Karur stampede : కరూర్ తొక్కిసలాట కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
                    మధురై: కరూర్లో జరిగిన దారుణమైన తొక్కిసలాట (Karur stampede) ఘటనపై మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగించాలన్న వాదనను తిరస్కరించింది. కేసు దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలో ఉన్నందున, ప్రస్తుతానికి ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. హైకోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తింది. సభలు, ర్యాలీల్లో తాగునీరు వంటి కనీస సదుపాయాలు ఎందుకు కల్పించలేదని టీవీకే పార్టీని ప్రశ్నించింది. నీళ్లు, ఆహారం, టాయిలెట్లు, పార్కింగ్ వంటి అవసరాలను ఎందుకు నిర్లక్ష్యం చేశారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రోడ్డు సమావేశం నిర్వహించేందుకు ఎందుకు అనుమతి ఇచ్చారని పోలీసులు వివరణ ఇవ్వాలని కోరింది. బాధితులకు ప్రకటించిన పరిహారాన్ని పెంచే అంశంపై ప్రభుత్వం రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
నటుడు విజయ్ పర్యటనలు వాయిదా
ఈ ఘటన నేపథ్యంలో టీవీకే పార్టీ అధ...                
                
             
								


