One Nation One Election | ఈ సేషన్లోనే ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’… శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు!
                    One Nation One Election : మోదీ ప్రభుత్వం మరో సంచలనాన్ని సృష్టించబోతోంది. 'వన్ నేషన్, వన్ ఎలక్షన్'కు కార్యరూపం దాల్చబోతుందని తెలుస్తోంది. ఒకే దేశం, ఒకే ఎన్నిక (One Nation One Election) అనే విధానంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష. దీన్ని అమల్లోకి తెచ్చేందుకు బీజేపీ ప్రభుత్వం అడుగులు మరింత ముందుకు వేసిందని తెలుస్తోంది. ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర సిద్ధమవుతోందని సమాచారం. ఈ అంశంపై రామ్నాథ్ కోవింద్ కమిటీ చేసిన సిఫార్సులను కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదించింది. పార్లమెంటులో ఈ బిల్లు పాసైతే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి.
మద్దతును కూడబెట్టుకునేందుకు..
వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లుకు మద్దతు పొందడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. జాయింట్ పార...                
                
             
								



