Sarkar Live

National

Om Prakash Chautala | ఓం ప్ర‌కాశ్ చౌతాలా క‌న్నుమూత‌
National

Om Prakash Chautala | ఓం ప్ర‌కాశ్ చౌతాలా క‌న్నుమూత‌

Om Prakash Chautala | హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్‌ద‌ళ్‌ (INLD) నేత ఓంప్రకాశ్ చౌతాలా (89) ఈ రోజు మ‌ధ్యాహ్నం కన్నుమూశారు. కొంతకాలంగా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయ‌న తుదిశ్వాస విడిచారు. గురుగ్రాంలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో 12 గంట‌ల‌కు చౌతాలా క‌న్నుమూశార‌ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు వెల్ల‌డించారు. మాజీ ఉప ప్ర‌ధాని దేవీలాల్ కుమారుడైన ఓం ప్ర‌కాశ్ హ‌ర్యానా సీఎంగా ఐదుసార్లు ప్రాతిధ్యం వ‌హించారు. ఆరోగ్యం క్షీణించి.. ఓంప్ర‌కాశ్ చౌతాలా (Om Prakash Chautala) మూడు నాలుగేళ్లుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఈరోజు ఉదయం చౌతాలా ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింద‌ని, దీంతో 11:35 గంటలకు ఆస్ప‌త్రిలో చేర్చామ‌ని, ప‌రీక్షించిన వైద్యులు అప్ప‌టికే ఆయ‌న మృతి చెందిన‌ట్టు నిర్ధారించార‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఆయ‌న అంత్య‌క్రియ‌లు రేపు (శ‌నివారం) సిర్సా ...
Parliament erupts | పార్లమెంట్ ప్రాంగణంలో హైడ్రామా .. ఎన్డీఏ, విపక్షాలు మధ్య రగడ
National

Parliament erupts | పార్లమెంట్ ప్రాంగణంలో హైడ్రామా .. ఎన్డీఏ, విపక్షాలు మధ్య రగడ

Parliament erupts | విపక్షాలు (INDIA), ఎన్డీఏ (NDA) ఎంపీల మధ్య పార్లమెంట్ ప్రాంగణంలో ఈ రోజు ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. తోపులాట, పెనుగులాటల‌తో ఉద్రిక్త‌ వాతావ‌ర‌ణం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి గాయపడ్డారు. దీంతో ఆయ‌న్ను ఆ పార్టీ నేత‌లు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. సారంగిని రాహుల్ గాంధీ (Rahul Gandhi) తోసేసార‌ని, దీంతో ఆయన కింద‌పడిపోయి గాయ‌ప‌డ్డార‌ని బీజేపీ ఆరోపిస్తోంది. ఆరోప‌ణలు.. ప్ర‌త్యారోప‌ణ‌లు అంబేడ్కర్ అంశంపై పార్ల‌మెంటు సాక్షిగా నిరసనలు జ‌రుగుతున్నాయి. అంబేద్క‌ర్‌ను హోంమంత్రి అమిత్ షా అవమానించార‌ని విపక్షాలు ఆరోపిస్తూ పార్ల‌మెంట్ లోప‌ల‌, వెలుప‌ల నిర‌స‌న‌లు చేప‌డుతున్నాయి. ఇదే క్ర‌మంలోనే ఈ రోజు సేష‌న్ ప్రారంభానికి ముందుకు పార్ల‌మెంటు ప్రాంగ‌ణంలో ప్ర‌తిప‌క్షాలు, బీజేపీ ఎంపీల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. తోపులాట‌లు, పెనుగులాట‌ల‌తో ఆ ప్రాంగ‌ణం హోరెత్తింది. తాను పార్లమెంట్ హౌస్‌లో ...
Real Estate | భారతదేశంలో రికార్డు స్థాయి పెట్టుబడులు
National

Real Estate | భారతదేశంలో రికార్డు స్థాయి పెట్టుబడులు

Real Estate in India : భారతదేశంలో ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగంలో సంస్థాగత పెట్టుబడులు కొత్త రికార్డును సృష్టించాయి. 2023తో పోలిస్తే 51 శాతం అధికంగా ఉండగా, మొత్తం పెట్టుబడులు $8.9 బిలియన్‌కు చేరినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ పెట్టుబడుల్లో విదేశీ పెట్టుబడిదారుల భాగస్వామ్యం 63 శాతంగా ఉండటం విశేషం. రియల్ ఎస్టేట్ రంగంలో సంస్థాగత పెట్టుబడుల ఈ పెరుగుదుకు శక్తిమంతమైన ఆర్థిక అభివృద్ధి, రాజకీయ స్థిరత్వం, ప్రభుత్వ విధానాల వల్ల ఏర్పడిన పారదర్శకత ముఖ్య కారణాలు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2007లో నమోదైన పాత రికార్డు ($8.4 బిలియన్)తో పోలిస్తే ఇది 6 శాతం అధికం. JLL నివేదిక ప్రకారం, 2023తో పోలిస్తే 2024లో పెట్టుబడులు 51 శాతం అధికమయ్యాయి. Real Estate లో విదేశీ పెట్టుబడిదారుల కీలక పాత్ర నివేదికల ప్రకారం మొత్తం సంస్థాగత పెట్టుబడుల్లో 63 శాతం విదేశీ పెట్టుబడిదారులవే. మిగతా 37 శాతం దేశీయ పెట్టుబడులుగ...
Amit Shah | అమిత్‌షా వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ నిర‌స‌న
National

Amit Shah | అమిత్‌షా వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ నిర‌స‌న

Amit Shah : రాజ్యాంగంపై రాజ్యసభలో కాంగ్రెస్‌, బీజేపీ మ‌ధ్య జ‌రిగిన వాగ్వాదం తీవ్ర వివాదానికి దారి తీసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా త‌న ప్ర‌సంగంలో అంబేద్క‌ర్‌ (Ambedkar)పై చేసిన వ్య‌ఖ్య‌ల‌పై ప్ర‌తిప‌క్ష‌ కాంగ్రెస్, దాని స‌హ‌చ‌ర పార్టీల ఎంపీలు త‌ప్పుప‌ట్టారు. రాజ్యాంగ నిర్మాతపై అమిత్‌షా అనుచితంగా మాట్లాడార‌ని, దీన్ని ఖండిస్తున్నామ‌ని అన్నారు. ఈ వ్యాఖ్యలు అంబేద్కర్‌ను అవమానించడమేనని కాంగ్రెసు ఆరోపించింది. దీనిపై ఆయ‌న క్ష‌మాప‌ణ చెప్పాల‌ని, త‌న ప‌దవికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అమిత్‌షా చేసిన వ్యాఖ్య‌లు ఏమిటంటే.. రాజ్యాంగంపై రాజ్యసభ (Rajya sabha) లో చ‌ర్చ వాడీవేడిగా సాగుతోంది. ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌వారం సేష‌న్‌లో కాంగ్రెస్‌పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్‌ ఒక కుటుంబ ప్రైవేట్ ఆస్తిగా భావించి, పార్లమెంట్‌ను మోసం చేస్తోంద‌ని వ్యాఖ్యాన...
JNU | జేఎన్‌యూలో మ‌రోసారి వివాదం
National

JNU | జేఎన్‌యూలో మ‌రోసారి వివాదం

Jawaharlal Nehru University : జ‌వహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో మ‌రోసారి వివాదం చెల‌రేగింది. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీపై తీసిన నిషేధిత BBC డాక్యుమెంటరీని ఇక్క‌డ ప్ర‌ద‌ర్శించ‌డం క‌ల‌క‌లం రేపింది. కొంత మంది విద్యార్థులు దీన్ని ప్ర‌ద‌ర్శించ‌గా విశ్వవిద్యాలయ పరిపాలన విభాగం అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డం, డాక్యుమెంట‌రీని ఆప‌కుంటే కఠిన చర్యలకు వెన‌కాడ‌బోమ‌ని హోచ్చ‌రిక‌లు జారీ చేయ‌డం, దీన్ని ఆ విద్యార్థులు ధిక్క‌రించ‌డం ఉద్రిక్తంగా మారింది. ప్రాజెక్ట‌ర్‌ను అనుమ‌తించ‌కపోవ‌డంతో... వామపక్ష అనుకూల అఖిల భారత విద్యార్థుల సమాఖ్య (AISF) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రదర్శన మొదట ప్రొజెక్టర్ ద్వారా చేయాలని భావించారు. అయితే.. భద్రతా సిబ్బంది ప్రొజెక్టర్‌ను అనుమ‌తించ‌లేదు. దీంతో విద్యార్థులు యూనివ‌ర్సిటీ క్యాంప‌స్‌లోని గంగా ధాబాలో ల్యాప్‌టాప్ ద్వారా డాక్యుమెంటరీని ప్రదర్శించారు. JNU పరిపాలన విభాగం సీరియ‌స్...
error: Content is protected !!