Sarkar Live

National

బెంగ‌ళూరును ముంచెత్తుతున్న వ‌ర్షాలు.. మ‌గ్గురు మృతి.. Bengaluru Rains
National

బెంగ‌ళూరును ముంచెత్తుతున్న వ‌ర్షాలు.. మ‌గ్గురు మృతి.. Bengaluru Rains

Bengaluru Rains : వ‌రుస వ‌ర్షాల‌తో బెంగళూరుతో స‌హా కర్ణాటకలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఈ భారీ వర్షాలకు ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. భారత వాతావరణ శాఖ (IMD) శుక్రవారం వరకు బెంగళూరుకు 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది, భారీ వర్షాలు నగరంలోని అనేక ప్రాంతాల్లో వరదలకు కారణమవుతున్నాయి. ఆదివారం రాత్రి కురిసిన వర్షాలకు విస్తృతంగా నీరు నిలిచిపోవడంతో ప్ర‌జ‌ల‌ రోజువారీ జ‌న జీవ‌నం అస్తవ్యస్తమైంది. కర్ణాటక అంతటా అనేక ప్రాంతాలు భారీ వర్షాల కారణంగా ప్రభావితమయ్యాయి, దీని ఫలితంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అనేక ర‌హ‌దారుల్లో మోకాళ్ల‌లోతు వ‌ర‌ద‌ నీరు నిలిచిపోయింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. Bengaluru Rains నగర జీవితాన్ని అస్తవ్యస్తం గ‌త ఆదివారం రాత్రి బెంగళూరులో ఆరు గంటలకు పైగా నిరంతరంగా వర్షపాతం (Bengalur...
ప‌లు దేశాల్లో కోవిడ్-19 కేసుల క‌ల‌క‌లం.. – Covid 19 Cases In India
National

ప‌లు దేశాల్లో కోవిడ్-19 కేసుల క‌ల‌క‌లం.. – Covid 19 Cases In India

Covid 19 Cases In India : గత కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్‌లలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, భారత ఆరోగ్య అధికారులు నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామని, దేశంలో ప్రస్తుత కరోనావైరస్ పరిస్థితి అదుపులో ఉందని పేర్కొన్నారు. ఈ కేసులు చాలావరకు తేలికపాటివేనని, అసాధారణ తీవ్రత లేదా మరణాలతో సంబంధం కలిగి లేవని అధికారిక వర్గాలు తెలిపాయి. కొవిడ్-19 కి సంబంధించిన ఈ పరిణామాల నేపథ్యంలో, ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. దీని ప్రకారం భారతదేశంలో ఈ వ్యాధి పరిస్థితి నియంత్రణలోనే ఉందని తేల్చారు. "భారతదేశంలో ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితి నియంత్రణలోనే ఉందని సమావేశం తేల్చింది. మే 19, 2025 నాటికి, భారతదేశంలో యాక్టివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 257గా ఉంది. ఇది దేశంలోని పెద్ద జనాభాను పరిగణనలోకి తీసుకుంటే చాలా తక్కువ. ఈ కేసులన్నీ దాదాపుగా తేలికపాటివేన‌ని తెలుస్తోంది. ఈ సమావేశానికి డైరెక్టర్ జనరల్ ...
రైల్వే కొత్త నియమాలను మీరు గమనించారా? -Indian Railway Rules – 2025
National, Trending

రైల్వే కొత్త నియమాలను మీరు గమనించారా? -Indian Railway Rules – 2025

Indian Railway Rules | మనం రైలులో ప్ర‌తిసారి మన టికెట్‌పై రాసిన కోచ్, సీటు నంబర్‌ ప్ర‌కార‌మే కూర్చుని ప్ర‌యాణిస్తాం కాదా.. అయితే, కొంతమంది వెయిటింగ్ టిక్కెట్లతో ఏసీ, స్లీపర్ కోచ్‌లలో య‌థేచ్ఛ‌గా ద‌ర్జాగా ప్ర‌యాణిస్తుంటారు. కానీ ఇప్పటి నుంచి మీరు ఇలా చేయకపోవడమే మంచిది, ఎందుకంటే భారతీయ రైల్వే కొత్త నిబంధనను తీసుకువ‌చ్చింది. దీని ప్రకారం మీరు వెయిటింగ్ టికెట్‌తో AC లేదా స్లీపర్ కోచ్‌లలో ప్రయాణిస్తున్నట్లు దొరికితే, TTE మీకు భారీ జరిమానా విధించవచ్చు. అవును, మీరు ఇకపై వెయిటింగ్ టికెట్‌తో స్లీపర్, AC కోచ్‌లలో ప్రయాణించలేరు. మీరు రైలులో ప్రయాణించబోతున్నట్లయితే, ఈ కొత్త నియమాన్ని తప్పకుండా పరిశీలించండి, బహుశా ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. కొత్త‌ నిబంధనలు ఒకే PNR (ట్రావెల్ బుకింగ్ నంబర్) పై సమూహంగా ప్రయాణిస్తున్న వారిని, కొంతమంది కన్ ఫార్మ్ టికెట్‌, మరికొందరు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారిని ప...
Operation Keller | సింధూర్ తర్వాత ఆపరేషన్ కెల్లర్ ను ప్రారంభించిన భారత ఆర్మీ
National

Operation Keller | సింధూర్ తర్వాత ఆపరేషన్ కెల్లర్ ను ప్రారంభించిన భారత ఆర్మీ

Operation Keller | కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలోని కెల్లర్ దట్టమైన అటవీ ప్రాంతంలో మంగళవారం, మే 13, 2025న భారత సైన్యం (Indian Armed Forces) ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను అంతమొందించింది. షూకల్ కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులకు సంబంధించిన పక్కా సమాచారం రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ కు అందింది. దీంతో వెంటనే 'ఆపరేషన్ కెల్లర్'గా కోడ్ నేమ్ తో సైనిక చర్యను ప్రారంభించిది. సోషల్ మీడియా ప్లాట్ ఫాం X లో పోస్ట్ చేయబడిన అధికారిక ఆర్మీ ప్రకటన ప్రకారం, “ఆపరేషన్ కెల్లర్ (Operation Keller) . మే 13, 2025న, #షోపియన్‌లోని షూకల్ కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు రాష్ట్రీయ రైఫిల్స్ (Rashtriya Rifles) యూనిట్ ఇచ్చిన నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా, #ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఆపరేషన్ సమయంలో, ఉగ్రవాదులు భారీ కాల్పులు జరిపారు. దీని ఫలితంగా ముగ్గురు కరడుగట్టిన ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ కొనసా...
PM Modi | పిచ్చి వేషాలు వేస్తే నామరూపాల్లేకుండా చేస్తాం..
National

PM Modi | పిచ్చి వేషాలు వేస్తే నామరూపాల్లేకుండా చేస్తాం..

పాకిస్తాన్‌తో చ‌ర్చ‌లు అంటే పీవోకే, ఉగ్ర‌వాదంపైనే PM Modi | పాకిస్తాన్‌ ‌కాచుకో.. ఇకపై ఎలాంటి పిచ్చి వేషాలు వేసినా నామరూపాల్లేకుండా చేస్తామని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఆపరేషన్‌ ‌సింధూర్‌ను తాత్కాలికంగానే పక్కన పెట్టామని, ఇంకా పూర్తిగా ఆపేయలేదని, ఎలాంటి టెర్రర్‌ అటాక్‌ ‌జరిగినా ఇక దానిని యుద్ధంగానే పరిగణిస్తామని ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌ద్వారా పాక్‌ ‌భూభాగంలో టెర్రరిస్ట్ ‌క్యాంపులను ధ్వంసం చేశామని ప్రకటించారు. అలాగే మన సత్తా ఏమిటో ప్రపంచానికి, ముఖ్యంగా పాకిస్థాన్‌కు చాటాని తెలిపారు. ఈ క్రమంలో భారత సైనిక దళాలకు పీఎం మోదీ సెల్యూట్‌ ‌చేశారు. పాక్‌తో చర్చలంటూ జరిగితే… టెర్రరిజం, ఆక్రమిత కాశ్మీర్‌పైనే ఉంటుందని మరోమారు స్పష్టం చేశారు. ఇందులో మూడో వ్యక్తి జోక్యాన్ని కూడా సహించబోమని తేల్చి చెప్పారు. ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌తర్వాత ప్రధాని మోదీ (PM Modi ) సో...
error: Content is protected !!