Lok Sabha | తీవ్రమైన నేరారోపణలపై అరెస్టయిన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులను తొలగించేందుకు రంగం సిద్ధం?
లోక్సభ (Lok Sabha) లో బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
న్యూఢిల్లీ: పాలనలో జవాబుదారీతనాన్ని పెంచే దిశగా కేంద్రం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తీవ్రమైన నేరారోపణలపై అరెస్టు అయిన లేదా జైలుకు వెళ్లిన ఏ ప్రధానమంత్రి (PM) అయినా, కేంద్ర మంత్రి లేదా సహాయ మంత్రి (MoS) ను పదవి నుంచి తొలగించేందుకు లోక్సభలో ఒక బిల్లును ప్రవేశపెట్టున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.
30 రోజులు పాటు జైలుకెళితే.. వెంటనే తొలగింపు
కనీసం ఐదేళ్లు జైలు శిక్ష విధించదగిన నేరాలలకు పాల్పడి అరెస్టు అయి వరుసగా 30 రోజులు నిర్బంధించబడిన ఏ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రి అయినా 31వ రోజున తమ పదవులను కోల్పోనున్నారు. దీని ద్వారా ఉన్నత స్థాయి ప్రభుత్వ పాలకులను జవాబుదారీగా ఉంచేలా ఈ బిల్లు రూపొందించబడింది. అయితే, చట్టపరమైన ప్రక్రియకు లోబడి, అటువంటి అధికారులు కస్టడీ నుంచి విడుదలైన తర్వాత వారిని తిరిగి ...




