Sabarimala special trains శబరిమల ప్రత్యేక రైళ్లు రద్దు.. కారణమిదే.. !
Indian Railways | అయ్యప్ప మాలధారుల కోసం శబరిమలకు నడిపిస్తున్న ప్రత్యేక రైళ్ల (Sabarimala special trains ) ను దక్షిణ మధ్య రైల్వే (SCR) రద్దు చేసింది. యాత్రికుల సంఖ్య రద్దీ తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం 14 ప్రత్యేక రైళ్లను రద్దు చేసింది. సాధారణంగా శబరిమల యాత్రా సీజన్ డిసెంబర్ నుంచి జనవరి మధ్య ఉంటుంది. జనవరి 15 వరకు యాత్రికుల సంఖ్య ఎక్కువగా ఉంటూ క్రమేణా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) 120కు పైగా ప్రత్యేక రైళ్లను ప్లాన్ చేసింది. కానీ.. ఇప్పుడు యాత్రికుల సంఖ్య తగ్గడం కారణంగా జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 మధ్య రైళ్లను రద్దు చేసింది.
శరిమలకు రైల్వే సర్వీసులు
శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానికిఇ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. వీరి రవాణా సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంద...




