బెంగళూరును ముంచెత్తుతున్న వర్షాలు.. మగ్గురు మృతి.. Bengaluru Rains
Bengaluru Rains : వరుస వర్షాలతో బెంగళూరుతో సహా కర్ణాటకలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఈ భారీ వర్షాలకు ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. భారత వాతావరణ శాఖ (IMD) శుక్రవారం వరకు బెంగళూరుకు 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది, భారీ వర్షాలు నగరంలోని అనేక ప్రాంతాల్లో వరదలకు కారణమవుతున్నాయి. ఆదివారం రాత్రి కురిసిన వర్షాలకు విస్తృతంగా నీరు నిలిచిపోవడంతో ప్రజల రోజువారీ జన జీవనం అస్తవ్యస్తమైంది.
కర్ణాటక అంతటా అనేక ప్రాంతాలు భారీ వర్షాల కారణంగా ప్రభావితమయ్యాయి, దీని ఫలితంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అనేక రహదారుల్లో మోకాళ్లలోతు వరద నీరు నిలిచిపోయింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Bengaluru Rains నగర జీవితాన్ని అస్తవ్యస్తం
గత ఆదివారం రాత్రి బెంగళూరులో ఆరు గంటలకు పైగా నిరంతరంగా వర్షపాతం (Bengalur...