Sarkar Live

National

భారత సైన్యం అమ్ములపొదిలో ‘ప్రలే’.. ఒకేసారి రెండు క్షిపణులను ప్రయోగించి DRDO రికార్డు!
National

భారత సైన్యం అమ్ములపొదిలో ‘ప్రలే’.. ఒకేసారి రెండు క్షిపణులను ప్రయోగించి DRDO రికార్డు!

Pralay Missile Success | భువనేశ్వర్/న్యూఢిల్లీ: భారత సాయుధ దళాల బలం రోజురోజుకూ పెరుగుతోంది. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) బుధవారం మరొక అద్భుత విజయాన్ని నమోదు చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 'ప్రలే' (Pralay) క్షిపణులను ఒకే లాంచర్ నుండి అతి తక్కువ వ్యవధిలో వరుసగా రెండుసార్లు (Salvo Launch) ప్రయోగించి తన సత్తాను చాటింది. ఏడాది చివరి రోజున అద్భుత ప్రయోగం డిసెంబర్ 31, 2025 (బుధవారం) ఉదయం 10:30 గంటలకు ఒడిశా తీరం నుండి ఈ క్షిపణులను ప్రయోగించారు. రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ రెండు క్షిపణులు తమ నిర్దేశిత మార్గాలను ఖచ్చితంగా అనుసరించి, శత్రు లక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయి. ఒకే లాంచర్ నుండి తక్కువ సమయంలో రెండు క్షిపణులను ప్రయోగించడం (సాల్వో ప్రయోగం) ఈ వ్యవస్థ యొక్క విశ్వసనీయతను నిరూపించింది. ప్రలే ఎందుకు ప్రత్యేకం? వేగం - ఖచ్చితత్వం: ఇది అత్యం...
Rahul Gandhi | ప్రజాస్వామ్యమా.. రాచరికమా? కేంద్రంపై రాహుల్ గాంధీ నిప్పులు
National

Rahul Gandhi | ప్రజాస్వామ్యమా.. రాచరికమా? కేంద్రంపై రాహుల్ గాంధీ నిప్పులు

న్యూఢిల్లీ : ఉపాధి హామీ పథకం (MNREGA) పేరు మార్పు మరియు దాని రూపురేఖలను మారుస్తూ కేంద్రం తీసుకొచ్చిన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ’ బిల్లుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడ‌బ్ల్యూసీ) సమావేశంలో పాల్గొన్న ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్రం తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. యుపిఏ హయాంలో కోట్లాది మంది పేదలకు అండగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి గాంధీజీ పేరును తొలగించడం జాతిపితను అవమానించడమేనని రాహుల్ అన్నారు. ఈ కీలక నిర్ణయాన్ని కనీసం కేబినెట్‌లో చర్చించకుండా, సంబంధిత శాఖా మంత్రులతో సంప్రదించకుండా ఏకపక్షంగా ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. "ఇది ప్రజాస్వామ్యమా? లేక ఒకే వ్యక్తి నిర్ణయాలు అమలు చేసే రాచరిక వ్యవస్థా?" అని రాహుల్ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీకి గాంధేయ సిద్ధ...
Flight cancellation impact : ప్రయాణికుల కోసం 37 రైళ్లకు 116 అదనపు కోచ్‌లు!
National

Flight cancellation impact : ప్రయాణికుల కోసం 37 రైళ్లకు 116 అదనపు కోచ్‌లు!

Flight cancellation impact : ఇండిగో విమానాలు అక‌స్మాత్తుగా రద్దు కావడం (Indigo flight cancellations)తో దేశ‌వ్యాప్తంగా ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ముఖ్యంగా హైద‌రాబాద్‌, చైన్నై, బెంగ‌ళూరు, ఢిల్లీ వంటి ప్ర‌ధాన న‌గ‌రాలకు రాక‌పోక‌లు సాగించే వారు అసౌక‌ర్యానికి గురవుతున్నారు. టికెట్లు బుక్ చేసుకున్న వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందుల్లో పడటంతో రైల్వే శాఖ (Indian Railways) తక్షణమే స్పందించింది. ప్ర‌యాణికుల‌కు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రత్యామ్నాయంగా ప్ర‌త్యేక రైళ్ల‌ను అందుబాటులోకి తెచ్చింది. విమాన ప్రయాణాలు రద్దు కావడం వల్ల సహజంగానే రైళ్లకు డిమాండ్ (Rail travel demand India) ఒక్కసారిగా పెరిగింది. రిజర్వేషన్ కౌంటర్లు, రైల్వే స్టేషన్లు, ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో బుకింగ్‌లు పెరిగి ప్రయాణికులకు అందుబాటు టికెట్లు దొరకడం కష్టమైంది. ఈ పరిస్థితిని గుర్తించిన‌ రైల్వే శాఖ ప్రజలకు సౌకర...
ఇండిగో విమాన సేవలకు తీవ్ర అంతరాయం: దేశవ్యాప్తంగా 400+ విమానాలు రద్దు.. – Indigo Flight Cancellation
National

ఇండిగో విమాన సేవలకు తీవ్ర అంతరాయం: దేశవ్యాప్తంగా 400+ విమానాలు రద్దు.. – Indigo Flight Cancellation

హైదరాబాద్‌లోనూ కొనసాగుతున్న గందరగోళం Indigo Flight Cancellation | న్యూఢిల్లీ/హైదరాబాద్: ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన కార్యకలాపాలు వరుసగా రెండో రోజు తీవ్ర అంతరాయానికి గురయ్యాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాలలో 400కు పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో పెద్ద సంఖ్యలో విమానాలు ఆలస్యంగా నడిచినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒక్క‌సారిగా త‌లెత్తిన ఈ అంతరాయం కారణంగా వందలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన విమానాశ్రయాలలో రద్దుల సంఖ్య: ఢిల్లీ విమానాశ్రయం: 220కు పైగా విమానాలు రద్దు. బెంగళూరు విమానాశ్రయం: 100కు పైగా విమానాలు రద్దు. హైదరాబాద్ (RGIA): మొత్తం మీద 90కి పైగా విమానాలు హైదరాబాద్‌లో గందరగోళం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో గురు, శుక్ర‌వారాల్లో ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానాశ్రయ అధిక...
Maoist Surrender | మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ: ఒకే రోజు 37 మంది లొంగుబాటు.. వారిపై రూ. 65 లక్షల రివార్డు
National

Maoist Surrender | మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ: ఒకే రోజు 37 మంది లొంగుబాటు.. వారిపై రూ. 65 లక్షల రివార్డు

Maoist Surrender Dantewada : మావోయిస్టు పార్టీకి మరోమారు ఎదురుదెబ్బ‌ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ రీజియన్‌, దంతెవాడ జిల్లాలో ఆదివారం, (నవంబర్ 30) ఏకంగా 37 మంది మావోయిస్టులు పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 27 మందిపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మొత్తం రూ. 65 లక్షల రివార్డును ప్రకటించింది. ఈ 37 మందిలో 12 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. 'పూనా మర్గం'కు ఆకర్షితులై.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తున్న 'పూనా మర్గం' (Puna Narkom - నక్సలిజం వీడి తిరిగి రండి) అనే ప్రచార కార్యక్రమానికి ఆకర్షితులై తాము లొంగిపోతున్నట్లు వారు ప్రకటించారు. తాము హింసామార్గాన్ని విడిచిపెట్టి, జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని, రాష్ట్ర ప్రభుత్వ పునరావాస విధానంపై తమకు పూర్తి నమ్మకముంద‌ని మావోయిస్టులు వెల్ల‌డించారు. లొంగిపోయిన మావోయిస్టులను దంతెవాడలోని డీఆర్‌జీ (DRG) కార...
error: Content is protected !!