Maha Kumbh Mela 2025 | మహా కుంభామేళా.. ఆర్థిక వ్యవస్థకు బూస్టింగ్..
Maha Kumbh Mela 2025 : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ (Prayagraj)లో జరిగే మహా కుంభామేళా ప్రారంభానికి సిద్ధమైంది. ప్రపంచంలోనే అతి పెద్ద ధార్మిక సమ్మేళనమైన ఈ మహా కుంభామేళాలో సుమారు 40 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. గంగా, జుమునా, సరస్వతి నదుల సంగమం వద్ద ఆధ్యాత్మిక మహా వేడుక ప్రారంభం కానుంది.
యావత్ ప్రపంచమే అబ్బుర పడేలా..
మహా కుంభామేళా రేపటి (జనవరి 13) నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. అశేష భక్త జనవాహిని మధ్య యావత్ ప్రపంచమే అబ్బురపడేలా అత్యంత వైభవంగా జరగనుంది. ఈ ఆధ్మాత్మిక సమ్మేళనంలో దేశ విదేశాల నుంచి కోట్లాది మంది పాల్లొననున్నారు.
పెరగనున్న జీడీపీ
మహా కుంభామేళా భారతీయ ఆర్థిక వ్యవస్థకు భారీగా ప్రేరణ ఇవ్వలగలదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మన దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడి, జీడీపీ 1 % కి పైగా పెరుగుతు...




