Sarkar Live

National

పెట్రోల్ టెన్షన్: బంకుల వద్ద భారీ క్యూలు.. అసలు నిజం ఏంటి? ఇది వదంతా లేక వాస్తవమా? – Petrol Shortage
National

పెట్రోల్ టెన్షన్: బంకుల వద్ద భారీ క్యూలు.. అసలు నిజం ఏంటి? ఇది వదంతా లేక వాస్తవమా? – Petrol Shortage

Petrol Shortage : గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో పెట్రోల్ బంకుల వద్ద యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ కొరత రాబోతోందన్న ప్రచారంతో వాహనదారులు బంకుల వద్ద గంటల తరబడి క్యూ కడుతున్నారు. అవసరం ఉన్నా లేకున్నా ట్యాంకులు ఫుల్ చేయించుకోవడమే కాకుండా, క్యాన్లలో కూడా నిల్వ చేసుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో పలు బంకుల్లో ‘నో స్టాక్’ (No Stock) బోర్డులు దర్శనమిస్తున్నాయి. వదంతులకు కారణం ఏంటి? అమెరికా-ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు ఆటంకం కలుగుతుందనే ప్రచారం కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. దీనికి తోడు వంట గ్యాస్ సరఫరాలో కాస్త‌ జాప్యం చోటుచేసుకోవ‌డంతో పెట్రోల్, డీజిల్ కూడా దొరకదనే ఆందోళ‌న‌ ప్రజల్లో పెరిగిపోయింది. ఈ టెన్ష‌న్‌తోనే వాహనదారులు ఒక్కసారిగా బంకులపై పడ్డారు. Petrol Shortage...
Chhattisgarh Maoists Surrender : చత్తీస్‌గఢ్‌లో ఒకేసారి 108 మంది లొంగుబాటు.. రూ. 3.95 కోట్ల రివార్డు!
National, Crime

Chhattisgarh Maoists Surrender : చత్తీస్‌గఢ్‌లో ఒకేసారి 108 మంది లొంగుబాటు.. రూ. 3.95 కోట్ల రివార్డు!

Chhattisgarh Maoists Surrender | దండకారణ్యంలో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వాలు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు, అటవీ ప్రాంతంలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో మావోయిస్టులు భారీగా జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. బుధవారం (మార్చి 11) నాడు చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఏకంగా 108 మంది మావోయిస్టులు పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు. రూ. 3.95 కోట్ల రివార్డు.. భారీగా ఆయుధాలు! లొంగిపోయిన ఈ 108 మంది మావోయిస్టులపై ప్రభుత్వం గతంలో ప్రకటించిన రివార్డుల విలువ మొత్తం రూ. 3.95 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. బస్తర్ డివిజన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ లొంగుబాటు కార్యక్రమంలో వారు తమ వద్ద ఉన్న 101 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ప్రాంతాల వారీగా లొంగిపోయిన వారి వివరాలు: దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన వివిధ ప్రాంతాల నుంచి మావోయిస్టులు తరలివచ్చారు: బీజాపూర్: 37 ...
భారత సైన్యం అమ్ములపొదిలో ‘ప్రలే’.. ఒకేసారి రెండు క్షిపణులను ప్రయోగించి DRDO రికార్డు!
National

భారత సైన్యం అమ్ములపొదిలో ‘ప్రలే’.. ఒకేసారి రెండు క్షిపణులను ప్రయోగించి DRDO రికార్డు!

Pralay Missile Success | భువనేశ్వర్/న్యూఢిల్లీ: భారత సాయుధ దళాల బలం రోజురోజుకూ పెరుగుతోంది. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) బుధవారం మరొక అద్భుత విజయాన్ని నమోదు చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 'ప్రలే' (Pralay) క్షిపణులను ఒకే లాంచర్ నుండి అతి తక్కువ వ్యవధిలో వరుసగా రెండుసార్లు (Salvo Launch) ప్రయోగించి తన సత్తాను చాటింది. ఏడాది చివరి రోజున అద్భుత ప్రయోగం డిసెంబర్ 31, 2025 (బుధవారం) ఉదయం 10:30 గంటలకు ఒడిశా తీరం నుండి ఈ క్షిపణులను ప్రయోగించారు. రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ రెండు క్షిపణులు తమ నిర్దేశిత మార్గాలను ఖచ్చితంగా అనుసరించి, శత్రు లక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయి. ఒకే లాంచర్ నుండి తక్కువ సమయంలో రెండు క్షిపణులను ప్రయోగించడం (సాల్వో ప్రయోగం) ఈ వ్యవస్థ యొక్క విశ్వసనీయతను నిరూపించింది. ప్రలే ఎందుకు ప్రత్యేకం? వేగం - ఖచ్చితత్వం: ఇది అత్యం...
Rahul Gandhi | ప్రజాస్వామ్యమా.. రాచరికమా? కేంద్రంపై రాహుల్ గాంధీ నిప్పులు
National

Rahul Gandhi | ప్రజాస్వామ్యమా.. రాచరికమా? కేంద్రంపై రాహుల్ గాంధీ నిప్పులు

న్యూఢిల్లీ : ఉపాధి హామీ పథకం (MNREGA) పేరు మార్పు మరియు దాని రూపురేఖలను మారుస్తూ కేంద్రం తీసుకొచ్చిన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ’ బిల్లుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడ‌బ్ల్యూసీ) సమావేశంలో పాల్గొన్న ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్రం తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. యుపిఏ హయాంలో కోట్లాది మంది పేదలకు అండగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి గాంధీజీ పేరును తొలగించడం జాతిపితను అవమానించడమేనని రాహుల్ అన్నారు. ఈ కీలక నిర్ణయాన్ని కనీసం కేబినెట్‌లో చర్చించకుండా, సంబంధిత శాఖా మంత్రులతో సంప్రదించకుండా ఏకపక్షంగా ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. "ఇది ప్రజాస్వామ్యమా? లేక ఒకే వ్యక్తి నిర్ణయాలు అమలు చేసే రాచరిక వ్యవస్థా?" అని రాహుల్ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీకి గాంధేయ సిద్ధ...
Flight cancellation impact : ప్రయాణికుల కోసం 37 రైళ్లకు 116 అదనపు కోచ్‌లు!
National

Flight cancellation impact : ప్రయాణికుల కోసం 37 రైళ్లకు 116 అదనపు కోచ్‌లు!

Flight cancellation impact : ఇండిగో విమానాలు అక‌స్మాత్తుగా రద్దు కావడం (Indigo flight cancellations)తో దేశ‌వ్యాప్తంగా ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ముఖ్యంగా హైద‌రాబాద్‌, చైన్నై, బెంగ‌ళూరు, ఢిల్లీ వంటి ప్ర‌ధాన న‌గ‌రాలకు రాక‌పోక‌లు సాగించే వారు అసౌక‌ర్యానికి గురవుతున్నారు. టికెట్లు బుక్ చేసుకున్న వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందుల్లో పడటంతో రైల్వే శాఖ (Indian Railways) తక్షణమే స్పందించింది. ప్ర‌యాణికుల‌కు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రత్యామ్నాయంగా ప్ర‌త్యేక రైళ్ల‌ను అందుబాటులోకి తెచ్చింది. విమాన ప్రయాణాలు రద్దు కావడం వల్ల సహజంగానే రైళ్లకు డిమాండ్ (Rail travel demand India) ఒక్కసారిగా పెరిగింది. రిజర్వేషన్ కౌంటర్లు, రైల్వే స్టేషన్లు, ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో బుకింగ్‌లు పెరిగి ప్రయాణికులకు అందుబాటు టికెట్లు దొరకడం కష్టమైంది. ఈ పరిస్థితిని గుర్తించిన‌ రైల్వే శాఖ ప్రజలకు సౌకర...
error: Content is protected !!