Sarkar Live

Crime

Hyderabad |  హైదరాబాద్ లో  కాల్పుల కలకలం
Crime

Hyderabad | హైదరాబాద్ లో కాల్పుల కలకలం

Hyderabad Breaking News | హైదరాబాద్ లోని మలక్ పేటలో ఈ రోజు ఉదయాన్ని కాల్పులు జరిపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. శాలివాహననగర్ పార్క్ లో వాకర్స్ పై ఓ దుండగుడు ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో  సీపీఐ (CPI) నాయకుడు చందు నాయక్ (43) మృతిచెందాడు. మంగళవారం శాలివాహన నగర్ పార్క్ వద్ద ఉదయం నడకకు వెళుతుండగా గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. వారి నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తునున్న చందు రాథోడ్ వెంటాడి వెంబడించి గన్ తో నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి కారులో పరారయ్యారు. దుండగులు. హత్య సమయంలో ఐదురుగు మంది పాల్గొన్నట్లు సమాచారం. ఈ ఘటనలో చందు నాయక్ అక్కడికక్కడే మరణించాడు. నాయక్ తోడుగా వస్తున్న ఆయన భార్య, కూతురు చూస్తుండగానే ఈ సంఘటన జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం నర్సాయిపల్లికి చెందిన చందు నాయక్ హత్యకు భూ వివాదాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆధారాలు సేకరించడానికి ఫోరెన్స...
ACB Raids | రూ.90 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీకి చిక్కిన పీఆర్ ఏఈ
Crime

ACB Raids | రూ.90 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీకి చిక్కిన పీఆర్ ఏఈ

ACB Raids in Peddapalli : లంచగొండి అధికారి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం వద్ద పంచాయతీరాజ్ ఏఈ జగదీష్ రూ.90 వేలు లంచం తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కాల్వ శ్రీరాంపూర్ పంచాయతీరాజ్ ఏఈ జగదీష్ ఓదెల మండలం బాయమ్మపల్లి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ వద్ద నుంచి సీసీ రోడ్డు బిల్లు మంజూరు కోసం ఏకంగా రూ.90 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు విసిగిపోయి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కగా వల పన్ని.. బాధితుడి నుండి ఏఈ డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు.ఈసందర్భంగా డిఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ… ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ACB కి ఇలా ఫిర్యాదు చేయవచ్చు.. వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు త...
 ఢిల్లీలో పెను ప్రమాదం.. కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం – Delhi Building Collapse
Crime, National

 ఢిల్లీలో పెను ప్రమాదం.. కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం – Delhi Building Collapse

Delhi Building Collapse : న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలోని వెల్‌కమ్ ప్రాంతంలో శనివారం ఉదయం నాలుగు అంతస్తుల భవనం కుప్ప‌కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో శిథిలాల కింద ప‌లువురు చిక్కుకున్నారని పోలీసులు తెలిపారు. శిథిలాల నుంచి ముగ్గురిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప‌లు సంస్థలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని పోలీసులు తెలిపారు. "శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుపోవచ్చు" అని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. "ఉదయం 7 గంటలకు భవనం కూలిపోయినట్లు మాకు కాల్ వచ్చింది. ఏడు అగ్నిమాపక దళాలు సహా స‌హాయ‌క బృందాలు పనిచేస్తున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది" అని అధికారి తెలిపారు. స్థానికులు ఉదయం నడకకు వెళ్లినప్పుడు భవనం కూలిపోయింది. వీరిలో చాలామంది అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపు చిక్కుకున్న వారిని రక్షించడానికి ప్రయత్నించారు. తరువాత అగ్నిమాపక శాఖ సహాయంతో, ముగ్గురిని రక్షించారు. సీలంప...
Bribe ఏసీబీ వలలో సబ్​ఇన్​స్పెక్టర్​
Crime

Bribe ఏసీబీ వలలో సబ్​ఇన్​స్పెక్టర్​

మహిళా పోలీస్ స్టేషషన్​ సబ్ ఇన్స్పెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) కి పట్టుబడ్డాడు. కుటుంబ కలహాలతో అత్తింటి వారు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఓ వ్యక్తి గచ్చిబౌలి మహిళా పోలీసు స్టేషన్​కు వచ్చాడు. ఆ కేసు విచారణ చేస్తున్న ఎస్సై వేణుగోపాల్ బాధితుడి మీద అత్తింటి వారు ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకునేలా చేస్తానని, కేసు లేకుండా చూసుకుంటానని అందుకు తనకు కొంత మొత్తం (Bribe ) ఇవ్వాలని ఒప్పందంకుదుర్చుకున్నాడు. దీనికి బాధితుడు అంగీకరించి లంచమిచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈమేరకు గురువారం సాయంత్రం గచ్చిబౌలి మహిళా పోలీస్టేషన్ ఎస్సై వేణుగోపాల్ బాధితుడి వద్ద నుండి రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వేణుగోపాల్ ఇటీవలే పదోన్నతిలో భాగంగా ఎస్సైగా బాధ్యతలు చేపట్టినట్లు తెలుస్తోంది. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్...
పాల వ్యాపారంలో కల్తీ మాఫియా.. రాచకొండ ఎస్ఓటీ దాడుల్లో వెలుగులోకి..  – Adulterated milk racket
Crime

పాల వ్యాపారంలో కల్తీ మాఫియా.. రాచకొండ ఎస్ఓటీ దాడుల్లో వెలుగులోకి.. – Adulterated milk racket

Bhuvanagiri News | రాచకొండ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్ఓటి) అధికారులు భువనగిరిలోని రెండు యూనిట్లపై రెండు వేర్వేరు దాడులు నిర్వహించి కల్తీ పాల రాకెట్‌ (Adulterated milk Rocket) ను ఛేదించారు. పాలను హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించి కల్తీ చేశారని, ఎల్బీ నగర్, ఉప్పల్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌లోని స్వీట్ షాపులకు విక్రయించారని భోంగిర్ ఎస్ఓటీ ఇన్‌స్పెక్టర్ డి. ప్రవీణ్ బాబు గురువారం తెలిపారు. Adulterated milk : ఇద్దరు నిందితుల అరెస్టు.. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించి కల్తీ చేసిన పాలను విక్రయిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై సామల సత్తి రెడ్డి, కె. రఘు పట్టుబడ్డారని ఎస్​ఓటీ ఇన్​స్పెక్టర్​ తెలిపారు. నిందితులు పాలపొడిని కొనుగోలు చేస్తున్నారని, దీనిని సాధారణంగా బేకింగ్​ ఆహార పదార్థాలను తయారు చేయడానికి, హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపిన పాలను తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారని ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు...
error: Content is protected !!