Maha Kumbh mela 2025: మహాకుంభమేళాకు వేళాయే.. ప్రయాగ్రాజ్లో ఆధ్యాత్మిక శోభ..
Maha Kumbh mela 2025 : మహా కుంభమేళా భారతీయ ఆధ్యాత్మికతకు ప్రతీక. ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే ఈ మహోత్సవానికి ఏర్పాట్లను సర్వం సిద్ధం చేస్తున్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు నిర్వహించే ఈ భక్తజన జాతర ప్రపంచంలోనే అతి పెద్దది. ఈసారి (2025) మహాకుంభమేళాలో 40-45 కోట్ల మంది పాల్గొంటారని అంచనా. ఇందుకు తగ్గట్టే ప్రభుత్వాలు అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తెస్తున్నాయి.
మోక్ష ప్రాప్తికి అరుదైన అవకాశం
గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో నిర్వహించే మహోత్సవం మహాకుంభమేళా. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో 45 రోజులపాటు జరిగే ఆధ్యాత్మిక ఉత్సవం ఇది. ప్రపంచంలోనే అతి పెద్ద పుణ్యకార్యాల క్షేత్రంగా మహాకుంభమేళా నిలుస్తుంది. ఇందులో పాల్గొనడంతో తమ జీవితం ధన్యమవుతుందని భావిస్తారు భక్తులు. పూర్వీకుల పాపాలను కడగకట్టేందుకు, మోక్షం పొందేందుకు అరుదైన అవకాశంగా ...




