Electric vehicles | భారత్లో భారీగా ఈవీల విక్రయాలు.. తాజా రిపోర్ట్
Electric vehicles : భారతదేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 13 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు (electric vehicles (EVs) విక్రయమయ్యాయి. ఈ మేరకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ (Ministry of Heavy Industries) గణాంకాలు వెల్లడించింది. 11,49,334 ఎలక్ట్రిక్ టూ వీలర్లు (e-2W) అమ్ముడయ్యాయని తెలిపింది. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో 9,48,561 యూనిట్లతో పోలిస్తే 21 శాతం పెరుగుదల అని పేర్కొంది. అలాగే, ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల (e-3W) విక్రయాలు 1,59,235 యూనిట్లకు చేరుకుని, గత సంవత్సరం 1,01,581 యూనిట్లతో పోలిస్తే 57 శాతం వృద్ధిని సాధించాయని వివరించింది.
గ్రీన్ మొబిలిటీకి ప్రోత్సాహం.. PM E-DRIVE పథకం
ఎలక్ట్రిక్ వాహన తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్లో 'PM E-DRIVE' పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా 2026 మార్చి 31 వరకు 10,900 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. అలాగే, 2024 ఏప్రిల...




