Sarkar Live

National

One nation one Election | ఆ బిల్లు ఆమోదం పొంద‌దు.. దిగ్విజ‌య్ హాట్ కామెంట్స్
National

One nation one Election | ఆ బిల్లు ఆమోదం పొంద‌దు.. దిగ్విజ‌య్ హాట్ కామెంట్స్

One nation one Election : వ‌న్ నేష‌న్, వ‌న్ ఎల‌క్ష‌న్ బిల్లుపై కాంగ్రెస్ రాజ్య‌స‌భ సభ్యుడు దిగ్విజయ్‌ సింగ్ (Digvijaya Singh) సంచ‌ల‌న కామెంట్ చేశారు. జేపీసీకి బిల్లులు పంపినా పార్ల‌మెంటులో మాత్రం ఆమోదం పొంద‌ద‌ని వ్యాఖ్యానించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని అగ‌ర్ మాల్వాలో దిగ్విజయ్ మీడియాతో మాట్లాడారు. ఆ రెండూ ఆమోదం పొంద‌వు వ‌న్ నేష‌న్‌, వ‌న్ ఎల‌క్ష‌న్ (ONOE)తోపాటు రాజ్యాంగ సవరణ చేసే బిల్లు కూడా పార్ల‌మెంటులో దాఖ‌ల‌య్యాయి. వీటిపై లోక్‌సభలో హోరాహోరీ చర్చ జ‌రిగింది. ఈ రెండు బిల్లులను పార్లమెంటు (Parliament) సంయుక్త కమిటీ (JPC)కి పంపారు. ఈ నేప‌థ్యంలో మీడియాతో మాట్లాడిన దిగ్విజ‌య్ సింగ్ ఒక ప్ర‌శ్న‌న‌కు స‌మాధానంగా సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. జేపీసీ ఏర్పాటు చేశారు గానీ.. ఆ బిల్లులు ఆమోదం పొందవు అన్నారు. బీజేపీ ఎంపీలే ఒకరిపై ఒక‌రు ప‌డ్డారు.. బీజేపీ ఫిర్యాదుతో పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌ల...
PM Modi Kuwait Visit | కువైట్‌లో మోదీ చారిత్రాత్మక పర్యటన.. 43 ఏళ్లలో తొలిసారి..
National, Trending

PM Modi Kuwait Visit | కువైట్‌లో మోదీ చారిత్రాత్మక పర్యటన.. 43 ఏళ్లలో తొలిసారి..

PM Modi Kuwait Visit | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు కువైట్‌కు చేరుకున్నారు. రెండు రోజుల‌పాటు ఆయ‌న ఈ దేశంలో ప‌ర్య‌టించ‌నున్నారు. మోదీ ప‌ర్య‌ట‌న చారిత్ర‌కంగా నిలిచింది. 43 సంవత్సరాల తర్వాత గల్ఫ్ దేశానికి భారత ప్రధాని చేయబోయే తొలి పర్యటన ఇది. కువైట్ రాజు షేక్ మేశాల్ అల్ అహ్మద్ అల్ జబేర్ అల్ సబాహ్ ఆహ్వానం మేరకు మోదీ అక్క‌డి వెళ్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న రెండు దేశాల మ‌ధ్య పెరుగుతున్న సత్సంబంధాల‌కు ప్ర‌తీక అని విశ్లేష‌కులు అంటున్నారు. భార‌త్, కువైట్‌కు ప్ర‌యోజన‌క‌రంగా నిల‌వ‌నుంద‌ని, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. కువైట్‌తో బలమైన వాణిజ్య సంబంధాలు భార‌త్‌, కువైట్ మధ్య బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా శక్తి రంగంలో భారతదేశానికి కువైట్ అగ్ర వ్యాపార భాగస్వామిగా ఉంది. ఈ నేప‌థ్యంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం 10.47 బిలియన్ డాల‌ర్...
Om Prakash Chautala | ఓం ప్ర‌కాశ్ చౌతాలా క‌న్నుమూత‌
National

Om Prakash Chautala | ఓం ప్ర‌కాశ్ చౌతాలా క‌న్నుమూత‌

Om Prakash Chautala | హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్‌ద‌ళ్‌ (INLD) నేత ఓంప్రకాశ్ చౌతాలా (89) ఈ రోజు మ‌ధ్యాహ్నం కన్నుమూశారు. కొంతకాలంగా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయ‌న తుదిశ్వాస విడిచారు. గురుగ్రాంలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో 12 గంట‌ల‌కు చౌతాలా క‌న్నుమూశార‌ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు వెల్ల‌డించారు. మాజీ ఉప ప్ర‌ధాని దేవీలాల్ కుమారుడైన ఓం ప్ర‌కాశ్ హ‌ర్యానా సీఎంగా ఐదుసార్లు ప్రాతిధ్యం వ‌హించారు. ఆరోగ్యం క్షీణించి.. ఓంప్ర‌కాశ్ చౌతాలా (Om Prakash Chautala) మూడు నాలుగేళ్లుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఈరోజు ఉదయం చౌతాలా ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింద‌ని, దీంతో 11:35 గంటలకు ఆస్ప‌త్రిలో చేర్చామ‌ని, ప‌రీక్షించిన వైద్యులు అప్ప‌టికే ఆయ‌న మృతి చెందిన‌ట్టు నిర్ధారించార‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఆయ‌న అంత్య‌క్రియ‌లు రేపు (శ‌నివారం) సిర్సా ...
Parliament erupts | పార్లమెంట్ ప్రాంగణంలో హైడ్రామా .. ఎన్డీఏ, విపక్షాలు మధ్య రగడ
National

Parliament erupts | పార్లమెంట్ ప్రాంగణంలో హైడ్రామా .. ఎన్డీఏ, విపక్షాలు మధ్య రగడ

Parliament erupts | విపక్షాలు (INDIA), ఎన్డీఏ (NDA) ఎంపీల మధ్య పార్లమెంట్ ప్రాంగణంలో ఈ రోజు ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. తోపులాట, పెనుగులాటల‌తో ఉద్రిక్త‌ వాతావ‌ర‌ణం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి గాయపడ్డారు. దీంతో ఆయ‌న్ను ఆ పార్టీ నేత‌లు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. సారంగిని రాహుల్ గాంధీ (Rahul Gandhi) తోసేసార‌ని, దీంతో ఆయన కింద‌పడిపోయి గాయ‌ప‌డ్డార‌ని బీజేపీ ఆరోపిస్తోంది. ఆరోప‌ణలు.. ప్ర‌త్యారోప‌ణ‌లు అంబేడ్కర్ అంశంపై పార్ల‌మెంటు సాక్షిగా నిరసనలు జ‌రుగుతున్నాయి. అంబేద్క‌ర్‌ను హోంమంత్రి అమిత్ షా అవమానించార‌ని విపక్షాలు ఆరోపిస్తూ పార్ల‌మెంట్ లోప‌ల‌, వెలుప‌ల నిర‌స‌న‌లు చేప‌డుతున్నాయి. ఇదే క్ర‌మంలోనే ఈ రోజు సేష‌న్ ప్రారంభానికి ముందుకు పార్ల‌మెంటు ప్రాంగ‌ణంలో ప్ర‌తిప‌క్షాలు, బీజేపీ ఎంపీల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. తోపులాట‌లు, పెనుగులాట‌ల‌తో ఆ ప్రాంగ‌ణం హోరెత్తింది. తాను పార్లమెంట్ హౌస్‌లో ...
Real Estate | భారతదేశంలో రికార్డు స్థాయి పెట్టుబడులు
National

Real Estate | భారతదేశంలో రికార్డు స్థాయి పెట్టుబడులు

Real Estate in India : భారతదేశంలో ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగంలో సంస్థాగత పెట్టుబడులు కొత్త రికార్డును సృష్టించాయి. 2023తో పోలిస్తే 51 శాతం అధికంగా ఉండగా, మొత్తం పెట్టుబడులు $8.9 బిలియన్‌కు చేరినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ పెట్టుబడుల్లో విదేశీ పెట్టుబడిదారుల భాగస్వామ్యం 63 శాతంగా ఉండటం విశేషం. రియల్ ఎస్టేట్ రంగంలో సంస్థాగత పెట్టుబడుల ఈ పెరుగుదుకు శక్తిమంతమైన ఆర్థిక అభివృద్ధి, రాజకీయ స్థిరత్వం, ప్రభుత్వ విధానాల వల్ల ఏర్పడిన పారదర్శకత ముఖ్య కారణాలు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2007లో నమోదైన పాత రికార్డు ($8.4 బిలియన్)తో పోలిస్తే ఇది 6 శాతం అధికం. JLL నివేదిక ప్రకారం, 2023తో పోలిస్తే 2024లో పెట్టుబడులు 51 శాతం అధికమయ్యాయి. Real Estate లో విదేశీ పెట్టుబడిదారుల కీలక పాత్ర నివేదికల ప్రకారం మొత్తం సంస్థాగత పెట్టుబడుల్లో 63 శాతం విదేశీ పెట్టుబడిదారులవే. మిగతా 37 శాతం దేశీయ పెట్టుబడులుగ...
error: Content is protected !!