Sarkar Live

National

PrayagRaj : మహా కుంభామేళా.. ల‌క్ష‌ల కొలువుల జాత‌ర
National

PrayagRaj : మహా కుంభామేళా.. ల‌క్ష‌ల కొలువుల జాత‌ర

PrayagRaj : ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) లోని ప్రయాగరాజ్ లో జ‌రుగుతున్న మ‌హా కుంభామేళా (Maha Kumbh 2025) ఆధ్యాత్మికంగానే కాకుండా ఉపాధి క‌ల్ప‌నకు దోహ‌దం చేస్తోందని అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఈ మ‌హా కుంభామేళా అనేక ఉద్యోగాల‌ను సృష్టించి నిరుద్యోగ నిర్మూల‌నకు బాట‌లు వేసింద‌ని తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. ముఖ్యంగా ప‌ర్యాట‌క, ర‌వాణా, లాజిస్టిక్స్‌, ఆరోగ్య సంర‌క్ష‌ణ‌, ఐటీఈ, రిటైల్ రంగాల్లో ఆయా వ్యాపార‌, వాణిజ్య సంస్థ‌ల‌కు గ‌ణ‌నీయ లాభాలు తీసుకొచ్చి యువ‌త‌రానికి ఉద్యోగావ‌కాశాల క‌ల్ప‌న‌కు మార్గం సుగ‌మం చేసింద‌ని తేలింది. తాత్కాలిక‌.. శాశ్వ‌త అవ‌కాశాలు ఇప్ప‌టికే మ‌హా కుంభామేళా సంద‌ర్భంగా అనేక వ్యాపార‌, వాణిజ్య సంస్థ‌ల ద్వారా యువ‌త తాత్కాలిక ఉద్యోగాలతో ఉపాధి పొందుతున్నారు. దీంతో ఆయా కంపెనీలు ఆర్థికంగా మ‌రింత బ‌లోపేతం కానున్న నేప‌థ్యంలో భ‌విష్య‌త్తులో శాశ్వ‌త ప్రాతిపాదిక‌న కూడా యువ‌త‌కు ఉద్యోగ‌...
Amit Shah AP Tour : ఏపీ పర్యటనలో అమిత్ షా.. బిగ్ అప్‌డేట్‌
National

Amit Shah AP Tour : ఏపీ పర్యటనలో అమిత్ షా.. బిగ్ అప్‌డేట్‌

Amit Shah AP Tour : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh)లో ప‌ర్య‌టిస్తున్నారు. ఆయ‌న టూర్ రెండు రోజుల‌పాటు కొన‌సాగ‌నుంది. నిన్న రాత్రి గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం చేరుకున్న అమిత్‌షా (Amit Shah)కు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌, కేంద్ర హోం స‌హాయ మంత్రి బండి సంజ‌య్‌, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షురాలు పురందేశ్వ‌రితోపాటు ఇత‌ర టీడీపీ, జ‌న‌సేన, బీజేపీ కూట‌మి నేత‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయ భేటీలు, ఎన్డీఆర్‌ఎఫ్ క్యాంపుల ప్రారంభం వంటి కార్యక్రమాలతో అమిత్ షా పర్యటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీ భద్రత న‌డుమ‌ కేంద్ర హోం శాఖ మంత్రి (Minister of Home Affairs) అమిత్ షా పర్యటన సందర్భంగా పోలీసు శాఖ దాదాపు 1,200 మంది భద్రతా సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ముఖ్య...
Union Budget 2025 : 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
National

Union Budget 2025 : 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Parliament Budget Session | పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలకు రంగం సిద్దమవుతోంది. ఈ నెల 31 నుంచి సమావేశాలు (Union Budget 2025) ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 31న పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఏప్రిల్‌ నాలుగో తేదీన ముగుస్తాయి. తొలి విడత సమావేశాలు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు, మలి విడత సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్‌ నాలుగో తేదీ వరకు కొనసాగనున్నాయి. Union Budget 2025 Expectations Live Updates : సాధారణ మధ్య తరగతి ప్రజల టెక్, హెల్త్‌కేర్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ వర్గాల వరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే ఎనిమిదో బడ్జెట్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా...
Fast Track Immigration : హైదరాబాద్ విమానాశ్రయంలో ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్
National

Fast Track Immigration : హైదరాబాద్ విమానాశ్రయంలో ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్

Fast Track Immigration : హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ - ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ (FTI-TTP) ప్రారంభమైంది. భారతీయ పాస్‌పోర్టుదారులు, ఓసీఐ (ఓవ‌ర్సిస్ సిటీజ‌న్స్ ఆఫ్ ఇండియా) కార్డుదారులకు మ‌రింత వేగ‌వంత, సుల‌భ‌త‌ర‌ ఇమ్మిగ్రేష‌న్ సేవ‌లు అందించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఈ వ్య‌వ‌స్థ (Fast Track Immigration – Trusted Traveller Programme)ను అందుబాటులోకి తెచ్చింది. త‌ద్వారా ఎయిర్‌పోర్టులో ప్ర‌యాణికులు ఎక్కువ సేపు వేచి చూడ‌కుండా సుల‌భంగా ఇమ్మిగ్రేష‌న్ పొంది స‌మ‌యాన్ని ఆదా చేసుకోవ‌చ్చు. ఇమ్మిగ్రేష‌న్ కోసం ప్ర‌యాణికులు ఆన్‌లైన్‌లో ముందుగానే ద‌ర‌ఖాస్తు చేసుకొని ధ్రువీక‌ర‌ణ పొందాక నేరుగా ఎయిర్‌పోర్టుకు వెళ్లి బ‌యోమెట్రిక్ ద్వారా వెంట‌నే క్లియ‌రెన్స్ పొందొచ్చు. కౌంటర్ల వద్ద ఎక్కువ స‌మ‌యాన్ని వెచ్ఛించాల్సిన అవ‌స‌రం ఇక‌ ఉండ‌దు. FTI-TTP సేవ‌లు ఎలా ప...
8th Pay Commission : కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు మోదీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌..
National

8th Pay Commission : కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు మోదీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌..

8th Pay Commission Approval : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్ష‌న్ల‌కు కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. లక్షలాది మంది ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లను పెంచేందుకు గాను 8వ వేతన సంఘాన్ని (8th Pay Commission) ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం వెల్ల‌డించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో న్యూదిల్లీలో కేంద్ర మంత్రివర్గం స‌మావేశమై ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకంది. కేబినెట్ స‌మావేశానికి సంబంధించిన నిర్ణ‌యాల‌ను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) మీడియాకు వెల్లడించారు. "1947 నుంచి ఇప్పటివరకు 7 వేతన సంఘాలు ఏర్పాటయ్యాయ‌ని, ఎలాంటి జాప్యానికి అవ‌కాశం లేకుండా వేతన సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి మోదీ నిర్ణ‌యించార‌ని కేంద్ర మంత్రి అశ్వ‌నీవైష్ణ‌వ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న పే కమిషన్ 2016లో ఏర్పాటయింది. ఆ వేతన సంఘం గడువు 2026లో ముగుస్త...
error: Content is protected !!