Sarkar Live

National

Lok Sabha | తీవ్రమైన నేరారోపణలపై అరెస్టయిన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులను తొలగించేందుకు రంగం సిద్ధం?
National

Lok Sabha | తీవ్రమైన నేరారోపణలపై అరెస్టయిన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులను తొలగించేందుకు రంగం సిద్ధం?

లోక్‌సభ (Lok Sabha) లో బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం న్యూఢిల్లీ: పాలనలో జవాబుదారీతనాన్ని పెంచే దిశగా కేంద్రం కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగా తీవ్రమైన నేరారోపణలపై అరెస్టు అయిన లేదా జైలుకు వెళ్లిన ఏ ప్రధానమంత్రి (PM) అయినా, కేంద్ర మంత్రి లేదా సహాయ మంత్రి (MoS) ను ప‌ద‌వి నుంచి తొలగించేందుకు లోక్‌సభలో ఒక బిల్లును ప్రవేశపెట్టున్న‌ట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. 30 రోజులు పాటు జైలుకెళితే.. వెంటనే తొలగింపు కనీసం ఐదేళ్లు జైలు శిక్ష విధించదగిన నేరాలల‌కు పాల్ప‌డి అరెస్టు అయి వరుసగా 30 రోజులు నిర్బంధించబడిన ఏ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రి అయినా 31వ రోజున తమ పదవులను కోల్పోనున్నారు. దీని ద్వారా ఉన్నత స్థాయి ప్రభుత్వ పాల‌కుల‌ను జవాబుదారీగా ఉంచేలా ఈ బిల్లు రూపొందించబడింది. అయితే, చట్టపరమైన ప్రక్రియకు లోబడి, అటువంటి అధికారులు కస్టడీ నుంచి విడుదలైన తర్వాత వారిని తిరిగి ...
Floods :  వరదల్లో కారుతో సహా కొట్టుకుపోయిన ఫ్యామిలీ
National

Floods : వరదల్లో కారుతో సహా కొట్టుకుపోయిన ఫ్యామిలీ

మహారాష్ట్రలోని ఉద్గిర్ సమీపంలో వరద (Floods) ల్లో తెలంగాణకు చెందిన ఫ్యామిలీ గల్లంతయింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కారుతో సహా వరద నీటిలో కొట్టుకుపోవడం కలకలం రేపింది. మేం వరదల్లో కొట్టుకుపోతున్నాం, పిల్లలూ జాగ్రత్త అంటూ చివరి ఫోన్ కాల్ వచ్చిందని.. ఆ తర్వాత స్విచ్ఛాప్ వచ్చిందని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నలుగురు ఆచూకీ వెంటనే గుర్తించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్ కు చెందిన ఐదుగురితో పాటు మహారాష్ట్రకు చెందిన కారు డ్రైవర్ వాహనాన్ని నడుపుతుండగా ఆగస్ట్ 17న అర్ధరాత్రి మహారాష్ట్రలోని వరద నీటిలో కొట్టుకుపోయింది. మహారాష్ట్రలోని ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఉద్గిర్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాగా, గల్లంతైన వారిలో అఫ్రీనా, హసీనా, సమీనా, ఆఫ్రీన్, సోహెబ్ అనే యువకుడు, మహారాష్ట్ర కు చెందిన కారు డ్రైవ...
ECI |  నిషేధిత జాబితాలో మరిన్ని పార్టీలు.. తెలంగాణ నుంచి 9 పార్టీలు
National

ECI | నిషేధిత జాబితాలో మరిన్ని పార్టీలు.. తెలంగాణ నుంచి 9 పార్టీలు

- రెండోదశలో 476 పార్టీలను గుర్తించిన ఈసీ న్యూదిల్లీ :  ‌చట్టబద్ధత, నిబంధనలు పాటించని రాజకీయ పార్టీలపై ఈసీ (ECI) కఠిన చర్యలకు ఉపక్రమించింది. దేశవ్యాప్తంగా మరో 476 పార్టీలను రద్దు చేసే దిశగా చర్యలను మొదలు పెట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇటీవల 334 పార్టీలను రద్దు చేసిన ఈసీఐ.. తాజాగా రెండో రౌండ్‌లో మరో 476 పార్టీలను గుర్తించి.. వాటిపై వేటు వేసేందుకు ప్రక్రియను మొదలుపెట్టింది. ఈసీ గుర్తించిన పార్టీల జాబితాలో ఏపీ నుంచి 17 పార్టీలు ఉండగా.. తెలంగాణ నుంచి 9 పార్టీలు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల వ్యవస్థను పటిష్టం చేసేందుకు చేపట్టిన సమగ్రమైన వ్యూహాల్లో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 2019 నుంచి ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయని రాజకీయ పార్టీలను గుర్తించి, జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడిం...
IMD Alert | వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు – దేశవ్యాప్తంగా వాతావరణ శాఖ అలర్ట్
National

IMD Alert | వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు – దేశవ్యాప్తంగా వాతావరణ శాఖ అలర్ట్

ప‌లు రాష్ట్రాల‌కు రెడ్ ఆరెంజ్ అల‌ర్ట్‌ IMD Alert | దేశవ్యాప్తంగా వాతావరణంలో ఒక్క‌సారిగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ దేశంలోని పలు రాష్టాల్రకు రెడ్‌, ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ (IMD Alert) చేసింది. తెలంగాణతోపాటు దిల్లీ, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ఝార్ఖండ్‌, హర్యానా, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న‌ మూడు నుంచి ఏడు రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈనేప‌థ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్ర‌యాణాలు చేయొద్దని ఐఎండీ అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. దిల్లీ ప్రాంతంలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ. ఇక్కడ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఆగస్టు 13, 14 తేదీల్లో వర్షం కారణంగా వాతావ‌ర‌ణం చల్లగా ఉంటుంది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌, లక్నో, గోరఖ్‌పూర్‌, వారణాసి, మీరట్‌ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది...
నేడు 3 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ ప్రారంభం – Vande Bharat Metro
National

నేడు 3 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ ప్రారంభం – Vande Bharat Metro

Vande Bharat Metro | బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈరోజు (ఆగస్టు 10)న కర్ణాటకలో పర్యటించ‌నున్నారు. ఉదయం 11 గంటలకు బెంగళూరులోని కెఎస్ఆర్ రైల్వే స్టేషన్‌లో 3 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు. దీని తర్వాత, ఆయన బెంగళూరు మెట్రో ఎల్లో లైన్‌ (Bengaluru Metro Yellow Line)ను ప్రారంభించి, ఆర్‌వి రోడ్ (రాగిగుడ్డ) నుంచి ఎలక్ట్రానిక్ సిటీ మెట్రో స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించనున్నారు. తన కర్ణాటక పర్యటన గురించి, ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X'లో పోస్ట్ చేసి, ఆగస్టు 10న బెంగళూరు ప్రజలను క‌లుసుకోవ‌డానికి ఆస‌క్తిగా ఉంద‌ని చెప్పారు. కెఎస్ఆర్ రైల్వే స్టేషన్ నుంచి 3 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తామ‌న్నారు. ఇది కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. బెంగళూరు పట్టణ మౌలిక సదుపాయాలను పెంచడానికి బెంగళూరు మెట్రో ఎల్లో లైన్‌ను ప్రారంభ...
error: Content is protected !!