Toll charges | ప్రయాణికులకు శుభవార్త: వంతెనలు, సొరంగాలు, ఎలివేటెడ్ రోడ్లపై కేంద్రం సంచలన నిర్ణయం
                    టోల్ ఛార్జీలు (Toll charges)  50% తగ్గింపు 
New Delhi : జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సొరంగాలు, వంతెనలు, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ హైవేలు వంటి నిర్మాణాలు ఉన్న రహదారి సెక్షన్లపై టోల్ ఛార్జీలను 50 శాతం వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న ఈ చర్యతో వాహదారుల ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గిపోనున్నాయి. 
ఫ్లైఓవర్లు లేదా ఎలివేటెడ్ రోడ్లు, సొరంగాలు, వంతెనలు వంటి నిర్మాణాలు కలిగిన జాతీయ రహదారుల్లో  ప్రభుత్వం టోల్ రేట్లను 50 శాతం వరకు తగ్గించింది. జాతీయ రహదారి రుసుము నియమాలు, 2008 ప్రకారం జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద వినియోగదారు రుసుములు వసూలు చేస్తున్నవిషయం తెలిసిందే.. 
2008లో అమలులోకి వచ్చిన నేషనల్ హైవే టోల్ నియమాలను సవరించిన మంత్రిత్వ శాఖ, కొత్త లెక్కింపు పద్ధతిని తాజా నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఇందులో పేర్...                
                
             
								



