Sarkar Live

National

Parliament Winter Session | బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్‌.. పార్ల‌మెంట్‌లో మాటల మంటలు..
National

Parliament Winter Session | బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్‌.. పార్ల‌మెంట్‌లో మాటల మంటలు..

Parliament Winter Session : పార్ల‌మెంట్ శీతాకాల సమావేశంలో ఉభ‌య స‌భ‌లు వాడీవేడిగా సాగుతున్నాయి. రాజ్యసభలో విపక్షాలు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాజ్యసభ రెండు రోజుల రాజ్యాంగ చర్చను నిర్వహిస్తోంది. భారత రాజ్యాంగం ఆమోదానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన ఈ చర్చకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాయకత్వం వహిస్తున్నారు. పార్లమెంట్లో వాడీవేడి చ‌ర్చ‌ శుక్రవారం, శనివారం రెండు రోజుల‌పాటు లోక్‌సభ (Lok sabha)లో రాజ్యాంగంపై చర్చ జరిగింది. సోమ‌వారం కూడా వాడివేడిగా సాగింది. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ త‌న‌ ప్రసంగంలో రాజ్యాంగాన్ని రక్షణ కవచంగా అభివ‌ర్ణించారు. రాజ్యాంగంపై వీర్ సావర్కర్ విమర్శలను ఉదహరిస్తూ రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాట్లాడారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్ర‌తిస్పందిస్తూ నెహ్రూ-గాంధీ కుటుంబంపై తీవ్...
Christmas Special Trains : క్రిస్మస్ సందర్భంగా సికింద్రాబాద్ నుంచి ఈ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు
National

Christmas Special Trains : క్రిస్మస్ సందర్భంగా సికింద్రాబాద్ నుంచి ఈ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

Christmas Special Trains : క్రైస్త‌వుల‌కు అతిపెద్ద పండుగ అయిన క్రిస్మస్ వచ్చిందంటే చాలు పెద్ద సంఖ్య‌లో ప్రత్యేక ప్రాంతాలకు వెళ్తుంటారు. దేశంలో ప్రసిద్ధి గాంచిన విల్లుపురం(Villupuram), బ్రహ్మపూర్ (Brahmapur) ప్రాంతాల‌ను సందర్శిస్తారు. తమిళనాడులో గ‌ల‌ విల్లుపురానికి ఎంతో చరిత్ర ఉంది. క్రిస్మస్ సందర్భంగా ఇక్క‌డికి భారీగా సందర్శకులు వ‌స్తారు. విల్లుపురంలోని చర్చిలలో ఏటా కరోల్ గానంతో సహా ప్రత్యేక సేవలను నిర్వహిస్తారు. ఇవి ఇక్క‌డికి వ‌చ్చే క్రైస్తవులు ఎంతో ఇష్ట‌ప‌డ‌తారు.సామూహిక ప్రార్థనలు, భోజనాలు, వేడుక‌లు ఇక్క‌డ అంగ‌రంగ వైభ‌వంగా నిర్వహిస్తారు. ఇక ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో కూడా క్రిస్మస్ వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హిస్తారు. బ్రహ్మపూర్‌లో పెద్ద సంఖ్యలో క్రైస్తవ జ‌నాభా ఉంది. ఇక్కడ క్రిస్మస్ సందర్భంగా చర్చి సేవలు, ఊరేగింపులు వంటివి ఘ‌నంగా జ‌రుగుతాయి. క్రిస్మ‌స్ (Christmas) సంద‌ర్భంగా ప్ర‌త్యేక రైళ్లు.. ...
AAP Candidate List | న్యూ ఢిల్లీ నుంచి కేజ్రీవాల్‌, కాల్కాజీ నుంచి అతిషి
National

AAP Candidate List | న్యూ ఢిల్లీ నుంచి కేజ్రీవాల్‌, కాల్కాజీ నుంచి అతిషి

AAP Candidate List all updates : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు స‌మీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ ముంద‌స్తు చ‌ర్య‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మ‌రింత వేగం పెంచింది. త్వరలోనే ఎన్నికల సంఘం ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల తేదీలను ప్రకటించనున్న నేప‌థ్యంలో త‌మ అభ్య‌ర్థుల నాలుగో జాబితాను విడుద‌ల చేసింది. 70 స్థానాల్లో 38 స్థానాల‌కు అభ్య‌ర్థుల పేర్ల‌ను ఆప్ ప్ర‌క‌టించింది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కొత్త ఢిల్లీ నుంచి పోటీ చేయ‌నున్నారు. కాల్కాజీ నుంచి ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి అతిషి మార్లెనా సింగ్ పోటీ చేస్తారు. ముఖ్య స్థానాల నుంచి ప్రముఖ అభ్యర్థులు ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి శకూర్ బస్తీ నుంచి సత్యేందర్ జైన్‌ను రంగంలోకి దింపింది. మాల్వియా నగర్ నుంచి సోమనాథ్ భారతి, గ్రేటర్ కాలాశ్ నుంచి సౌరభ్ భరద్వాజ్, బాబర్‌పూర్ నుంచి గోపాల్ రాయ్ పోటీ చేస్తున్నారు. కస్తూర్బా నగర్ అసెంబ్లీ స్థానం నుంచి రమే...
Vallabhbhai Patel | దేశ‌ సమగ్రత కోసం పాటుప‌డిన ఐరన్‌ మ్యాన్
National

Vallabhbhai Patel | దేశ‌ సమగ్రత కోసం పాటుప‌డిన ఐరన్‌ మ్యాన్

Sardar Vallabhbhai patel : స‌ర్దార్ వ‌ల్ల‌భ్‌భాయి ప‌టేల్‌.. భార‌తదేశానికి ఒక ఐకాన్‌. ఆయ‌న గురించి తెలియ‌ని వారు ఉండ‌రు. స్వాతంత్య్ర పోరాటంలో ప‌టేల్ కీల‌క సేనాని. దేశానికి నాయకత్వం వ‌హించ‌డం, సమగ్రతను కాపాడ‌టం, ప్రజల హక్కుల కోసం పోరాడ‌టంలో వ‌ల్లభ్‌భాయి పోషించిన పాత్ర నేటి త‌రానికి మార్గ‌ద‌ర్శ‌కం. 1950 డిసెంబర్ 15న గుండెపోటుతో ఆయన మరణించారు. ఆయ‌న క‌న్నుమూసి నేటికి 74 ఏళ్లు. అంకిత‌భావం గ‌ల నేత వ‌ల్ల‌భ్‌భాయి ప‌టేల్‌ 1875లో గుజరాత్‌లోని నడియాడ్‌లో జన్మించారు. మొదట తన వృత్తిని న్యాయవాదిగా ప్రారంభించిన ఆయ‌న ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1947 ఆగస్టు 15 నుంచి 1950 డిసెంబర్ 15 వరకు భారత తొలి హోం మంత్రిగా, ఉప ప్రధాని హోదాలో సేవలు అందించారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ పనిచేశారు. దేశ‌ సమగ్రత (నేషనల్ ఇన్టిగ్రేషన్) పట్ల అంకితభావం వ‌ల్ల వ‌ల్ల‌భ్‌భాయి ప‌టేల్‌ ‘భారత ఐరన్‌ మ్యాన్’గా బిరుదు...
LK Advani | ఐసీయూలో అధ్వానీ.. మ‌ళ్లీ ఆస్ప‌త్రిలో చేరిన దిగ్గ‌జ నేత‌
National

LK Advani | ఐసీయూలో అధ్వానీ.. మ‌ళ్లీ ఆస్ప‌త్రిలో చేరిన దిగ్గ‌జ నేత‌

LK Advani : మాజీ ఉప ప్రధాని, బీజేపీ విశ్రాంత దిగ్గ‌జ నేత ఎల్.కె. అద్వానీ మ‌రోసారి అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఢిల్లీలోని అపోలో ఆస్ప‌త్రి (Apollo Hospital) ఐసీయూలో ఆయ‌న శ‌నివారం చేరారు. అద్వానీ పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని ఆస్ప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. న్యూరాలజీ విభాగానికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వినీత్ సూరి ఆధ్వర్యంలో అద్వానీ చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం ఆయ‌న్ను ఆస్ప‌త్రికి తీసుకొచ్చారు. అయితే.. ఈసారి ఆస్ప‌త్రిలో చేరడానికి కార‌ణం ఇంకా వెల్లడికాలేదు. ఇదే ఆస్ప‌త్రిలో అద్వానీ చేరడం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది తొలిరోజుల్లో ఆయ‌న ఆస్ప‌త్రిలో చేరారు. ఆత‌ర్వాత జూలైలో కూడా అద్వానీ ఇదే ఆస్ప‌త్రిలోని వైద్యుల ప‌ర్య‌వేక్షణ‌లో ఉన్నారు. అనంత‌రం డిశ్చార్జ్ అయ్యారు. అలాగే సాధారణ వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఆగ‌స్టులో ఆయ‌న ఆస్ప‌త్రిలో చేరారు. అప్పుడు కూడా ఆ హాస్పిట‌ల్ ప్ర‌త్యే...
error: Content is protected !!