ACB Arrest : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై
                    ACB Raids | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఓ కేసు విషయంలో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ. 40 వేల డిమాండ్ చేశారనే ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. వీడియో, ఆడియోటేపుల ఆధారంగా ఎస్ఐ రంజిత్ ను పక్కా ప్లాన్ వేసి పట్టుకున్నారు. సుమారు మూడు గంటలపాటు విచారించిన అధికారులు.. రంజిత్ లంచం డిమాండ్ చేసినట్లు నిర్ధారించారు. ఎస్ ఐ రంజిత్ పై కేసు నమోదు చేశారు.
ఈ కేసు వివరాలను ఖమ్మం ఏసీబీ ఇంచార్జ్ డీఎస్పీ విజయ్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన ఇద్దరు వ్యక్తులకు స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు వారి వద్ద నుంచి రూ.40వేలు ఎస్సై రంజిత్ డిమాండ్ చేశాడు. బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో వారు పక్కాగా వల పన్ని ఎస్ఐని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. 
ఈ సంఘటనతో మణుగూరులో కలకలం రేగింది. ప్రభుత్వ ఉద్యోగులు అవి...                
                
             
								


