MSP | రైతులకు కేంద్రం గుడ్ న్యూస్
New Delhi : దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వరి మద్దతు ధర (MSP) పెంచాలని నిర్ణయించింది. ఖరీఫ్ సీజన్కు వరి మద్దతు ధరను రూ.69లకు పెంచింది. తాజా పెంపుతో క్వింటా వరి మద్దతు ధర రూ.2,369 కి చేరింది. ఈ మద్దతు ధర కోసం కేంద్రం రూ.2.70 లక్షల కోట్ల కేటాయించింది. అంతేకాదు.. రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.15,642 కోట్ల నిధులను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పెట్టుబడిపై రైతులకు 50 శాతం లాభం ఉండేలా నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ సీజన్లో వరి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2025-26 ఖరీఫ్ సీజన్కు సంబంధించి క్వింటాల్ వరిపై రూ.69 పెంచడంతో కనీస మద్దతు ధర రూ.2369కి చేరింది. కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం మీడియాకు వెల్లడించారు.
గత 10-11 ఏళ్లలో ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరల(MSP) ను భారీగ...




