Sarkar Live

Big Encounter | భారీ ఎన్‌కౌంట‌ర్.. 38 మంది మావోయిస్టుల హ‌తం!

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల బోర్డర్ (Telangana and Chhattisgarh border)లో ఉన్న కర్రెగుట్ట (Karreguttalu)ల్లో భారీ ఎన్‌కౌంటర్ (Encounter) జరిగింది. ఈ కాల్పుల్లో 38 మంది మావోయిస్టులు (Maoists) చనిపోయార‌ని తెలుస్తోంది. ఎదురుగా జరిగిన కాల్పుల్లో ఒక జవాన్‌కు గాయాలయ్యాయి. ప్రస్తుతం

Police transfer

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల బోర్డర్ (Telangana and Chhattisgarh border)లో ఉన్న కర్రెగుట్ట (Karreguttalu)ల్లో భారీ ఎన్‌కౌంటర్ (Encounter) జరిగింది. ఈ కాల్పుల్లో 38 మంది మావోయిస్టులు (Maoists) చనిపోయార‌ని తెలుస్తోంది. ఎదురుగా జరిగిన కాల్పుల్లో ఒక జవాన్‌కు గాయాలయ్యాయి. ప్రస్తుతం కర్రెగుట్టల్లో ఇంకా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ‘ఆపరేషన్ కగార్’ ( Operation Kagaar) అనే పేరుతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ బోర్డర్ ప్రాంతం అగ్నిగుండంలా మారింది. భద్రతా బలగాలు (Security forces) కర్రెగుట్టలే లక్ష్యంగా చుట్టుముట్టి వెతుకుతున్నాయి. వాళ్లు బాంబులు కూడా వేస్తున్నారు. దీనివల్ల చాలా మంది మావోయిస్టులు చనిపోయారని తెలుస్తోంది. దీంతో ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం (Dandakaranya region of Chhattisgarh)లో ఏం జరుగుతుందో అని జ‌నం భ‌యాందోళ‌న చెందుతున్నారు.

Encounter :10 వేల భ‌ద్రతా బ‌ల‌గాలు

మావోయిస్టు పార్టీని పూర్తిగా తుడిచిపెట్టాల‌నే లక్ష్యంతో ‘ఆపరేషన్ కగార్’ జరుగుతోంది. దీని వల్ల తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ బోర్డర్ మొత్తం యుద్ధభూమిలా తయారైంది. మావోయిస్టుల ముఖ్య నాయకులే టార్గెట్‌గా కర్రెగుట్టల్లో నాలుగు రోజులుగా పెద్ద ఎత్తున వెతుకులాట జరుగుతోంది. దీనిలో చాలా మంది మావోయిస్టులు చనిపోయే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. కర్రెగుట్టలు మావోయిస్టులకు ఒక బలమైన కోటలాంటిది. 145 ఎకరాల్లో ఉన్న ఈ గుట్టల చుట్టూ దాదాపు పదివేల మంది భద్రతా బలగాలు ఉన్నారు.

కీల‌క నేత‌ల కోసం వెతుకులాట‌

కర్రెగుట్టల్లో మావోయిస్టుల అగ్ర‌నాయ‌కుడు, కమాండర్ హిడ్మా (Maoist commander Hidma)తో పాటు వేల మంది మావోయిస్టులు ఉన్నారని భద్రతా బలగాలు గుర్తించాయి. వాళ్ల కోసమే కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ జరుగుతోంది. ములుగు జిల్లా బోర్డర్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా వరకు, అలాగే మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలోని నదుల నుంచి మావోయిస్టులు తప్పించుకోకుండా మూడు వైపుల నుంచి భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. దాదాపు కొన్ని రోజులుగా కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం వేట కొనసాగుతోంది. కొత్త రకం ఆయుధాలతో, సాటిలైట్లు, డ్రోన్లు వాడుతూ మావోయిస్టుల మీద పై నుంచి బాంబులు వేస్తున్నారని తెలుస్తోంది. ఈ భయంకరమైన కాల్పుల్లో ఇప్పటివరకు 38 మంది మావోయిస్టులు చనిపోయారని సమాచారం.

వ్య‌తిరేకిస్తున్న పౌర‌సంఘాలు

కర్రెగుట్టల్లో జరుగుతున్న ఈ భీకరమైన కాల్పులను చాలా మంది ప్రజాస్వామ్యవాదులు, పౌరహక్కుల సంఘాలు (Civil rights organizations) గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. కర్రెగుట్టల నుంచి భద్రతా బలగాలు వెనక్కి తగ్గాలని ఆ సంఘాల నేత‌లు అంటున్నారు. కానీ ఆపరేషన్ కగార్ మాత్రం ఆగడం లేదు. దేశం మధ్యలో ప్రభుత్వమే ప్రజల మీద యుద్ధం చేస్తోందని పౌరహక్కుల సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా శాంతి చర్చలు జరపాలని ‘భారత్ బచావో’ పేరుతో ఒక ఉత్తరం కూడా విడుదల చేశారు. అలాగే మావోయిస్టుల కేంద్ర కమిటీ కూడా చాలాసార్లు ఉత్తరాలు రాసి విజ్ఞప్తి చేసింది. చర్చలకు తాము సిద్ధమని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నుంచి కింది స్థాయి వాళ్ల వరకు చెప్పినా కేంద్ర ప్రభుత్వం గానీ, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గానీ పట్టించుకోలేదు. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం కలుగజేసుకొని కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలు జరిపేలా చూడాలని తెలంగాణ పౌరహక్కుల సంఘాలు కోరుతున్నాయి.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?