Sarkar Live

National

Farmers Protest Updates | నేడు రైతుల పాదయాత్ర..  ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్..
National

Farmers Protest Updates | నేడు రైతుల పాదయాత్ర.. ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్..

Farmers Protest Updates :  రైతులు చేపట్టిన ఢిల్లీ చలో మార్చ్ నేపథ్యంలో నగర సరిహద్దుల వద్ద ప్రభుత్వం బారీ భద్రతను పెంచింది. తమ డిమాండ్ల కోసం రైతులు నేటి మధ్యాహ్నం 1:00 గంటలకు శంభు సరిహద్దు నుండి ఢిల్లీ వైపు పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.. న్యూఢిల్లీ: తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ రైతుల నిరసనలు నేటికీ కొనసాగుతున్నాయి, అలాగే రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ ప్రకారం, 101 మంది రైతులతో కూడిన 'జాతా' ఈ రోజు మధ్యాహ్నం 1:00 గంటలకు శంభు సరిహద్దు నుంచి దేశ రాజధాని వైపు కదులుతుంది. . ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా అవసరమైన ప్రదేశాల్లో భద్రతను పెంచారు. 101 మంది రైతులతో 'మర్జీవ్దా జాతా' పేరుతో పాదయాత్ర శుక్రవారం మధ్యాహ్నం 1 గంటలకు శంభు సరిహద్దు నిరసన ప్రదేశం నుంచి ఢిల్లీకి మార్చ్‌గా బయలుదేరుతుందని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. విలేకరుల సమావేశంలో రైతు నాయకుడు సర్వన్ సింగ్ ...
Devendra Fadnavis | మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్.. రేపే ఏకగ్రీవ ఎన్నిక
National

Devendra Fadnavis | మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్.. రేపే ఏకగ్రీవ ఎన్నిక

Devendra Fadnavis | మహారాష్ట్రలో ముఖ్యమంత్రి విషయంలో కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు 12 రోజుల తర్వాత తెర‌ప‌డింది. ముంబైలో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం డిసెంబర్ 5న ఆయన మూడోసారి మహారాష్ట్ర సీఎం కానున్నారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, ఫడ్నవీస్ పాల్గొన్నారు. మహారాష్ట్ర లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా నిర్మ‌లా సీతారామన్, రూపానీని బిజెపి నియమించిన విష‌యం తెలిసిందే.. అయితే శాసనసభా పక్ష సమావేశానికి ముందు, బిజెపి నేత‌ సుధీర్ ముంగంటివార్ మాట్లాడుతూ, మహాయుతి మిత్రపక్షాలు బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలుస్తాయ‌ని, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై చ‌ర్చిస్తామ‌ని తెలిపారు. మహారాష్ట్రలో నవంబర్ 20 న జ...
Eknath Shinde | ఏక్ నాథ్ షిండేకు డిప్యూటీ సీఎం ప‌ద‌వి?
National

Eknath Shinde | ఏక్ నాథ్ షిండేకు డిప్యూటీ సీఎం ప‌ద‌వి?

Eknath Shinde | మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీసే ఖాయంగా తెలిసింది. ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్‌నాథ్‌ షిండే (Eknath Shinde).. డిప్యూటీ సీఎంగా (Deputy Chief Minister) బాధ్యతలు చేపట్టబోతున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. మ‌హారాష్ట్ర‌లో డిసెంబర్ 5న కొత్త సీఎం ప్ర‌మాణ స్వీకారం చేయనున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, కేబినెట్‌ కూర్పు ఇంకా పూర్తి కాని కారణంగా.. ఆ రోజు సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు మాత్రమే ప్రమాణం చేస్తారని సదరు వర్గాలు తెలిపాయి. ముఖ్య‌మంత్రిగా ఫడ్నవీస్‌, డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్‌ షిండే, అజిత్‌ పవార్‌లు ప్రమాణ స్వీకారం చేయ‌నున్నార‌ని జాతీయ మీడియా పేర్కొంటోంది. ఇదిలా ఉండ‌గా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి (Mahayuti) రికార్డు స్థాయిలో సీట్ల‌నుగెలుచుకొని భారీ విజ‌యాన్ని కైవ‌సం చే...
Bullet Train | భారత దేశపు మొట్ట మొదటి బులెట్ రైలు ఫీచర్లు, సౌకర్యాలు ఇవే..
National

Bullet Train | భారత దేశపు మొట్ట మొదటి బులెట్ రైలు ఫీచర్లు, సౌకర్యాలు ఇవే..

Bullet Train | భారతదేశంలో మొట్టమొదటి బులెట్ ట్రైన్ పరుగులుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య ఈ హై-స్పీడ్ రైలు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభూతిని అందించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసిన ఈ స్టేషన్లులో ప్రయాణీకులకు హైటెక్ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. ముంబై - అహ్మదాబాద్ కారిడార్‌లో 12 స్టేషన్లు ఉంటాయి: ముంబై థానే విరార్ బోయిసర్ వాపి బిలిమోరా సూరత్ బరూచ్ వడోదర ఆనంద్ అహ్మదాబాద్ సబర్మతి బులెట్ ట్రైన్ స్టేషన్లలో వెయిటింగ్ ఏరియాలలో విశాల‌మైన సీటింగ్, సులభంగా స్పష్టంగా క‌నిపించే సైన్ బోర్డులు ఉంటాయి. అధిక నాణ్యత గల విశ్రాంతి గదులు, పిల్లల కోసం నర్సరీలు, సామాను లాకర్లు ప్రయాణీకుల అవసరాలను తీరుస్తాయి. ఫస్ట్-క్లాస్ ప్రయాణికులు బిజినెస్‌ లాంజ్‌లకు యాక్సెస్‌ను కలిగి ఉంటారు, ప్రయాణంలో విశ్రాంతిని పొంద‌వ‌చ్చు. స్టేషన్‌లలో వీల్‌...
Fengal Cyclone Alert | ఫెంగల్ తుఫాను ముప్పు.. పాఠ‌శాల‌ల‌కు సెల‌వు..
National

Fengal Cyclone Alert | ఫెంగల్ తుఫాను ముప్పు.. పాఠ‌శాల‌ల‌కు సెల‌వు..

Fengal Cyclone Alert | నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం తుఫానుగా మార‌నుంద‌ని వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. దీంతో మరో సైక్లోనిక్ ఫెంగల్ తుఫాను దేశాన్ని తాకబోతోంది. ఇది ఉత్తర-వాయవ్య దిశగా వస్తూ.. తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదులుతోందని తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో కోస్తా రాష్ట్రాల్లో ఈ రోజు ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని ప్రకటించింది. ఈదురు గాలులతో కూడా అతి భారీ వర్షాల పడతాయని వెల్లడించింది. తుపాను నేపథ్యంలో ఈరోజు తమిళనాడులో పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని డిఎంకే ప్రభుత్వం ఆదేశించింది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా చెన్నై ప్రాంతీయ మెట్రోలాజికల్ సెంటర్ (RMC) హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచుతో పాటు చలి కూడా పెరగవచ్చ...
error: Content is protected !!