Sarkar Live

Crime

Hyderabad | చేపల వేటకు వెళ్లిన ముగ్గురు యువకులు మృతి.. ఒకే కాలనీలో విషాద ఛాయలు!
Crime

Hyderabad | చేపల వేటకు వెళ్లిన ముగ్గురు యువకులు మృతి.. ఒకే కాలనీలో విషాద ఛాయలు!

Hyderabad News | సరదాగా చేపల వేటకు వెళ్లిన ముగ్గురు స్నేహితుల ప్రాణాలను మూసీ నది (Musi River) బలితీసుకుంది. గండిపేట జలాశయం దిగువన ఉన్న మూసీ నది పరివాహక ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ విషాదకర ఘటన వెలుగుచూసింది. మృతులంతా ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఇబ్రహీంబాగ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అసలేం జరిగిందంటే? హైదరాబాద్ (Hyderabad) ఇబ్రహీంబాగ్‌కు చెందిన కార్తీక్ (25), గోవర్ధన్ (23), వెంకటేష్ (25) ముగ్గురూ ప్రాణ స్నేహితులు. ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా చేపలు పట్టేందుకు గండిపేట పరివాహక ప్రాంతంలోని మూసీ నది వద్దకు వెళ్లారు. అయితే, నదిలో నీటి ఉధృతి, లోతు ఎక్కువగా ఉండటంతో వారు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయారు. యువకులు నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు, రెస్క్యూ టీం ఆదివారం సాయంత్రం నుంచే గాలింపు చర్యలు చేపట్టింది....
నిజామాబాద్‌లో పొలిటికల్ వార్: కాంగ్రెస్ సీనియర్ నేత దారుణ హత్య! – Nizamabad Murder case
Crime

నిజామాబాద్‌లో పొలిటికల్ వార్: కాంగ్రెస్ సీనియర్ నేత దారుణ హత్య! – Nizamabad Murder case

Nizamabad : జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఇందల్వాయి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపీ గురువారం దారుణ హత్యకు గురయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు చివరకు రక్తపాతానికి దారితీయడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కారుతో గుద్ది.. కత్తితో పొడిచి.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా (Nizamabad ) ఇందల్వాయి మండల కేంద్రంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌లో కీలక నేతగా గుర్తింపు పొందిన ఇమ్మడి గోపీపై ఆయనకు బంధువైన సతీశ్‌ పక్కా ప్లాన్‌తో దాడి చేశాడు. తొలుత గోపీని తన కారుతో బలంగా ఢీకొట్టి కింద పడేశాడు. ఆ వెంటనే తేరుకునే లోపే కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలైన గోపీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హత్య చేసిన అనంతరం నిందితుడు సతీశ్‌ నేరుగా పోలీస్ స్ట...
Chhattisgarh Maoists Surrender : చత్తీస్‌గఢ్‌లో ఒకేసారి 108 మంది లొంగుబాటు.. రూ. 3.95 కోట్ల రివార్డు!
National, Crime

Chhattisgarh Maoists Surrender : చత్తీస్‌గఢ్‌లో ఒకేసారి 108 మంది లొంగుబాటు.. రూ. 3.95 కోట్ల రివార్డు!

Chhattisgarh Maoists Surrender | దండకారణ్యంలో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వాలు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు, అటవీ ప్రాంతంలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో మావోయిస్టులు భారీగా జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. బుధవారం (మార్చి 11) నాడు చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఏకంగా 108 మంది మావోయిస్టులు పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు. రూ. 3.95 కోట్ల రివార్డు.. భారీగా ఆయుధాలు! లొంగిపోయిన ఈ 108 మంది మావోయిస్టులపై ప్రభుత్వం గతంలో ప్రకటించిన రివార్డుల విలువ మొత్తం రూ. 3.95 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. బస్తర్ డివిజన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ లొంగుబాటు కార్యక్రమంలో వారు తమ వద్ద ఉన్న 101 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ప్రాంతాల వారీగా లొంగిపోయిన వారి వివరాలు: దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన వివిధ ప్రాంతాల నుంచి మావోయిస్టులు తరలివచ్చారు: బీజాపూర్: 37 ...
దాహార్తిని తీర్చేందుకు గీసుగొండ పోలీసుల ముందడుగు
Crime, warangal

దాహార్తిని తీర్చేందుకు గీసుగొండ పోలీసుల ముందడుగు

కొనాయమాకుల స్టేజ్ వద్ద చలివేంద్రం ప్రారంభం ఎండలు ముదురుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు గీసుగొండ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కొనాయమాకుల స్టేజ్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మామునూరు ఏసీపీ వెంకటేష్  బుధవారం ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏసీపి మాట్లాడుతూ గీసుగొండ సీ ఐ విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించడం అభినందనీయమని అన్నారు.కేవలం శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా, సామాజిక బాధ్యతగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం వల్ల పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రయాణికులు, స్థానిక ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీఐ విశ్వేశ్వర్, ఎస్సైలు కుమార్, అనిల్ ,తోపాటు స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు....
నోటీసుల కోసం ‘మామూళ్ల’ వేట
Crime, Hyderabad

నోటీసుల కోసం ‘మామూళ్ల’ వేట

లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఎస్ఐల అరెస్ట్. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో అవినీతి తిమింగలాలు ఏసీబీకి చిక్కాయి. బాబునాయక్, ప్రమోద్ అనే ఇద్దరు ఎస్ఐలు ఒక కేసు విషయంలో నిందితుడికి సెక్షన్ 41 నోటీసులు ఇచ్చేందుకు ప్రతిఫలంగా లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశారు.ఈ వేధింపులను తట్టుకోలేక బాధితుడు ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, ఎస్ఐలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ జరుపుతున్నారు....
error: Content is protected !!