Sarkar Live

National

Kashmir | కశ్మీర్ వందేభారత్ రైలు.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై పరుగులు | Video
National

Kashmir | కశ్మీర్ వందేభారత్ రైలు.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై పరుగులు | Video

Jammu Kashmir | కశ్మీర్ లోయలోని శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, శ్రీనగర్ (Srinagar ) రైల్వే స్టేషన్ మధ్య నడిపించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు (Vande Bharat train) మొదటి ట్రయల్ రన్ సక్సెస్ అయింది. భారతీయ రైల్వే తన విజయవంతమైన ట్రయల్ గురించి శనివారం వెల్లడించింది. ఈ రైలు తన ప్రయాణంలో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబ్ వంతెన (Chenab Bridge) గుండా వెళ్ళింది. ప్రత్యేక వందే భారత్ కూడా అంజి ఖాడ్ వంతెన గుండా ప్రయాణించింది. ఇది దేశంలోని మొట్టమొదటి కేబుల్-స్టేడ్ రైల్వే వంతెన. జమ్మూలో ఉదయం 11:30 గంటలకు రైలు కొంతసేపు ఆగింది, అక్కడ ప్రజలు స్వాగతం పలుకుతూ నినాదాలు చేశారు. రైల్వే శాఖ ప్రకారం, ట్రయల్ పూర్తయిన తర్వాత దాని వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఈ రైలు షెడ్యూల్ ను ఇంకా ప్రకటించనప్పటికీ, త్వరలో PM నరేంద్ర మోదీ ఈ రైలు మొదటి ప్రయాణాన్ని కత్రా నుంచి ఫ్లాగ్ చేయను...
Chhattisgarh : భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 20 మంది మావోయిస్టులు హతం!
National

Chhattisgarh : భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 20 మంది మావోయిస్టులు హతం!

ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దు (Chhattisgarh -Odisha border)లో జరిగిన ఎదురుకాల్పుల్లో (Encounter) 20 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఎదురుకాల్పులు జనవరి 19 రాత్రి నుంచి ప్రారంభమై రెండు రోజుల‌పాటు కొన‌సాగాయి. మావోయిస్టులు (Maoists) ఉన్నార‌నే స‌మాచారాన్ని ఇంటెలిజెన్స్ ద్వారా అందుకున్న భ‌ద్ర‌తా ద‌ళాలు ఈ ఆప‌రేష‌న్‌ను ప్రారంభించాయి. ఛత్తీస్‌గఢ్ జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), కోబ్రా దళాలు, ఒడిశా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG) కలిసి అమలు చేశాయి. మృతుల్లో కేంద్ర క‌మిటీ స‌భ్యుడు ఎన్‌కౌంట‌ర్‌ (Chhattisgarh Encounter )లో హతమైన మావోయిస్టుల్లో ఇద్దరు మహిళ‌లు కూడా ఉన్నారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర క‌మిటీ స‌భ్యుడు జైరాం అలియాస్ చల‌ప‌తి కూడా ఉన్న‌ట్టు గారియాబంద్ జిల్లా ఎస్పీ నిఖిల్ రాకేచా తెలిపారు. అత‌డిపై రూ. 1 కోటి రివార్డు ఉంద‌ని చెప్పారు. మిగతా మృతుల వివరాలను ఇంకా...
PrayagRaj : మహా కుంభామేళా.. ల‌క్ష‌ల కొలువుల జాత‌ర
National

PrayagRaj : మహా కుంభామేళా.. ల‌క్ష‌ల కొలువుల జాత‌ర

PrayagRaj : ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) లోని ప్రయాగరాజ్ లో జ‌రుగుతున్న మ‌హా కుంభామేళా (Maha Kumbh 2025) ఆధ్యాత్మికంగానే కాకుండా ఉపాధి క‌ల్ప‌నకు దోహ‌దం చేస్తోందని అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఈ మ‌హా కుంభామేళా అనేక ఉద్యోగాల‌ను సృష్టించి నిరుద్యోగ నిర్మూల‌నకు బాట‌లు వేసింద‌ని తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. ముఖ్యంగా ప‌ర్యాట‌క, ర‌వాణా, లాజిస్టిక్స్‌, ఆరోగ్య సంర‌క్ష‌ణ‌, ఐటీఈ, రిటైల్ రంగాల్లో ఆయా వ్యాపార‌, వాణిజ్య సంస్థ‌ల‌కు గ‌ణ‌నీయ లాభాలు తీసుకొచ్చి యువ‌త‌రానికి ఉద్యోగావ‌కాశాల క‌ల్ప‌న‌కు మార్గం సుగ‌మం చేసింద‌ని తేలింది. తాత్కాలిక‌.. శాశ్వ‌త అవ‌కాశాలు ఇప్ప‌టికే మ‌హా కుంభామేళా సంద‌ర్భంగా అనేక వ్యాపార‌, వాణిజ్య సంస్థ‌ల ద్వారా యువ‌త తాత్కాలిక ఉద్యోగాలతో ఉపాధి పొందుతున్నారు. దీంతో ఆయా కంపెనీలు ఆర్థికంగా మ‌రింత బ‌లోపేతం కానున్న నేప‌థ్యంలో భ‌విష్య‌త్తులో శాశ్వ‌త ప్రాతిపాదిక‌న కూడా యువ‌త‌కు ఉద్యోగ‌...
Amit Shah AP Tour : ఏపీ పర్యటనలో అమిత్ షా.. బిగ్ అప్‌డేట్‌
National

Amit Shah AP Tour : ఏపీ పర్యటనలో అమిత్ షా.. బిగ్ అప్‌డేట్‌

Amit Shah AP Tour : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh)లో ప‌ర్య‌టిస్తున్నారు. ఆయ‌న టూర్ రెండు రోజుల‌పాటు కొన‌సాగ‌నుంది. నిన్న రాత్రి గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం చేరుకున్న అమిత్‌షా (Amit Shah)కు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌, కేంద్ర హోం స‌హాయ మంత్రి బండి సంజ‌య్‌, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షురాలు పురందేశ్వ‌రితోపాటు ఇత‌ర టీడీపీ, జ‌న‌సేన, బీజేపీ కూట‌మి నేత‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయ భేటీలు, ఎన్డీఆర్‌ఎఫ్ క్యాంపుల ప్రారంభం వంటి కార్యక్రమాలతో అమిత్ షా పర్యటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీ భద్రత న‌డుమ‌ కేంద్ర హోం శాఖ మంత్రి (Minister of Home Affairs) అమిత్ షా పర్యటన సందర్భంగా పోలీసు శాఖ దాదాపు 1,200 మంది భద్రతా సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ముఖ్య...
Union Budget 2025 : 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
National

Union Budget 2025 : 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Parliament Budget Session | పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలకు రంగం సిద్దమవుతోంది. ఈ నెల 31 నుంచి సమావేశాలు (Union Budget 2025) ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 31న పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఏప్రిల్‌ నాలుగో తేదీన ముగుస్తాయి. తొలి విడత సమావేశాలు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు, మలి విడత సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్‌ నాలుగో తేదీ వరకు కొనసాగనున్నాయి. Union Budget 2025 Expectations Live Updates : సాధారణ మధ్య తరగతి ప్రజల టెక్, హెల్త్‌కేర్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ వర్గాల వరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే ఎనిమిదో బడ్జెట్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా...
error: Content is protected !!