Sarkar Live

National

BJP leader Annamalai | కొర‌డాతో కొట్టుకున్న బిజెపి నేత.. వీడియో వైర‌ల్‌
National

BJP leader Annamalai | కొర‌డాతో కొట్టుకున్న బిజెపి నేత.. వీడియో వైర‌ల్‌

BJP leader Annamalai : త‌మిళ‌నాడు బీజేపీ అధ్య‌క్షుడు కె.అన్నామ‌లై వినూత్న రీతిలో నిర‌స‌న తెలిపారు. అన్నా యూనివర్సిటీలో 19 సంవత్సరాల యువతిపై జరిగిన లైంగిక దాడిపై ఆందోళ‌న‌కు దిగిన ఆయ‌న త‌న‌ను తాను కొర‌డాతో కొట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కొన్నిరోజులుగా అన్నామ‌లై (BJP leader Annamalai) నిర‌స‌న‌లు తెలుపుతున్నారు. త‌మిళ‌నాడులో డీఎంకే (DMK) ప్ర‌భుత్వాన్ని తొలిగించే వ‌ర‌కు 48 రోజుల‌పాటు ఉప‌వాసం ఉంటాన‌ని, చెప్పులు ధ‌రించ‌న‌ని భీష్మించుకున్నారు. నిన్న బీజేపీ, అన్నాడిఎంకే (AIADMK) నేత‌లు నిర‌సన చేపట్ట‌గా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Annamalai : లైంగిక దాడిపై బీజేపీ నిర‌స‌న‌లు అన్నా యూనివర్సిటీ (Anna University) క్యాంపస్‌లో ఈనెల 23న ఓ విద్యార్థినిపై లైంగిక దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌ను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఓ యువ‌కుడితో ఆ యువ‌తి యూనివ‌ర్సిటీ క్యాంప్‌లో ఉండ‌గా ఇద్ద‌రు గుర్తు తెలియ‌ని ...
Sabarimala special trains శ‌బ‌రిమ‌ల ప్ర‌త్యేక‌ రైళ్లు ర‌ద్దు.. కారణమిదే.. !
National

Sabarimala special trains శ‌బ‌రిమ‌ల ప్ర‌త్యేక‌ రైళ్లు ర‌ద్దు.. కారణమిదే.. !

Indian Railways | అయ్య‌ప్ప మాల‌ధారుల కోసం శ‌బ‌రిమ‌ల‌కు నడిపిస్తున్న‌ ప్ర‌త్యేక రైళ్ల (Sabarimala special trains ) ను దక్షిణ మధ్య రైల్వే (SCR) ర‌ద్దు చేసింది. యాత్రికుల సంఖ్య‌ ర‌ద్దీ త‌గ్గ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకుంది. మొత్తం 14 ప్రత్యేక రైళ్లను రద్దు చేసింది. సాధారణంగా శ‌బరిమల యాత్రా సీజన్ డిసెంబర్ నుంచి జనవరి మధ్య ఉంటుంది. జనవరి 15 వరకు యాత్రికుల సంఖ్య ఎక్కువగా ఉంటూ క్ర‌మేణా తగ్గుతుంది. ఈ నేప‌థ్యంలో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) 120కు పైగా ప్రత్యేక రైళ్లను ప్లాన్ చేసింది. కానీ.. ఇప్పుడు యాత్రికుల సంఖ్య తగ్గడం కారణంగా జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 మధ్య రైళ్లను రద్దు చేసింది. శ‌రిమలకు రైల్వే స‌ర్వీసులు శ‌బరిమల అయ్యప్ప స్వామి దేవ‌స్థానికిఇ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. వీరి రవాణా సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను న‌డిపిస్తోంద...
Manmohan Singh | ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ప్రాణం పోసిన ‘డాక్ట‌ర్‌’
National

Manmohan Singh | ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ప్రాణం పోసిన ‘డాక్ట‌ర్‌’

Manmohan Singh : మ‌న్మోహ‌న్ సింగ్‌.. మృదు స్వ‌భావి. నోట్లో నాలుక ఉండ‌దన్న‌ట్టే క‌నిపించిన ఆయ‌న ఓ నిశ్శ‌బ్ద విప్ల‌వం. రెండు సార్లు ప్ర‌ధానిగా ప్రాతినిధ్యం వ‌హించిన మ‌న్మోహ‌న్ సింగ్ (Manmohan Singh) ఆర్థికవేత్త‌గా త‌న‌కున్న అనుభ‌వంతో అనేక సంస్క‌ర‌ణ‌ల‌ను తీసుకొచ్చారు. ఆర్థిక మాద్య‌మాన్ని గాడిలో పెట్టి దేశానికి కొత్త దిశ చూపారు. మ‌న్మోహ‌న్ సింగ్ (92) మృతి చెందార‌నే వార్త భార‌త్‌లోనే కాకుండా విదేశాల్లోనూ దిగ్భ్రాంతిని క‌లిగించింది. ఒక గొప్ప ఆర్థికవేత్త‌ను కోల్పోయామ‌నే విషాదఛాయ‌లు అలుముకున్నాయి. ఆర్థికరంగ‌ డాక్ట‌ర్.. Manmohan Singh ప్ర‌స్తుత‌ పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో 1932లో జ‌న్మించిన మన్మోహన్ సింగ్ ఉన్న‌త విద్యను అభ్య‌సించారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన‌ప్ప‌టికీ పంజాబ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తయ్యాక కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ పూర్తిచేశారు. అనంతరం ఆర్థిక శాస్త్రం...
AAP vs Congress | కాంగ్రెస్‌, ఆప్ మ‌ధ్య పోలిటిక‌ల్ వార్‌.. ఇండియా కూట‌మిలో క‌ల‌క‌లం
National

AAP vs Congress | కాంగ్రెస్‌, ఆప్ మ‌ధ్య పోలిటిక‌ల్ వార్‌.. ఇండియా కూట‌మిలో క‌ల‌క‌లం

AAP vs Congress | ఇండియా కూటమిలోని కాంగ్రెస్ (Congress), ఆమ్ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. రెండు పార్టీల మ‌ధ్య ఇప్ప‌టికే కోల్ఢ్‌వార్ ఉండ‌గా కాంగ్రెస్ నేత అజ‌య్ మాకెన్ చేసిన వ్యాఖ్య‌ల‌తో ఒక్క‌సారిగా అగ్గి రాజేశాయి. దీనిపై ఆమ్ ఆమ్మీ నేత‌లు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌ను కూటమి నుంచి తొలగించాలని INDIA భాగస్వామ్య పార్టీలను కోరుతామని ఆప్ నేతలు హెచ్చరించారు. రెండు పార్టీల మ‌ధ్య చోటుచేసకున్న ఈ రాజ‌కీయ‌ ప‌రిణామాలు హాట్‌టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ఇండియా కూట‌మిలో క‌ల‌కలం రేపుతున్నాయి. దుమారం రేపిన మాకెన్ వ్యాఖ్య‌లు ఆప్ ప్రభుత్వం, కేజ్రీవాల్‌పై ఢిల్లీ కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ (Ajay Maken) చేసిన వ్యాఖ్య‌లు ఇండియా కూట‌మికి త‌ల‌నొప్పిగా మారాయి. అవినీతి వ్య‌తిరేక ఉద్య‌మం పేరుతో అర‌వింద్ కేజ్రీవాల్ అధికారంలోకి వ‌చ్చార‌ని, జ‌న్ లోక్‌పాల్ ఏర్పాటు చేయ‌డంలో ఆ...
Chhattisgarh | శవంతో శృంగారం.. అత్యాచారం కాదు: ఛత్తీస్‌గఢ్ హైకోర్టు
National

Chhattisgarh | శవంతో శృంగారం.. అత్యాచారం కాదు: ఛత్తీస్‌గఢ్ హైకోర్టు

Chhattisgarh News | శవంతో శృంగారాన్ని అత్యాచారంగా భావించ‌లేమ‌ని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు (Chhattisgarh High Court) సంచ‌ల‌న‌ తీర్పు ఇచ్చింది. మైన‌ర్‌పై లైంగిదాడి, హ‌త్య‌కు సంబంధించిన కేసులో చీఫ్ జస్టిస్ రమేష్ సిన్హా, జస్టిస్ బిభు దత్త గురు నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. అత్యాచారంగా ప‌రిగ‌ణించ‌లేం.. మైన‌ర్‌పై హ‌త్యాచార‌ కేసులో నితిన్ యాదవ్, నీలకంఠ్ నాగేశ్ దోషులుగా తేలారు. వీరు బాలిక‌ను అపహరించడం, అత్యాచారం చేయడం, హత్య చేయడం వంటి నేరాలకు పాల్ప‌డ్డార‌ని నిర్ధార‌ణ అయ్యింది. నితిన్ యాదవ్ అత్యాచారం, కిడ్నాపింగ్, హత్య నేరాలకు దోషిగా తేలడంతో జీవిత ఖైదు శిక్ష ప‌డింది. నాగేశ్, అతడి సహచరుడికి IPC సెక్షన్ 201 (నేరానికి సంబంధించిన సాక్ష్యాలను తొలగించడం లేదా నిందితుడిని కాపాడేందుకు తప్పుడు సమాచారం ఇవ్వడం)తోపాటు మ‌రికొన్ని సెక్ష‌న్ల ఆధారంగా ఏడేళ్ల జైలుశిక్ష ప‌డింది. అదే కేసులో నాగే...
error: Content is protected !!