Sarkar Live

National

MSP | రైతులకు కేంద్రం గుడ్ న్యూస్
National

MSP | రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

New Delhi : దేశ‌వ్యాప్తంగా రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వరి మద్దతు ధర (MSP) పెంచాల‌ని నిర్ణ‌యించింది. ఖరీఫ్‌ ‌సీజన్‌కు వరి మద్దతు ధరను రూ.69ల‌కు పెంచింది. తాజా పెంపుతో క్వింటా వరి మద్దతు ధర రూ.2,369 కి చేరింది. ఈ మద్దతు ధర కోసం కేంద్రం రూ.2.70 లక్షల కోట్ల కేటాయించింది. అంతేకాదు.. రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.15,642 కోట్ల నిధుల‌ను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. పెట్టుబడిపై రైతులకు 50 శాతం లాభం ఉండేలా నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్‌ ‌సీజన్‌లో వరి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2025-26 ఖరీఫ్‌ ‌సీజన్‌కు సంబంధించి క్వింటాల్‌ ‌వరిపై రూ.69 పెంచడంతో కనీస మద్దతు ధర రూ.2369కి చేరింది. కేంద్ర క్యాబినెట్‌ ‌నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ‌బుధ‌వారం మీడియాకు వెల్లడించారు. గత 10-11 ఏళ్లలో ఖరీఫ్‌ ‌పంటలకు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌(MSP) ను భారీగ...
Covid 19 : కోవిడ్ కార‌ణంగా ఒక వారంలో ఏడుగురి మృతి
National

Covid 19 : కోవిడ్ కార‌ణంగా ఒక వారంలో ఏడుగురి మృతి

Covid 19 : భారత్‌లో కరోనా వైరస్ ప్రమాదకరంగా మారుతోంది. రెండు కొత్త కోవిడ్ వేరియంట్ల రాకతో, మహమ్మారి వేగం పుంజుకుని 16 రాష్ట్రాలకు వ్యాపించింది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధికంగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే, గత వారం రోజుల్లో, కరోనా మహారాష్ట్రలో అత్యధిక ప్రాణాలను బలిగొంది. మే 19 నుంచి, దేశంలోని మూడు రాష్ట్రాల్లో కరోనావైరస్ కారణంగా మరణాలు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, గత వారంలో మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కారణంగా 4 మంది మరణించారు. కేరళలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, కర్ణాటకలో కరోనా కారణంగా ఒక మరణం నమోదైంది. మే 26న ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా మరణాల గణాంకాలను విడుదల చేసింది. శుభవార్త ఏమిటంటే 305 మంది కరోనాను జ‌యించి డిశ్చార్జ్ అయి ఇంటికి తిరిగి వచ్చారు. Covid 19 : దేశంలో 1000కిపైగా యాక్టివ్ కేసులు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన రోగుల సంఖ్య వెయ్యి దాటిం...
భారత్‌లో కరోనా కొత్త వేరియంట్లు.. వాటి లక్షణాలు నివారణ పద్ధతులు తెలుసుకోండి.. – Corona New Variant
National

భారత్‌లో కరోనా కొత్త వేరియంట్లు.. వాటి లక్షణాలు నివారణ పద్ధతులు తెలుసుకోండి.. – Corona New Variant

Corona New Variant : 2020-21 సంవత్సరంలో విధ్వంసం సృష్టించిన కరోనా వైరస్ మళ్లీ కొత్త రూపంలో తిరిగి వచ్చింది. కరోనా కేసులు పెరుగుతున్నందున భార‌త్‌తోపాటు ప్రపంచంలో ఆందోళ‌న‌లు పెరుగుతున్నాయి. భారతదేశంలో కూడా కరోనా కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. ఇదే స‌మ‌యంలో కరోనా యొక్క రెండు కొత్త రకాలు, NB.1.8.1, LF.7 కూడా దేశంలోకి ప్రవేశించాయి. కరోనా రెండు కొత్త ఉప రకాలు, NB.1.8.1 మరియు LF.7 ల‌ను గుర్తించారు. దీనిని ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) నిర్ధారించింది. దీని ప్రకారం, ఏప్రిల్‌లో తమిళనాడులోని ఓ రోగిలో NB.1.8.1 వేరియంట్ ను కనుగొన్నారు. మే నెలలో, గుజరాత్ నుంచి నాలుగు LF.7 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత ఈ కొత్త వేరియంట్‌ల గురించి దేశంలో భయాందోళనలు పెరిగాయి. Corona New Variant ఈ కొత్త రకాలు ప్రమాదకరమా? ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రస్తుతం ఈ NB.1.8.1 మరియు LF.7 వేరియంట్‌లను అబ్జ‌ర...
Covid Cases | బెంగ‌ళూరులో తొలి కోవిడ్ మరణం.. పెరుగుతున్న యాక్టివ్ కేసులు
National

Covid Cases | బెంగ‌ళూరులో తొలి కోవిడ్ మరణం.. పెరుగుతున్న యాక్టివ్ కేసులు

Covid Cases in Bengaluru : బెంగ‌ళూరులో తొలి కోవిడ్-19 (Covid 19 )మరణం సంభవించింది. ఈమేర‌కు కర్ణాటక ఆరోగ్య శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటన జారీ చేసింది. శనివారం కరోనా రోగి మరణించాడని ఆరోగ్య శాఖ తెలిపింది, గత 24 గంటల్లో 108 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు. ఒక వ్యక్తిని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 38గా ఉంది. మొత్తం 38 యాక్టివ్ కేసుల (Active Covid Cases) లో 32 బెంగళూరు నుంచి నమోదయ్యాయి. నగరంలో మొత్తం 92 మంది పరీక్షలు చేయించుకున్నారని, గత 24 గంటల్లో ఇద్దరు వ్యక్తులు పాజిటివ్‌గా తేలిందని నివేదిక తెలిపింది. బళ్లారి, బెంగళూరు గ్రామీణ, మంగళూరు (Mangalur), విజయనగర్ జిల్లాల్లో ఒక్కొక్కటి యాక్టివ్ కేసులు ఉండగా, మైసూరు జిల్లాలో రెండు యాక్టివ్ కేసులు నమోదయ్యాయని నివేదిక పేర్కొంది. మృతుడు 85 ఏళ్ల వ్యక్తి అని ఆరోగ్య ...
బెంగ‌ళూరును ముంచెత్తుతున్న వ‌ర్షాలు.. మ‌గ్గురు మృతి.. Bengaluru Rains
National

బెంగ‌ళూరును ముంచెత్తుతున్న వ‌ర్షాలు.. మ‌గ్గురు మృతి.. Bengaluru Rains

Bengaluru Rains : వ‌రుస వ‌ర్షాల‌తో బెంగళూరుతో స‌హా కర్ణాటకలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఈ భారీ వర్షాలకు ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. భారత వాతావరణ శాఖ (IMD) శుక్రవారం వరకు బెంగళూరుకు 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది, భారీ వర్షాలు నగరంలోని అనేక ప్రాంతాల్లో వరదలకు కారణమవుతున్నాయి. ఆదివారం రాత్రి కురిసిన వర్షాలకు విస్తృతంగా నీరు నిలిచిపోవడంతో ప్ర‌జ‌ల‌ రోజువారీ జ‌న జీవ‌నం అస్తవ్యస్తమైంది. కర్ణాటక అంతటా అనేక ప్రాంతాలు భారీ వర్షాల కారణంగా ప్రభావితమయ్యాయి, దీని ఫలితంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అనేక ర‌హ‌దారుల్లో మోకాళ్ల‌లోతు వ‌ర‌ద‌ నీరు నిలిచిపోయింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. Bengaluru Rains నగర జీవితాన్ని అస్తవ్యస్తం గ‌త ఆదివారం రాత్రి బెంగళూరులో ఆరు గంటలకు పైగా నిరంతరంగా వర్షపాతం (Bengalur...
error: Content is protected !!