆ సమయంలో యూనిఫామ్‌కు బదులుగా నలుపు రంగు దుస్తులు ధరించడానికి, గడ్డం పెంచుకోవడానికి, పాదరక్షలు లేకుండా విధులకు హాజరయ్యేందుకు అనుమతి అధికారుల‌ను కోరారు. అయితే, దీనిపై స్పందించిన అదనపు డీసీపీ (ఆగ్నేయ) సదరు ఎస్సై అభ్యర్థనను తిరస్క...
Vemulawada | వేములవాడ ఆలయం మూసివేతతో భక్తుల్లో నిరాశ
State, Karimnagar

Vemulawada | వేములవాడ ఆలయం మూసివేతతో భక్తుల్లో నిరాశ

ఆలయ ద్వారాల ఎదుటే పూజలు నిర్వహిస్తున్న భక్తులు కరీంనగర్: వేములవాడలోని ప్ర‌సిద్ధ‌ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం (Vemulawada Temple) బుధవారం పూర్తిగా మూసివేశారు. మ‌హ‌దేవుడికి ప్ర‌తీక‌ర‌మైన కార్తీక మాసం కావ‌డంతో సుదూర ప్రాంతాల నుంచి భ‌క్తులు వేముల‌వాడకు పోటెత్తుతున్నారు. అయితే ఆల‌య ప్ర‌ధాన ద్వారాలు మూసివేయ‌డంతో అక్కడ విచిత్రమైన పరిస్థితి నెలకొంది. పునరుద్ధరణ పనులు జరుగుతుండటంతో, అధికారులు దర్శనాలను నిలిపివేసి ఆలయ ప్రాంగణాన్ని సీజ్ చేశారు. సమీపంలోని భీమేశ్వర ఆలయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ, అనేక మంది భక్తులు ప్రధాన ఆల‌యానికి సంబంధించిన‌ మూసివేసిన ద్వారం వద్ద పెద్ద సంఖ్య‌లు భ‌క్తులు పూజలు నిర్వహించారు. భక్తులు ప్రధాన ద్వారం వద్ద ఆలయ పశ్చిమ భాగంలో ఉన్న శివుని విగ్రహం వద్ద కొబ్బరికాయలు కొట్ట‌డం, దీపాలు వెలిగించడం, ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌డం క‌నిపించింది. కార్తీక మాసం అత్యంత పవిత్...
Exit Polls | జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి?
Hyderabad, State

Exit Polls | జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి?

Jubilee Hills ByElection Exit Polls | తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్ర‌శాంతంగా ముగిసింది. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, ప్రధాన పోటీ కాంగ్రెస్‌, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌), బీజేపీ మధ్యనే జరిగింది. ఈనెల 14న ఓట్ల లెక్కింపు నిర్వ‌హించ‌నున్నారు. ఇక గెలుపెవరిదన్న ప్రశ్నకు సమాధానంగా వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు కాంగ్రెస్‌కు బ‌లాన్నిస్తున్నాయి. వివిధ సర్వేల ప్రకారం జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. చాణక్య స్ట్రాటజీస్‌ సర్వేకాంగ్రెస్‌కు 46%, బీఆర్‌ఎస్‌కు 43%, బీజేపీకి 6% ఓట్లు లభించే అవకాశం ఉందని అంచనా వేసింది. హెచ్‌ఎంఆర్‌ సర్వేకాంగ్రెస్‌కు 48.3%, బీఆర్‌ఎస్‌కు 43.18%, బీజేపీకి 5.84% ఓట్లు దక్కుతాయని తెలిపింది. స్మార్ట్‌ పోల్స్‌ సర్వేకాంగ్రెస్‌ 48.2%, బీఆర్‌ఎస్‌ 42.1%, బీజేపీ 7.6%, ...
కార్తీక పౌర్ణమి వేడుకలు.. శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ – Karthika Pournami 2025
LifeStyle

కార్తీక పౌర్ణమి వేడుకలు.. శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ – Karthika Pournami 2025

Karthika Pournami 2025 | కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వరంగల్‌ జిల్లాలోని వేయి స్తంభాల గుడి, భ‌ద్ర‌కాళి ఆల‌యం, వ‌రంగ‌ల్‌లోని క‌ట్ట‌మ‌ల్ల‌న్న‌దేవాల‌యం, కోటిలింగాల దేవాల‌యం, ఐన‌వోలు మ‌ల్లికార్జున‌స్వామి దేవాల‌యం, ములుగు జిల్లా రామప్ప, భూపాల‌ప‌ల్లి జిల్లా కాళేశ్వరం, హ‌నుమ‌కొండ‌లోని సిద్దేశ్వరాలయం, కోటగుళ్లు, పాలకుర్తి సోమేశ్వర ఆలయంలో భ‌క్తులు పోటెత్తారు. మ‌హ‌దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ త‌మ మొక్కులు తీర్చుకుంటున్నారు. పుణ్యస్నానాలు, దీపోత్సవాలు కార్తీక పౌర్ణ‌మిని పుర‌స్క‌రించుకొని కాళేశ్వరం వ‌ద్ద గోదావ‌రి త్రివేణి సంగమంలో పెద్ద సంఖ్య‌లో మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అలాగే భద్రాచలం వద్ద గోదావరి ఘాట్‌ల వద్ద భక్తులు స్నానాలు చేసి, ఆలయంలో కార్తీ...
error: Content is protected !!