Stock market | వణికించిన ట్రేడ్ వార్.. భారత స్టాక్ మార్కెట్లో భారీ పతనం
                    Stock market : వాణిజ్య యుద్ధ భయాలతో ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. దీనికి ప్రభావంగా భారత స్టాక్ మార్కెట్ (Stock market) కూడా సోమవారం ఒక్కరోజే చరిత్రలోనే అరుదైన స్థాయిలో పడిపోయింది. ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ (BSE) సెన్సెక్స్ (Sensex), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) నిఫ్టీ (Nifty).. రెండూ 5 శాతం కంటే ఎక్కువ పతనమయ్యాయి. చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump’s tariff)టారిఫ్లు పెంచిన విషయానికి ప్రతిగా చైనా కూడా రివెంజ్ టారిఫ్లు విధించడంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారుల్లో భయం చెలరేగింది.
ఒకరోజే 3,939 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్
BSE సెన్సెక్స్ 30 షేర్ల సూచీ సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే 3,939 పాయింట్లు (-5.22%) పడిపోయి 71,425.01 వద్దకు చేరింది. అదే సమయంలో NSE నిఫ్టీ 1,160 పాయింట్లు (-5.06%) పడిపోయి 21,743.65కి చేరింది. మధ్యాహ్నం వర...                
                
             
								



