Sarkar Live

Crime

Train Accident | ప్యాసింజర్‌ రైలు గూడ్స్‌ రైలు ఢీ.. పలువురు మృతి
National, Crime

Train Accident | ప్యాసింజర్‌ రైలు గూడ్స్‌ రైలు ఢీ.. పలువురు మృతి

Bilaspur Train Accident | ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ జిల్లాలో మంగ‌ళ‌వారం రాత్రి చోటుచేసుకున్న రైలు ప్రమాదం హృదయ విదారక దృశ్యాలను మిగిల్చింది. రాయ్‌గఢ్‌ నుంచి వస్తున్న ప్యాసింజర్‌ రైలు లాల్‌ఖండ్‌ సమీపంలో నిలిచివున్న గూడ్స్‌ రైలును ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందగా, సుమారు 25 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నపిల్లలు ఉన్నట్లు సమాచారం. రెస్క్యూ బృందాల చర్యలు ప్రమాద గురించి సమాచారం అందుకున్న వెంటనే SDRF, NDRF బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించాయి. బోగీలలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు గ్యాస్‌ కట్టర్ల సహాయంతో కోచులను కట్‌ చేస్తున్నారు. రైల్వే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని బిలాస్‌పూర్ హాస్పిట‌ల్‌కు తరలించారు. ఈ రైలు ప్రమాదంలో మహిళా కో...
Accident | మ‌రో  ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 19 మంది దుర్మ‌ర‌ణం
National, Crime

Accident | మ‌రో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 19 మంది దుర్మ‌ర‌ణం

Jaipur road Accident | జైపూర్‌లోని హర్మాడలో సోమవారం మధ్యాహ్నం ఒక డంపర్ ట్రక్కు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న ట్రక్కు డ్రైవర్​ అతివేగంగా నడుపుతూ ముందున్న అనేక వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లాడు. ఈ ఘటనలో సుమారు 19 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇంకా అనేక మంది గాయపడ్డారు. ఖాళీ డంపర్ రోడ్ నంబర్ 14 నుండి లోహా మండి పెట్రోల్ పంప్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 300 మీటర్ల విస్తీర్ణంలో ఒకదాని తర్వాత ఒకటి వాహనాలను ఢీకొట్టడం ప్రారంభించింది. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక‌ ఆసుపత్రికి తరలించారు వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై సాధారణ ట్రాఫిక్ ఉందని, కానీ అకస్మాత్తుగా ఒక డంపర్ మితిమీరిన వేగంతో వచ్చి కారును ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వ‌రుస‌గా మూడు కిలోమీట‌ర్ల మేర ముందున్న వాహనాల‌ను ఢీకొట్టుకుంటూ వెళ్లింద‌ని.తెలిపారు. ర...
చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం – ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టి 21 మంది మృతి – Chevella Road Accident
Crime

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం – ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టి 21 మంది మృతి – Chevella Road Accident

Chevella Road Accident | హైద‌రాబాద్‌, బీజాపూర్ జాతీయ ర‌హ‌దారిలో రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలోఇద్దరు డ్రైవర్లు సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయాల పాల‌య్యారు. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులోనే కూరుకుపోయారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మూడు జేసీబీలతో సహాయక చర్యలు చేప‌ట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని జాగ్ర‌త్త‌గా బయటకు తీస్తున్నారు. ఇప్పటివరకు 15 మందిని బస్సులో నుంచి బయటకు తీశారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆస్ప‌త్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాండూరు డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్‌ బస్సు తాండూరు నుంచి ...
Vikarabad | వికారాబాద్ జిల్లాలో దారుణం – భార్య, వదిన, కూతురిపై కత్తితో దాడి చేసి ఆత్మహత్య
Crime

Vikarabad | వికారాబాద్ జిల్లాలో దారుణం – భార్య, వదిన, కూతురిపై కత్తితో దాడి చేసి ఆత్మహత్య

Vikarabad Tragic Incident | వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో దారుణ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి త‌న‌ భార్య, వదిన, కూతురిని హత్య చేసి, తానూ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకెళితే కులకచర్లకు చెందిన వేపూరి యాదయ్య ఆదివారం తెల్లవారు జామున ఇంట్లో నిద్రిస్తున్న భార్య అలివేలు (32), కుమార్తెలు అపర్ణ (13), శ్రావణి (10), వదిన హనుమమ్మ (40)ల పై కత్తితో కిరాతకంగా దాడి చేసి బ‌లిగొన్నాడు. ఆపై అత‌డూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దాడితో గాయాలపాలై ప్రాణాలతో బయటపడిన‌ యాదయ్య పెద్ద కూతురు అపర్ణ త‌రుకొని ఇరుగుపొరుగువారికి చెప్పింది. స్థానికులు వచ్చి చూసేసరికి భార్య, వదిన, చిన్న కుమార్తెతో పాటు యాదయ్య మృతదేహాలు క‌నిపించాయి. స్థానికులు కులకచర్ల పోలీసుల‌కు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న గాయాలతో విల‌విల‌లాడుతున్న అపర్ణను ఆస్పత్రికి తరలించారు. ప...
Khammam | సీపీఎం సీనియ‌ర్ నాయకుడి దారుణ హ‌త్య‌
Crime, Khammmam

Khammam | సీపీఎం సీనియ‌ర్ నాయకుడి దారుణ హ‌త్య‌

Khammam news : ఖ‌మ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం సీపీఎం సీనియర్ నేత (CPM leader) సామినేని రామారావు (Samineni Ramarao ) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ రోజు తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కొంద‌రు సామినేని రామారావుని గొంతు కోసి హత్య చేశారు. మ‌రో మూడు రోజుల్లో ఖ‌మ్మంలో రామారావు త‌న‌ మనవరాలి పెళ్లికి ఉండ‌గా ఇంత‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేక‌రించారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సామినేని రామారావు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు రామారావు. పార్టీలో చాలా కీలకమైన వ్యక్తిగా కొన‌సాగారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి కాగా, సామినేని రామారావు హత్య విష‌యం తెలుసుకుని డిప్యూటీ సీఎం...
error: Content is protected !!