Sarkar Live

National

Maha Kumbh Mela 2025 | మహా కుంభామేళా.. ఆర్థిక వ్యవస్థకు బూస్టింగ్..
National

Maha Kumbh Mela 2025 | మహా కుంభామేళా.. ఆర్థిక వ్యవస్థకు బూస్టింగ్..

Maha Kumbh Mela 2025 : ఉత్త‌రప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్ (Prayagraj)లో జ‌రిగే మ‌హా కుంభామేళా ప్రారంభానికి సిద్ధ‌మైంది. ప్ర‌పంచంలోనే అతి పెద్ద ధార్మిక‌ స‌మ్మేళ‌నమైన ఈ మహా కుంభామేళాలో సుమారు 40 కోట్ల మంది భక్తులు హాజ‌ర‌వుతార‌ని అంచ‌నా. గంగా, జుమునా, స‌ర‌స్వ‌తి న‌దుల సంగ‌మం వ‌ద్ద ఆధ్యాత్మిక మహా వేడుక ప్రారంభం కానుంది. యావత్ ప్ర‌పంచ‌మే అబ్బుర ప‌డేలా.. మ‌హా కుంభామేళా రేప‌టి (జ‌న‌వ‌రి 13) నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్ర‌వ‌రి 26 వ‌ర‌కు కొన‌సాగనుంది. అశేష భ‌క్త జ‌న‌వాహిని మ‌ధ్య యావ‌త్ ప్ర‌పంచ‌మే అబ్బురప‌డేలా అత్యంత వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. ఈ ఆధ్మాత్మిక స‌మ్మేళ‌నంలో దేశ విదేశాల నుంచి కోట్లాది మంది పాల్లొన‌నున్నారు. పెర‌గ‌నున్న జీడీపీ మ‌హా కుంభామేళా భార‌తీయ ఆర్థిక వ్యవస్థకు భారీగా ప్రేరణ ఇవ్వ‌లగ‌ల‌ద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌న దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుప‌డి, జీడీపీ 1 % కి పైగా పెరుగుతు...
Pravasi Bharatiya Express | ఎన్ఆర్ఐల కోసం అందుబాటులోకి ప్ర‌త్యేక రైలు..
National

Pravasi Bharatiya Express | ఎన్ఆర్ఐల కోసం అందుబాటులోకి ప్ర‌త్యేక రైలు..

Pravasi Bharatiya Express : ఎన్ఆర్ఐల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్ పేరుతో ప్ర‌త్యేక రైలును అందుబాటులోకి తెచ్చింది. దీన్ని ప్ర‌ధాని మోదీ (Prime Minister Narendra Modi ) ఈ రోజు ప్రారంభించారు. ఈ రైలు మూడు వారాల పాటు భారతదేశంలోని వివిధ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలకు ప్ర‌య‌ణిస్తుంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ప్రవాసీ తీర్థ దర్శన్ యోజన (Pravasi Teertha Darshan Yojana)లో భాగంగా దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలు ఈ రైలును 45 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ ప్రవాసుల (NRIs) కోసం ప్రత్యేకంగా రూపొందించారు. 2025 జనవరి 9 న ప్రారంభమయ్యే ఈ రైలు మూడు వారాల పాటు దేశంలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలకు ప్రయాణిస్తుంది. ఈ రైలును జ‌న‌వ‌రి 9 నాడే ప్రారంభించ‌డానికి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. 110 సంవత్స‌రాల క్రితం 1915లో మహా...
Maha Kumbh mela 2025: మ‌హాకుంభ‌మేళాకు వేళాయే.. ప్ర‌యాగ్‌రాజ్‌లో ఆధ్యాత్మిక శోభ..
National

Maha Kumbh mela 2025: మ‌హాకుంభ‌మేళాకు వేళాయే.. ప్ర‌యాగ్‌రాజ్‌లో ఆధ్యాత్మిక శోభ..

Maha Kumbh mela 2025 : మహా కుంభ‌మేళా భారతీయ ఆధ్యాత్మికతకు ప్రతీక. ప్రతి 12 ఏళ్ల‌కోసారి జ‌రిగే ఈ మహోత్సవానికి ఏర్పాట్ల‌ను స‌ర్వం సిద్ధం చేస్తున్నారు. జ‌న‌వ‌రి 13 నుంచి ఫిబ్రవరి 26 వ‌రకు నిర్వ‌హించే ఈ భ‌క్త‌జ‌న జాత‌ర ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌ది. ఈసారి (2025) మ‌హాకుంభ‌మేళాలో 40-45 కోట్ల మంది పాల్గొంటార‌ని అంచ‌నా. ఇందుకు త‌గ్గ‌ట్టే ప్ర‌భుత్వాలు అన్ని ర‌కాల సౌక‌ర్యాల‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. మోక్ష ప్రాప్తికి అరుదైన అవ‌కాశం గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో నిర్వ‌హించే మహోత్సవం మ‌హాకుంభ‌మేళా. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్‌లో 45 రోజుల‌పాటు జ‌రిగే ఆధ్యాత్మిక ఉత్స‌వం ఇది. ప్రపంచంలోనే అతి పెద్ద పుణ్యకార్యాల క్షేత్రంగా మ‌హాకుంభ‌మేళా నిలుస్తుంది. ఇందులో పాల్గొన‌డంతో త‌మ జీవితం ధ‌న్య‌మ‌వుతుంద‌ని భావిస్తారు భ‌క్తులు. పూర్వీకుల పాపాల‌ను కడగకట్టేందుకు, మోక్షం పొందేందుకు అరుదైన అవకాశంగా ...
Green energy 2025 | భారత్ లో  గ్రీన్ ఎన‌ర్జీ.. 2025లో 214 గిగావాట్ల సామర్థ్యం
National

Green energy 2025 | భారత్ లో గ్రీన్ ఎన‌ర్జీ.. 2025లో 214 గిగావాట్ల సామర్థ్యం

Green energy 2025 : భారతదేశంలో గ్రీన్ ఎన‌ర్జీ ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోంది. 2024 సెప్టెంబరు నాటికి మొత్తం 200 GW పునరుత్పాదక శక్తి (renewable energy) సామర్థ్యాన్ని ఇది అధిగమించింది. 2025 ప్రారంభానికి 214 GW సామర్థ్యానికి చేరుకుంది. 2030 నాటికి 500 GW నాన్ నాసిల్ ఫ్యూయల్ ఎనర్జీ లక్ష్యాన్ని చేరుకోనుంద‌ని అంచ‌నా. గ్రీన్ ఎన‌ర్జీ పున‌రుత్పాద‌క శ‌క్తినిపెంచేందుకు భార‌త‌దేశం ముంద‌డుగు వేస్తోంద‌ని, దీంతో ఈ రంగంలో దినదినాభివృద్ధి చెందుతున్నామ‌ని కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది, Green energy 2024లో సాధించిన విజయాలు గతేడాది ఏప్రిల్ నుంచి నవంబ‌రు వరకు భారతదేశం 15 GW పునరుత్పాదక శక్తిని జోడించింది. 2023 అదే కాలంలో 7.57 GW జోడించగా ఇది రెండింతలు పెరిగింది. 2024లో సౌర శక్తి (solar energy) సామర్థ్యం 94.17 GWకు, వాయు శక్తి సామర్థ్యం 47.96 GWకు చేరుకుంది. నవంబరు 2024 నాటికి మొత్తం సౌర ప్రాజెక...
Vijayawada Special Trains | మహా కుంభమేళా కోసం విజయవాడ మీదుగా ప్రయాగ్‌రాజ్ కు ప్రత్యేక రైళ్లు
National

Vijayawada Special Trains | మహా కుంభమేళా కోసం విజయవాడ మీదుగా ప్రయాగ్‌రాజ్ కు ప్రత్యేక రైళ్లు

Vijayawada Special Trains : అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న మహా కుంభమేళా (Maha Khubh 2025) ఉత్స‌వం కోసం భ‌క్తులు, ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం విజయవాడ మీదుగా ప్ర‌యాగ్‌రాజ్‌కు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ద‌క్షిణ మ‌ధ్య‌ రైల్వే అధికారులు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం తిరుపతి-బెనారస్ ప్రత్యేక రైలు (07107) జనవరి 18, ఫిబ్రవరి 8, 15, 23 శనివారాల్లో తిరుపతి నుంచి రాత్రి 8:55 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 3:45 గంటలకు బెనారస్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నెం. 07108 జనవరి 20, ఫిబ్రవరి 10, 17, 24 సోమవారాల్లో సాయంత్రం 5:30 గంటలకు బెనారస్ నుంచి బయలుదేరుతుంది. హాల్టింగ్ స్టేష‌న్లు ఈ రైళ్లు గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమహేంద్రవరం, సామర్లకోట, అన్నవరం, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, రావినగరం, బొబ్బి...
error: Content is protected !!