Sarkar Live

National

వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్: ₹3,000తో వార్షిక ఫాస్ట్‌ట్యాగ్ పాస్ – Fastag Annual Pass
National

వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్: ₹3,000తో వార్షిక ఫాస్ట్‌ట్యాగ్ పాస్ – Fastag Annual Pass

ప్రైవేట్ వాహనాలకు (కార్లు, జీపులు, వ్యాన్లు వంటివి) కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. వాహ‌దారుల కోసం ఫాస్ట్ ట్యాగ్ ఆధారిత వార్షిక పాస్‌ (Fastag Annual Pass) ను ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. ₹3,000 ధర గల ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత వార్షిక పాస్‌ను 2025 ఆగస్టు 15 నుంచి ప్రవేశపెడుతున్నారు. ఈ పాస్ యాక్టివేషన్ తేదీ నుంచి ఒక సంవత్సరం లేదా 200 ప్రయాణాల వరకు చెల్లుబాటవుతుంది. ఏది ముందు అయితే అది. ఈ పాస్ ప్రత్యేకంగా వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాల (కార్లు, జీపులు, వ్యాన్లు మొదలైనవి) కోసం మాత్రమే రూపొందించారు. ఈ పాస్‌ దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై సజావుగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. Fastag Annual Pass ఎలా పొందాలి? వార్షిక పాస్ యాక్టివేషన్/పునరుద్ధరణ కోసం ప్రత్యేక లింక్ త్వరలో హైవే ట్రావెల్ యాప్, NHAI/MoRTH వెబ్‌సైట్‌లలో అందుబాటులోకి వొస్తుంది, ఈ విధానం 60 ...
Corruption | స‌ర్జ‌రీలు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ప్ర‌భుత్వ వైద్యుడు..
Crime, National

Corruption | స‌ర్జ‌రీలు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ప్ర‌భుత్వ వైద్యుడు..

Karnataka - Chikkaballapura | కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లాలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక సర్జన్ (Government Doctor) శస్త్రచికిత్స కోసం రోగుల నుంచి లంచం (Corruption) డిమాండ్ చేయ‌డంతో ప్ర‌భుత్వం అత‌డిని సస్పెండ్ చేసింది. డాక్టర్ నరసింహమూర్తి, రోగుల నుంచి శస్త్రచికిత్స చేయడానికి గాను వారి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు చూపించిన ఒక‌ వీడియోను జూన్ 11న స్థానిక టీవీ న్యూస్ ఛానల్ ప్రసారం కావ‌డంతో అది వైర‌ల్ గా మారింది. ఆ వీడియో ప్ర‌జ‌ల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఆరోగ్య శాఖ, ప్రభుత్వ అధికారులను ఇరుకున‌పెట్టింది. డిపార్ట్‌మెంట్ అధికారులు అందించిన సమాచారం ప్రకారం.. లంచం డిమాండ్ చేసిన‌ డాక్టర్ నరసింహమూర్తి ఆగస్టు 2019 నుంచి గుడిబండే పట్టణంలోని ఆరోగ్య కేంద్రంలో ఇన్‌ఛార్జ్ తాలూకా ఆరోగ్య అధికారిగా ఉన్నారు. ఆయన సస్పెన్షన్‌కు గురయ్యే సమయానికి సుమారు ఐదేళ్ల పది నెలలు ఆ పదవిలో ఉన్...
India Census | దేశంలో జనాభా గణన తేదీలు ఖరారు
National

India Census | దేశంలో జనాభా గణన తేదీలు ఖరారు

India Census 2026 | భారతదేశంలో తదుపరి జనాభా గణన రెండు దశల్లో నిర్వహించబడుతుందని కేంద్ర‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇది అక్టోబర్ 1, 2026 నుంచి ప్రారంభమై మార్చి 1, 2027 వరకు కొనసాగుతుంది.లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్‌లోని మంచుతో కప్పబడిన ప్రాంతాలలో జనాభా గణన 2026 అక్టోబర్ 1 నుండి ప్రారంభమవుతుంది. అలాగే దేశంలోని మిగిలిన ప్రాంతాలలో 2027 మార్చి 1 నుండి చేపట్టనున్నారు. ఈరోజు హోం మంత్రిత్వ శాఖ (Ministry of Home Affairs) జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా దీనిని ప్రకటించారు. భారతదేశ 16వ జనాభా లెక్కల అధికారిక నోటిఫికేషన్‌ను భారత రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ కార్యాలయం ద్వారా హోం మంత్రిత్వ శాఖ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, దేశంలోని చాలా ప్రాంతాలకు మార్చి 1, 2027న 00:00 గంటలుగా ఉంటుంది. అయితే, కఠినమైన వాతావరణ పరిస్థితులు, క్లిష్ట భూభాగం కారణంగా, లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ...
PM Modi | జీ-7 సదస్సుకు ప్రధాని.. మూడు దేశాల పర్యటనకు సిద్ధం
World, National

PM Modi | జీ-7 సదస్సుకు ప్రధాని.. మూడు దేశాల పర్యటనకు సిద్ధం

G7 Summit | న్యూదిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విదేశీ పర్యటనకు సిద్ధ‌మ‌వుతున్నారు. సైప్రస్‌, కెనడా(Canada), క్రొయేషియా దేశాలలో ఐదు రోజులపాటు పర్యటించనున్నారని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. సైప్రస్‌ అధ్యక్షుడు నికోస్‌ క్రిస్టోడోలైడ్స్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆ దేశంలో ఈనెల 15, 16వ‌ తేదీల్లో పర్యటించనున్నారు. దాదాపు 20 ఏళ్ల‌ తర్వాత అక్కడ పర్యటించనున్న మొదటి భారత ప్రధాని మోదీనే కావ‌డం విశేషం. కాగా ఈ పర్యటనలో భాగంగా ప్రధాని న‌రేంద్ర మోదీ సైప్రస్‌ అధ్యక్షుడితో చర్చలు జరపనున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పెంచుకోవడం, మధ్యధరా ప్రాంతం, యూరోపియన్‌ యూనియన్‌లతో సంబంధాలను మరింత బ‌లోపేతం చేసే విధంగా ఇరు దేశాల మధ్య కీల‌క ఒప్పందాలు జరగనున్నాయి. ఇక సైప్ర‌స్ నుంచి ప్రధాని మోదీ కెనడాకు బ‌య‌లుదేరివెళ్ల‌నున్నారు. ఆ దేశ నూత‌న‌ ప్రధాని మార్క్‌ కార్నీ ఆహ్వ...
Plane Crash | అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం అసలు ఎలా జరిగింది..?
National, Crime

Plane Crash | అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం అసలు ఎలా జరిగింది..?

Ahmedabad | గుజ‌రాత్ లోని ఎయిర్ పోర్ట్ లో ఘోర విమాన ప్రమాదం (Plane Crash ) యావ‌త్ దేశాన్ని క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేసింది. అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి సుమారు 250 మంది ప్రయాణికులతో గురువారం లండన్ బయలుదేరిన విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాలకే కుప్పకూలిపోయింది. ఫ్లైట్ నెంబర్ ఏఐ171 విమానం 242 మంది ప్రయాణికులతో గురువారం మధ్యాహ్నం లండన్ వెళ్లడానికి అహ్మదాబాద్‌ ఎయిర్ ఫోర్ట్‌ నుంచి టేకాఫ్ అయింది. ఎప్పటిలాగే ఏఐ 171 విమానంగాలి లోకి ఎగిరే ముందు అన్ని సాంకేతిక స‌మ‌స్య‌ల‌ను త‌నిఖీ చేసుకున్నాకే టెకాఫ్ అయింది . అయితే రన్ వే నుంచి టెక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ప్రమాదానికి గురైంది . మేఘాని నగర్ గోడసర్ క్యాంప్ ప్రాంతాలయంలో విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో భారీ ఎత్తున పేలుడు శబ్దం తోపాటు దట్టమైన పొగ అలుముకుంది సుమారు విమానం 825 అడుగుల ఎత్తులో ఉండగా సాంకేతిక లోపం...
error: Content is protected !!