Covid Cases | బెంగళూరులో తొలి కోవిడ్ మరణం.. పెరుగుతున్న యాక్టివ్ కేసులు
Covid Cases in Bengaluru : బెంగళూరులో తొలి కోవిడ్-19 (Covid 19 )మరణం సంభవించింది. ఈమేరకు కర్ణాటక ఆరోగ్య శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటన జారీ చేసింది. శనివారం కరోనా రోగి మరణించాడని ఆరోగ్య శాఖ తెలిపింది, గత 24 గంటల్లో 108 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, ఐదుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయిందని తెలిపారు. ఒక వ్యక్తిని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 38గా ఉంది. మొత్తం 38 యాక్టివ్ కేసుల (Active Covid Cases) లో 32 బెంగళూరు నుంచి నమోదయ్యాయి. నగరంలో మొత్తం 92 మంది పరీక్షలు చేయించుకున్నారని, గత 24 గంటల్లో ఇద్దరు వ్యక్తులు పాజిటివ్గా తేలిందని నివేదిక తెలిపింది.
బళ్లారి, బెంగళూరు గ్రామీణ, మంగళూరు (Mangalur), విజయనగర్ జిల్లాల్లో ఒక్కొక్కటి యాక్టివ్ కేసులు ఉండగా, మైసూరు జిల్లాలో రెండు యాక్టివ్ కేసులు నమోదయ్యాయని నివేదిక పేర్కొంది. మృతుడు 85 ఏళ్ల వ్యక్తి అని ఆరోగ్య ...



