Sarkar Live

Crime

Chhattisgarh | ఛత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్‌: ఇద్దరు మహిళ మావోయిస్టులు హతం
Crime

Chhattisgarh | ఛత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్‌: ఇద్దరు మహిళ మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) లోని నారాయణ్‌పూర్ జిల్లాలోని అబుజ్‌మద్ (Abujhmad) ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఇద్దరు మహిళ మావోయిస్టులు మృతి చెందారు. వారి మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నారు . సంఘటన స్థలం వద్ద 315 బోర్ రైఫిల్స్ తోపాటు ఇతర ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కోకమెట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కోకమెట ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నారాయణపూర్ నుంచి డిఆర్జి, కొండగావ్ నుంచి ఎస్టీఎఫ్ సిబ్బందిని నక్సల్ ఆపరేషన్ కోసం పంపామని పోలీసులు వెల్లడించారు. బుధవారం రాత్రి పోలీస్ బలగాలు , మావోయిస్టులు సమావేశమైన ప్రదేశానికి చేరుకున్నప్పుడు, మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. ఉదయం బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినప్పుడు, ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. తెలుగు వార్తలు,...
Accident | గుర్తుతెలియని వాహనం ఢీకొని ఎస్సై, కానిస్టేబుల్ మృతి
Crime

Accident | గుర్తుతెలియని వాహనం ఢీకొని ఎస్సై, కానిస్టేబుల్ మృతి

Kodada | కోదాడ స‌మీపంలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదం(Road Accident) లో ఒక ఎస్సై, కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. గుర్తుతెలియని వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ మృతి చెందారు (Crime News). ఈ ఘటన కోదాడ పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై దుర్గాపురం వద్ద గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని కోనసీమ జిల్లా (Konaseema District) ఆలమూరు స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై అశోక్‌, కానిస్టేబుల్ వీరస్వామి ఓ పని నిమిత్తం హైదరాబాద్‌ బయలుదేరారు. మార్గంమధ్యలో వీరు ప్రయాణిస్తున్న కారు కోదాడ పరిధిలో గుర్తుతెలియని వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఎస్సై, కానిస్టేబుల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌లో మరో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు కోదాడ ప్రభుత్వ హాస్పిటల్‌కు తర...
Bribe | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై..
Crime

Bribe | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై..

ACB Raids | ఏసీబీ అధికారులు రోజురోజుకు దాడులను ముమ్మరం చేస్తున్నా అవినీతి అధికారులు పట్టుబడుతూనే ఉన్నారు. అయితే లంచగొండులను కట్టడి చేయాల్సిన పోలీసులే లంచం తీసుకుంటూ దొరికిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా భూ వివాదంలో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ. 20 వేలు లంచం తీసుకుంటూ నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎస్సై ఏసీబీ అధికారులకు బుధవారం దొరికిపాయారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి (Kalwakurthi) పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సెకండ్ ఎస్సై రామచందర్ (Ramchandar) లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు పట్టుబడ్డారు. కల్వకుర్తి మండలం గుండూరు గ్రామానికి చెందిన వెంకటయ్య భూ వివాదంలో స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి రూ.20 వేలు డిమాండ్ చేశారు. అయ‌తే చివరికి రూ.10000 ల‌కు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయ‌డంతో వారు రంగంలోకి దిగారు. అధికారులు చెప్పినట్లుగా ఒప్ప...
ACB Investigation | అక్రమాస్తుల కేసులో ఇరిగేషన్‌ ఈఈ శ్రీధర్‌ విచారణ
Crime

ACB Investigation | అక్రమాస్తుల కేసులో ఇరిగేషన్‌ ఈఈ శ్రీధర్‌ విచారణ

ACB Investigation | అక్రమ ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఈఈ) నూనె శ్రీధర్‌ను కస్టడీలోకి తీసుకుని ఏసీబీ అధికారులు మంగళవారం ఐదో రోజు విచారించారు. ఇప్పటివరకు చేపట్టిన విచారణలో శ్రీధర్‌ అక్రమంగా సంపాదించిన డబ్బును రియల్‌ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ మెంట్ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. శ్రీధర్‌ బ్యాంకు లాకర్లలో భారీగా ఆస్తి పత్రాలు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లలో స్వాధీనం చేసుకున్న ఆస్తులు విలువ సుమారు రూ. 5 కోట్లు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project ) నిర్మాణంలో 6, 7, 8 పనులు పర్యవేక్షించిన ఈఈ నూనె శ్రీధర్‌ అక్రమాస్తుల చిట్టా లెక్కించిక కొద్దీ పెరిగిపోతోంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే వందల కోట్ల విలువైన ఆస్తుల్ని గుర్తించిన అధికారులు.. కోర్టు ...
ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్య‌ద‌ర్శి
Crime

ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్య‌ద‌ర్శి

రూ.21వేలు లంచం తీసుకుంటుండగా అదుపులోకి.. Nirmal News | నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం గోడిసెర్యాల గ్రామ పంచాయతీ సెక్రటరీ (Panchayat Secretary) శివకృష్ణ లంచం (Bribe) తీసుకుంటూ ఏసీబీ అధికారులకు (ACB Trap) ప‌ట్టుబ‌డ్డాడు. మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో బాధితుడి నుంచి రూ.12 వేల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.గోడిసెర్యాల గ్రామానికి చెందిన జి.రాజేశం గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటుచేసుకోవ‌డానికి గాను పంచాయతీ కార్య‌ద‌ర్శి వ‌ద్ద అనుమ‌తి కోరాడు. దీంతో కార్య‌దర్శి శివ‌కృష్ణ‌ 12 వేల రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో రాజేశం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం గోడిసెర్యాల గ్రామపంచాయతీ కార్యాలయంలో లంచం తీసుకుంటూ పంచాయతీ సెక్రటరీని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ACB అధికారులకు ఇలా ఫిర్యాదు చేయొచ్చు ఎవరైనా ప్రభుత్వ అధికారి లేదా స...
error: Content is protected !!