Skip to main content

Sarkar Live

Crime

COVID-19 Scam | కొవిడ్ ప‌రిక‌రాల స్కాం కేసులో సంచలన విషయాలు..
Crime

COVID-19 Scam | కొవిడ్ ప‌రిక‌రాల స్కాం కేసులో సంచలన విషయాలు..

COVID-19 Scam Case : కర్ణాటకలో కరోనా మహమ్మారి సమయంలో వైద్య పరికరాల కొనుగోలులో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై పోలీసులు తొలి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పాలనలో ఇది చోటుచేసుకుందని ఫిర్యాదు అంద‌డంతో ఈ మేర‌కు కేసు న‌మోదైంది. రూ. 167 కోట్ల కుంభ‌కోణం కోరానా మహమ్మారి సమయంలో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (PPE) కిట్లు, N-95 మాస్కుల కొనుగోలులో అవకతవకలు జ‌రిగాయ‌ని, దీంతో ప్ర‌భుత్వ ఖ‌జానాకు రూ. 167 కోట్ల నష్టం వాటిల్లిందని కర్ణాటక వైద్య విద్యా డైరెక్టరేట్ (DME) కు చెందిన ఎం. విష్ణు ప్రసాద్ చేసిన ఫిర్యాదు చేశారు. ఈ కుంభ‌కోణంలో పూర్వ DME డైరెక్టర్ పి.జి. గిరీష్, ఆఫీసర్లు జి.పి.రఘు, ఎన్. మునిరాజు ప్ర‌మేయం ఉంద‌ని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో డిసెంబ‌రు 14న వారిపై ఎఫ్‌ఐఆర్ న‌మోదైంది. అయితే.. ఈ ఎఫ్‌ఐఆర్‌లో ఏ రాకీయ నాయ‌కుడిని కూడా నిందితుడిగా పేర్కొన‌లేదు.ఈ వార్త‌...
Ganja | ఇంటి పెరట్లో గంజాయి.. అరెస్టు చేసిన పోలీసులు
Crime

Ganja | ఇంటి పెరట్లో గంజాయి.. అరెస్టు చేసిన పోలీసులు

Hanamkonda | సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఓ వ్యక్తి ఏకంగా తన ఇంటి పెరట్లోనే గంజాయి మొక్కలను (Ganja Plants) పెంచాడు తన ఇంటి పెరట్లో గంజాయి మొక్కల పెంపకం చేపట్టిన సదరు వ్యక్తిని యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళితే.. హ‌న్మ‌కొండ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాయంపేట ప్రాంతంలో నివాసం ఉండే అట్ల వెంకట నర్సయ్య (72), వ్యవసాయ కూలీగా పనిచేస్తూనే మరింత సులభంగా డబ్బు సంపాదించాలని ఓ ఐడియా వేసుకున్నాడు. ఇందుకోసం వెంకటనర్సయ్య తన ఇంటి పెరట్లో ఐదు అడుగుల విస్తీర్ణంలో గంజాయి మొక్కల పెంపకం చేపట్టి వాటిలో కొన్ని మొక్కలను ఎండబెట్టి విక్రయించేందుకు సిద్దమ‌య్యాడు. అయితే.. యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీం కు సమాచారం రావడంతో ఇన్‌స్పెక్టర్ సురేష్, ఆర్ఐ శివకేశవులు గంజాయి పెంచుతున్న ఇంటిలో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ బృందంతో తనిఖీలు చేపట్టగా ఇంటి పెరట్లో గంజాయి మొక్కను గుర...
Atul Subhash suicide case | అతుల్ ఆత్మ‌హ‌త్య కేసులో బిగ్ అప్డేట్
Crime

Atul Subhash suicide case | అతుల్ ఆత్మ‌హ‌త్య కేసులో బిగ్ అప్డేట్

Atul Subhash suicide case : గృహ హింస‌కు గురై ఆత్మ‌హ‌త్య చేసుకున్న అతుల్ సుభాష్ (34) కేసు అనేక మ‌లుపులు తిరుగుతోంది. అత‌డి అత్త నిషా సంఘానియా, బావ‌మ‌రిది అనురాగ్ సంఘానియాను క‌ర్ణాట‌క పోలీసులు శ‌క్ర‌వారం అరెస్టు చేశారు. అతుల్ భార్య ప‌రారీలో ఉంద‌ని పోలీసులు తెలిపారు. వేధింపులు త‌ట్టుకోలేక‌... అతుల్ ఆత్మ‌హ‌త్య ప్ర‌పంచ‌మంతా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వివాహిత పురుషులు కూడా గృహ హింస‌కు గురువుతున్నార‌నే విష‌యాన్ని ఎత్తి చూపింది. త‌న భార్య, ఆమె కుటుంబం త‌న‌ను డ‌బ్బుల కోసం వేధిస్తున్నార‌ని, రూ. 3 కోట్లు డిమాండ్ చేస్తూ మానసిక క్షోభ‌కు గురి చేస్తున్నార‌ని అతుల్ సుభాష్ డిసెంబ‌ర్ 9న ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. దీనికి ముందు 40 పేజీల సుదీర్ఘ సూసైడ్ నోట్ రాశాడు. దీంతోపాటు 90 నిమిషాల వీడియా ద్వారా త‌న భార్య నిఖిత సింఘానియా, ఆమె కుటుంబం త‌న‌ను ఎలా వేధించారో వివ‌రించాడు. నా అస్తిక‌లు కాలువ‌లో క‌ల‌పండి అతుల్ తన సూసై...
Lagacharla | లగచర్ల గిరిజన రైతుకు సంకేళ్లు వేసి తీసుకొచ్చిన జైలు సిబ్బంది ..
Crime

Lagacharla | లగచర్ల గిరిజన రైతుకు సంకేళ్లు వేసి తీసుకొచ్చిన జైలు సిబ్బంది ..

ఫార్మాసిటీపై ఆందోళ‌న చేప‌ట్టిన గిరిజన రైతులపై కేసు నమోదు చేసిన పోలీసులు మరోసారి వారిని అవ‌మానించేలా దారుణానికి పాల్పడ్డారు. అధికారులపై దాడులకు పాల్పడ్డార‌న్న ఆరోప‌ణ‌ల‌తో లగచర్ల (Lagacharla) కు చెందిన రైతు హీర్యానాయక్‌తో పాటు మరికొందరు రైతులను అరెస్టు చేసి జైలుకు తర‌లించిన విష‌యం తెలిసిందే.. కాగా హీర్యానాయక్‌కు గురువారం గుండె సమస్య త‌లెత్త‌డంతో అతడికి సంకెళ్ళ తోనే (Hand Cuffs) జైలు సిబ్బంది సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లి 2డీ ఈకో టెస్ట్ చేయించారు. సంకెళ్లు వేసి తీసుకురావడం స‌రికాద‌ని గతంలో న్యాయాస్థానాలు హెచ్చ‌రించినా కూడా పోలీసులు ప‌ట్టించుకోకుండా హీర్యానాయక్‌కు సంకెళ్లు వేయడంపై స‌ర్వ‌త్రా ఆగ్రహం వ్యక్త‌మ‌వుతోంది. . కాగా ఆసుపత్రిలో హీర్యా నాయక్ ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పరామర్శించారు. సీఎం రేవంత్ పై కేటీఆర్ ఆగ్ర‌హం ఇదిలా ఉండ‌గా లగచర్ల గిరిజన రైతులకు (Lagachar...
Atul Subhash Suicide: అతుల్ సుభాష్ ఆత్మహత్యపై ఆగ్రహ జ్వాల‌లు.. సోష‌ల్ మీడియాలో #JusticeForRishi ట్రెండింగ్‌!
Crime

Atul Subhash Suicide: అతుల్ సుభాష్ ఆత్మహత్యపై ఆగ్రహ జ్వాల‌లు.. సోష‌ల్ మీడియాలో #JusticeForRishi ట్రెండింగ్‌!

Atul Subhash Suicide : బెంగళూరులో 34 ఏళ్ల అతుల్ సుభాష్ ఆత్మహత్యపై దేశ‌వ్యాప్తంగా ఆగ్రహం వ్య‌క్త‌మ‌వుతోంది సోష‌ల్ మీడియాలో ఇప్పుడు #JusticeForRishi #JusticeForAtulSubhashతో Xలో ట్రెండింగ్ అవుతోంది రిషి త్రివేది కూడా సుభాష్ మాదిరిగానే డిసెంబరు 27, 2023న ఆత్మహత్య చేసుకుని మరణించాడని అతని సోదరుడు ఓమ్జీ త్రివేది తెలిపిన ప్రకారం, అతని భార్య "భావోద్వేగ వేధింపుల" కారణంగా మరణించాడు. అని తాజాగాపేర్కొన్నాడు. అతుల్ సుభాష్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు అతని సోదరుడి విషయంలో ఎలా ఉన్నాయో వివ‌రిస్తూ ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. "అతుల్ సుభాష్ లాగానే, నా సోదరుడు కూడా అతని భార్య శిఖా అవస్తి వేధింపులు భ‌రించ‌లేక ఆత్మహత్య చేసుకున్నాడు. డిసెంబర్ 27, 2023 న, ఆమె క్రూరత్వాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు," అని ఓమ్జీ ఒక X పోస్ట్‌లో రాశారు. . అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు అతుల్ సుభాష్ 24 పేజీల నోట్‌లో తన విడ...
error: Content is protected !!