Sarkar Live

Crime

Madhapur Accident | మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఎంత తీవ్రంగా అంటే..
Crime

Madhapur Accident | మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఎంత తీవ్రంగా అంటే..

Accident in Madhapur : హైద‌రాబాద్‌లోని మాదాపూర్ (Madhapur) లో హోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఇద్ద‌రు యువకులు బైక్‌పై అతి వేగంగా వెళ్తూ డివైడ‌ర్‌ను ఢీకొన్నారు. దీంతో ఇద్ద‌రూ ప్రాణాలు వ‌దిలారు. డివైడ‌ర్‌కు ఢీకొన‌డంతో బైక్ నుంచి మంట‌లు రావ‌డం ఈ ప్ర‌మాద తీవ్ర‌త‌ను సూచిస్తోంది. బైక న‌డిపేట‌ప్పుడు హెల్మెంట్ ధ‌రించ‌లేద‌ని తెలుస్తోంది. ఈ దృశ్యాల‌ను సీసీ కెమెరాల్లో (CCTV footage ) న‌మోద‌య్యాయి. భ‌యాన‌క దృశ్యం హైద‌రాబాద్‌లోని బోర‌బండాకు చెందిన ర‌ఘుబాబు (29) ఓ ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ((Software Company))లో ఉద్యోగం చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఆకాంక్ష్ (27) ఐటీ రంగంలో కొత్త‌గా చేరాడు. ఇద్ద‌రూ మంచి స్నేహితులు. వారిని చివ‌రిసారి ఓ బార్‌షాపులో చూసిన‌ట్టు ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపారు. శుక్ర‌వారం రాత్రి వీర‌ద్దరూ బైక్‌పై బ‌య‌ల్దేరారు. మ‌ద్యం మ‌త్తు ద్విచ‌క్రవాహ‌నాన్ని అతివేగంగా న‌డ‌ప‌డంతో...
Lucknow bank heist | ల‌క్నోలో బ్యాంక్ దోపిడీ.. పోలీసుల ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్ద‌రు నిందితుల మృతి..
Crime

Lucknow bank heist | ల‌క్నోలో బ్యాంక్ దోపిడీ.. పోలీసుల ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్ద‌రు నిందితుల మృతి..

Lucknow bank heist | లక్నో బ్యాంకు దోపిడీ కేసులో కీల‌క పరిణామం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ పోలీసులు గత 24 గంటల్లో రాష్ట్ర రాజధాని, ఘాజీపూర్‌లో వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు కీలక నిందితులను హతమార్చారు. లక్నోలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB)కి చెందిన 42 లాకర్లను పగులగొట్టి కోట్ల విలువైన నగలు, ఇతర విలువైన వస్తువులను ముఠా సభ్యులు దోచుకెళ్లారు (Bank Loot ). ఈ క్ర‌మంలో పోలీసులు పలుచోట్ల ఎన్‌కౌంట‌ర్లు చేప‌ట్ట‌గా ఇద్ద‌రు హ‌తమ‌య్యారు. Lucknow Encounter : లక్నోలోని చిన్‌హట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ పథ్‌లో పోలీసులకు, నిందితులకు మధ్య జరిగిన తొలి ఎన్‌కౌంటర్‌లో నిందితుడు సోబింద్ కుమార్ (29) హతమయ్యాడు. ఎన్‌కౌంటర్ తర్వాత పోలీసులు అతన్ని ఆసుపత్రిలో చేర్చారు, అక్కడ అతను చికిత్స పొందుతూ మరణించాడు. అతనితో పాటు ఉన్న మరో నిందితుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఘాజీపూర్‌లో రెండో ఎన్‌కౌంటర్ ఉత...
Car-ramming Attack | జర్మనీలో కార్ ర్యామింగ్ దాడి.. భారతీయుల‌కు గాయాలు
Crime

Car-ramming Attack | జర్మనీలో కార్ ర్యామింగ్ దాడి.. భారతీయుల‌కు గాయాలు

Car-ramming Attack : జర్మనీలోని మాగ్డెబర్గ్ నగరంలో కార్ ర్యామింగ్ దాడిలో ఐదుగురు మృతి చెందారు. 200 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల్లో ఏడుగురు భార‌తీయులు ఉన్నారు. ఈ మేర‌కు నిన్న రాత్రి బెర్లిన్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి ఒక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. శుక్రవారం సాయంత్రం సాక్సనీ-అనహాల్ట్ రాష్ట్రంలోని మాగ్డెబర్గ్ నగరం (Eastern German city of Magdeburg)లో 50 సంవత్సరాల వయసున్న‌ వ్యక్తి తన కారును క్రిస్మస్ మార్కెట్ (Christmas market)లో జనసందోహంపై నడిపాడు. దీంతో ఐదుగురు మృతి చెందార‌ని, వీరిలో తొమ్మిది సంవత్సరాల బాలుడు కూడా ఉన్నాడ‌ని, 200 మందికి పైగా గాయపడ్డారని జర్మన్ అధికారులు పేర్కొన్నారు. భార‌తీయుల‌కు సీరియ‌స్‌ కార్ ర్యామింగ్ దాడిలో ఏడుగురు భార‌తీయులు గాయ‌ప‌డ‌గా వారిని ఆస్ప‌త్రిలో చేర్చారు. వీరిలో ముగ్గురు డిశ్చార్జ్ కాగా మ‌రో న‌లుగురి ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంది. ఈ ఘటనను భ...
Food Poisoning | కామారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం..
Crime

Food Poisoning | కామారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం..

Food Poisoning : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా ఫుడ్ పాయిజనింగ్‌ ఘటన జుక్కల్ మండల కేంద్రంలోని షెడ్యూల్డ్ కులాల బాలుర హాస్టల్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు ఫుడ్‌పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు. Food Poisoning in Kamareddy District : కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండల కేంద్రంలోని షెడ్యూల్డ్‌ కులాల బాలుర హాస్టల్‌లో శుక్రవారం నలుగురు విద్యార్థులు ఫుడ్‌ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు. నివేదికల ప్రకారం, నలుగురు విద్యార్థులు మధ్యాహ్న భోజనం తర్వాత కడుపు నొప్పి, వాంతులయ్యాయి. వీరిని సిబ్బంది చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి తీవ్ర కడుపునొప్పి వచ్చి ఆస్పత్రిలో చేరాడు. అన్నం ఉడకపోవడం వల్ల కడుపునొప్పి వచ్చిందని విద్యార్థులకు చికిత్స అందిస్తున్న వైద్యులు ...
Fatal Accident | హైవేపై ఘోర ప్రమాదం.. ఐదుగురు స‌జీవ ద‌హ‌నం
Crime

Fatal Accident | హైవేపై ఘోర ప్రమాదం.. ఐదుగురు స‌జీవ ద‌హ‌నం

Fatal Accident : రాజ‌స్థాన్‌లోని జైపూర్-అజ్మీర్ జాతీయ రహదారిపై ఈ రోజు ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రసాయనాలు (Chemical) త‌ర‌లిస్తున్న ఓ ట్రక్కు అదుపు త‌ప్పి అనేక వాహనాలతో ఢీకొనడంతో భారీ అగ్ని ప్రమాదం జ‌రిగింది. ఈ ఘటనలో 30 వాహ‌నాలు ద‌గ్ధ‌మ‌య్యాయి. ఐదుగురు సజీవ ద‌హ‌న‌మ‌య్యారు. 37 మంది గాయపడ్డారు. వీరిలో చాలా మంది ప‌రిస్థితి విష‌మంగా ఉంది. భారీ ప్రమాదం (Fatal Accident) ఎలా జ‌రిగిందంటే.. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... రసాయన పదార్థాలు (కెమిక‌ల్స్‌) ర‌వాణా చేస్తున్న ఓ ట్ర‌క్కు జైపూర్‌- అజ్మీర్ జాతీయ ర‌హ‌దారి (National highway )పై అదుపు త‌ప్పి ఇతర వాహనాలను ఢీకొంది. దీంతో ట్రక్కులో ఉన్న రసాయనాలు అంటుకుని ఒక్క‌సారిగా మంటలు వ్యాపించాయి. చూస్తూ చూస్తుండానే 30కి పైగా వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక దళాలు కూడా ఆ వాహనాల వ‌ద్ద‌కు చేరుకోలేనంత‌గా మంట‌లు తీవ్రంగా వ్యాపించాయి. ఈ ప్ర‌మాదంతో ...
error: Content is protected !!