Sarkar Live

National

EVMs Role in Election Results | మ‌హారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎం పాత్ర‌పై క్లారిటీ
National

EVMs Role in Election Results | మ‌హారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎం పాత్ర‌పై క్లారిటీ

EVMs Role in Election Results : మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ఫ‌లితాలపై ఈవీఎంలు ప్ర‌భావితం చేశాయ‌ని ప్ర‌తిప‌క్షాలు సందేహాలు వ్య‌క్తం చేస్తూ వ‌స్తున్నాయి. ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ప‌క్ష‌పాత ధోర‌ణిని అవ‌లంబించింద‌ని ఆరోపిస్తున్నాయి. పోలింగ్ అనంత‌రం ఫ‌లితాల‌కు ముందు ఈవీఎం (EVM)ల‌ను మార్చార‌ని, ఈ చ‌ర్య ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ప్ర‌భావితం చేసింద‌ని అంటోంది. అయితే... ఈ ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని తేట‌తెల్లం చేసింది ఎన్నిక‌ల క‌మిష‌న్. వీవీప్యాట్ల (VVPAT)లోని స్లిప్పుల‌ను, ఈవీఎంలో న‌మోదైన ఓట్ల‌ను పోల్చి చూపించింది. ఈ రెండింటి సంఖ్య స‌రిస‌మానంగా ఉండ‌టంతో ఫ‌లితాలను తారుమారు చేయ‌డంలో ఈవీఎంల పాత్ర ఏమీ లేద‌ని మరోసారి నిరూపించుకుంది. నిజం కాద‌ని నిరూప‌ణ‌ మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఈవీఎం పాత్ర‌, ఎన్నిక‌ల క‌మిష‌న్ పార‌ద‌ర్శ‌క‌తా లోపంపై విప‌క్షాలు చేస్తున్న ఆరోపణ‌ల‌పై ఎన్నిక‌ల అద‌న‌పు ప్ర‌ధాన అధికారి కిర‌ణ్ కుల‌క‌ర్ణి స్పం...
Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ అంటూనే విలాస జీవితం.. అర‌వింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ ధ్వ‌జం
National

Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ అంటూనే విలాస జీవితం.. అర‌వింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ ధ్వ‌జం

Arvind Kejriwal : అర‌వింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తూ బీజేపీ మంగ‌ళ‌వారం ఒక వీడియో విడుద‌ల చేసింది. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి రాజీనామా చేసినా ఢిల్లీలోని ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులోని అధికారిక బంగ్లాను కేజ్రీవాల్ ఖాళీ చేయ‌క‌పోవ‌డంపై అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. తాను ఆమ్ ఆద్మీ (సామాన్య మాన‌వుడు) అంటూనే కేజ్రీవాల్ అద్దాల మెడ‌ను క‌ట్టుకున్నార‌ని విమ‌ర్శించింది. ప్రభుత్వం తరఫున ఇల్లు తీసుకోనని చెబుతూనే 7-స్టార్ రిసార్ట్‌ను నివాసంగా మార్చుకున్నారని బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ నివాసంలో ప్ర‌భుత్వ ఖజాను వెచ్ఛించి రూ.1.9 కోట్లతో మార్బుల్ గ్రానైట్, లైటింగ్, రూ.1.5 కోట్లతో మరమ్మతులు, రూ. 35 లక్షలతో జిమ్, స్పాను కేజ్రీవాల్ ఏర్పాటు చేసుకున్నార‌ని మండిప‌డ్డారు. ఒక సామాన్య మ‌నిషిని అని చెప్పుకొనే కేజ్రీవాల్ ప్ర‌జ‌ల సొమ్ముతో విలాస‌వంత జీవితం గ‌డుపుతున్నార‌ని ఆరోపించారు. ఈ భ‌వ‌నానికి సంధించిన వీడియోల‌...
One Nation One Election | ఈ సేష‌న్‌లోనే ‘వ‌న్ నేష‌న్‌, వ‌న్ ఎలక్ష‌న్‌’… శీతాకాల పార్ల‌మెంట్‌ స‌మావేశాల్లోనే బిల్లు!
National

One Nation One Election | ఈ సేష‌న్‌లోనే ‘వ‌న్ నేష‌న్‌, వ‌న్ ఎలక్ష‌న్‌’… శీతాకాల పార్ల‌మెంట్‌ స‌మావేశాల్లోనే బిల్లు!

One Nation One Election : మోదీ ప్ర‌భుత్వం మ‌రో సంచ‌ల‌నాన్ని సృష్టించబోతోంది. 'వ‌న్ నేష‌న్, వ‌న్ ఎల‌క్ష‌న్‌'కు కార్య‌రూపం దాల్చ‌బోతుంద‌ని తెలుస్తోంది. ఒకే దేశం, ఒకే ఎన్నిక (One Nation One Election) అనే విధానంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల‌నేది ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆకాంక్ష‌. దీన్ని అమ‌ల్లోకి తెచ్చేందుకు బీజేపీ ప్రభుత్వం అడుగులు మ‌రింత ముందుకు వేసింద‌ని తెలుస్తోంది. ఈ శీతాకాల పార్ల‌మెంటు స‌మావేశాల్లోనే వ‌న్ నేష‌న్‌, వ‌న్ ఎల‌క్ష‌న్ బిల్లును ప్ర‌వేశ‌పెట్టాల‌ని కేంద్ర సిద్ధ‌మ‌వుతోంద‌ని స‌మాచారం. ఈ అంశంపై రామ్‌నాథ్ కోవింద్ క‌మిటీ చేసిన సిఫార్సుల‌ను కేంద్ర కేబినెట్ ఇప్ప‌టికే ఆమోదించింది. పార్ల‌మెంటులో ఈ బిల్లు పాసైతే దేశ‌వ్యాప్తంగా ఒకేసారి ఎన్నిక‌లు జ‌రుగుతాయి. మ‌ద్ద‌తును కూడ‌బెట్టుకునేందుకు.. వ‌న్ నేష‌న్‌, వ‌న్ ఎల‌క్ష‌న్ బిల్లుకు మ‌ద్ద‌తు పొంద‌డానికి కేంద్రం క‌స‌ర‌త్తు చేస్తోంది. జాయింట్ పార...
farmers protest : నిర‌స‌న‌ల్లో అనేక మ‌లుపులు.. రైతుల ఆందోళ‌న.. ఉద్రిక్త‌త‌
National

farmers protest : నిర‌స‌న‌ల్లో అనేక మ‌లుపులు.. రైతుల ఆందోళ‌న.. ఉద్రిక్త‌త‌

farmers protest : కేంద్ర వైఖ‌రికి చేప‌ట్టిన రైతుల ఆందోళ‌న అనేక మ‌లుపులు తిరుగుతోంది. పంట‌ల మ‌ద్ద‌తు ధ‌రకు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించ‌డంతోపాటు ప‌లు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ రైతులు నాలుగేళ్లుగా ఆందోళ‌న‌బాట పట్టిన విష‌యం విదిత‌మే. పంజాబ్‌, హ‌ర్యానా, యూపీ స‌హా ప‌లు రాష్ట్రాలకు చెందిన రైతులు సమ్యూక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాగా ఏర్ప‌డి నిర‌స‌న‌లు తెలుపుతున్నారు. ఈ క్ర‌మంలో ఫిబ్రవరి 13 నుంచి పంజాబ్-హ‌ర్యానా, శంబూ-ఖ‌నౌరి స‌రిహ‌ద్దులో మ‌కాం వేశారు. ఇదే క్ర‌మంలో నిర‌స‌న‌ల్లో భాగంగా రైతులు చ‌లో ఢిల్లీ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. వారి ఢిల్లీ మార్చ్‌ను భ‌ద్ర‌తా సిబ్బంది అడ్డుకోవడంతో ఉద్ర‌క్త‌త నెల‌కొంది. పార్లమెంట్ ఎదుట నిరసనకు బయల్దేరిన‌ యూపీకి చెందిన రైతులను నొయిడా సరిహద్దుల్లో అడ్డుకోవడం, దీంతో అన్న‌దాత‌లు ఆందోన‌కు దిగ‌డంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసుల ఆంక్షల ...
Congress | విదేశీ సంస్థ‌తో కాంగ్రెస్‌కు ఆర్థిక ప్ర‌యోజ‌నాలు… రాజ‌కీయ శిబిరంలో క‌ల‌క‌లం
National

Congress | విదేశీ సంస్థ‌తో కాంగ్రెస్‌కు ఆర్థిక ప్ర‌యోజ‌నాలు… రాజ‌కీయ శిబిరంలో క‌ల‌క‌లం

Financial benefits to Congress from a foreign organization : విదేశీ సంస్థ‌తో కాంగ్రెస్‌కు ఆర్థిక ప్ర‌యోజ‌నాలు చేకూరుతున్నాయ‌ని వ‌స్తున్న ఆరోప‌ణ‌లు ఆ పార్టీలో ప్రకంప‌ణ‌లు సృష్టిస్తున్నాయి. జార్ట్ సోరోస్ ఫౌండేష‌న్ నిధుల‌తో న‌డిచే సంస్థ‌తో సోనియాగాంధీ సత్సంబంధాలు క‌లిగి ఉన్నార‌ని బీజేపీ ఆరోపిస్తోంది. దీంతో విదేశీ సంస్థ‌తో కాంగ్రెస్‌కు ఆర్థిక ప్ర‌యోజ‌నాలు చేకూరుతున్నాయ‌ని తేట‌తెల్ల‌మైంద‌ని విమ‌ర్శిస్తోంది. దీన్ని కాంగ్రెస్‌తోపాటే అమెరికా ప్ర‌భుత్వ ప్ర‌తినిధులు తోసిపుచ్చారు. దీన్ని కూడా బీజేపీ త‌ప్పుప‌డుతోంది. విప‌క్షాలతో క‌లిసి భార‌త్‌ను అస్థిర ప‌ర్చేందుకు విదేశీయులు కుట్ర ప‌న్నుతున్నార‌న‌డానికి ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని అభివ‌ర్ణించింది. కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రం కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కురాలు, ఆ పార్టీ మాజీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీపై వ‌స్తున్న అవినీతి ఆరోప‌ణ‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. మ...
error: Content is protected !!