Sarkar Live

Crime

ACB Arrest  : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై
Crime

ACB Arrest : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

ACB Raids | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఓ కేసు విషయంలో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ. 40 వేల డిమాండ్ చేశారనే ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. వీడియో, ఆడియోటేపుల ఆధారంగా ఎస్ఐ రంజిత్ ను పక్కా ప్లాన్​ వేసి పట్టుకున్నారు. సుమారు మూడు గంటలపాటు విచారించిన అధికారులు.. రంజిత్ లంచం డిమాండ్ చేసినట్లు నిర్ధారించారు. ఎస్ ఐ రంజిత్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసు వివరాలను ఖమ్మం ఏసీబీ ఇంచార్జ్ డీఎస్పీ విజయ్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన ఇద్దరు వ్యక్తులకు స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు వారి వద్ద నుంచి రూ.40వేలు ఎస్సై రంజిత్ డిమాండ్ చేశాడు. బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో వారు పక్కాగా వల పన్ని ఎస్ఐని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ సంఘటనతో మణుగూరులో కలకలం రేగింది. ప్రభుత్వ ఉద్యోగులు అవి...
Man murdered | రీహాబిలిటేషన్ సెంటర్‌లో దారుణం.. సహచరుల దాడిలో ఒక‌రి హ‌తం
Crime

Man murdered | రీహాబిలిటేషన్ సెంటర్‌లో దారుణం.. సహచరుల దాడిలో ఒక‌రి హ‌తం

Miyapur Murder Case : హైదరాబాద్ మియాపూర్ (Miyapur) ప్రాంతంలోని ఓ ప్రైవేట్ రీహాబిలిటేషన్ సెంటర్ (rehabilitation centre )లో ఘోర ఘటన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. మాదక ద్రవ్యాల వ్యసనానికి చికిత్స పొందుతున్న ఓ వ్యక్తిని అదే సెంటర్‌లోని ఇద్దరు సహచరుల చేతిలో హ‌త్య‌కు గురైన‌ట్టు వెలుగులోకి వచ్చింది.ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) కు చెందిన సందీప్ మాదక ద్రవ్యాలకు అల‌వాటు ప‌డి (addicted to drug) వ్య‌స‌న‌పరుడిగా మారాడు. దీంతో అత‌డిని కుటుంబ సభ్యులు సుమారు తొమ్మిది నెలల క్రితం హైద‌రాబాద్‌లోని రీహాబిలిటేష‌న్ సెంటర్‌లో చేర్పించారు. మాదక ద్ర‌వాల‌ను వీడి అత‌డు సాధార‌ణ జీవితాన్ని గడుపుతాడ‌ని భావించారు. ఇదే క్ర‌మంలో న‌ల్ల‌గొండ జిల్లా (Nalgonda district)కు చెందిన ఆదిల్‌, హైద‌రాబాద్ బార్క‌స్‌కు చెందిన సులేమాన్ కూడా మూడు నెల‌ల క్రితం ఈ రీహాబిలేష‌న్ సెంట‌ర్‌లో చికిత్స కోసం చేరారు. బుధ‌వారం రాత్రి సందీప్‌తో ఆదిల్‌, సులేమ...
ఆన్‌లైన్ బెట్టింగ్ మాఫియాకు బిగ్ షాక్‌ – Betting racket
Crime

ఆన్‌లైన్ బెట్టింగ్ మాఫియాకు బిగ్ షాక్‌ – Betting racket

CID cracks online Betting racket : చ‌ట్ట విరుద్ధ ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యాపారం (online betting racket) పై తెలంగాణ రాష్ట్ర క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (Telangana CID) మెరుపు దాడులు చేసింది. తెలంగాణ కేంద్రంగా న‌డుస్తున్న ఈ దందాపై ఉక్కుపాదం మోపింది. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల వరకు విస్తరించి ఉన్న ఈ భారీ రాకెట్‌పై ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి, ఎనిమిది మందిని అరెస్టు చేసింది. ఈ రాకెట్‌ వెనుక ఉన్న పెద్ద నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఆరు యాప్‌ల ద్వారా కోట్ల వ్యాపారం సీఐడీ తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన నిందితులు ప్రజలను మోసం చేయడానికి ప్రత్యేకంగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను తయారు చేసి వాడుతున్నారు. Taj0077, Fairply.live, Andhra365, Vlbook, Telugu365, Yes365 అనే మొబైల్ యాప్‌ల ద్వారా వేలాది మందిని బెట్టింగ్ ఊబిలోకి దింపారు. తక్కువ ప...
Accident |  జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు మృతి, ఇద్దరు గాయాలు
Crime

Accident | జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు మృతి, ఇద్దరు గాయాలు

Mahabubnagar Accident News : మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ (Rajapur mandal) మండల కేంద్రం వద్ద జాతీయ రహదారి (National Highway-44)పై ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం (road accident) చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాలు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… హైదరాబాద్ (Hyderabad) నుంచి నంద్యాల (Nandyal) దిశగా వెళ్తున్న కారు అధిక వేగంతో ప్రయాణిస్తుండ‌గా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. వేగాన్ని అదుపులో పెట్టుకోలేక ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టాడు. దీంతో రెండు కార్లూ నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంలో చిక్కేపల్లి గ్రామానికి చెందిన బీరాం రంజిత్‌కుమార్ రెడ్డి, అతని బంధువు హరిక అక్కడికక్కడే మృతి చెందారు. వీరిద్దరూ హైదరాబాద్ వైపు వెళ్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరి మృతితో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది.మరో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్య...
Son kills mother | కొడుకు చేతిలో త‌ల్లి హ‌తం.. మ‌ద్యం మ‌త్తులో ఉన్మాదం
Crime

Son kills mother | కొడుకు చేతిలో త‌ల్లి హ‌తం.. మ‌ద్యం మ‌త్తులో ఉన్మాదం

Son kills mother : రంగారెడ్డి జిల్లా చెవెళ్ల (Chevella)లో జరిగిన దారుణ సంఘటన క‌ల‌కలం రేపింది. మద్యం మత్తులో ఓ వ్య‌క్తి క‌న్నత‌ల్లిని కొడ‌వ‌లితో దాడి చేసి హ‌త‌మార్చాడు. ఆ తర్వాత గ్రామస్థులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. చెవెళ్ల‌ మండలంలోని రెగడఘనపూర్ గ్రామం (Regadghanapur)లో నివసిస్తున్న జంగయ్య తన తల్లి నర్సమ్మ (75)తో కలిసి ఉండేవాడు. మద్యం మత్తులో అత‌డు తల్లితో ఏదో ఒక విష‌యంపై వాగ్వాదానికి దిగాడు. కొద్ది సేపటికే అత‌డు మ‌రింత కోపోద్రిక్తుడై విచ‌క్ష‌ణ కోల్పోయి ఉన్మాదిగా మారాడు. ఇంట్లోనే ఉన్న కోడవలిని తీసి త‌ల్లిపై దాడి చేసి (attacking) అత్యంత కిరాత‌కంగా గాయ‌ప‌ర్చాడు. దీంతో ఆమె అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. ఈ ఘటన శనివారం రాత్రే జరిగినప్పటికీ ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నర్సమ్మ మృతదేహం కనిపించడంతో గ్రామస్థులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే జంగయ్యను పట్టుకొని చెట్...
error: Content is protected !!