Railway Accident | కదులుతున్న రైలు నుంచి పడిపోయిన ప్రయాణికులు.. ఐదుగురు మృతి
Mumbra Railway Station Accident : థానే(Thane) లోని ముంబ్రా రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం (Railway Accident | కదులుతున్న రైలు నుంచి పడిపోయిన ప్రయాణికులు.. ఐదుగురు మృతి) చోటుచేసుకుంది. CSMT నుండి లక్నో వెళ్తున్న రైలు నుంచి సుమారు 10 నుండి 12 మంది ప్రయాణికులు ట్రాక్పై పడిపోయారు. ప్రమాదానికి కారణం రైలులో జనసమూహం ఎక్కువగా ఉండడమేనని భావిస్తున్నారు. ప్రయాణీకులు తలుపులకు వేలాడుతూ ప్రయాణిస్తున్నారని, ఇదే సమయంలో పలువురు ప్రయాణికులు పట్టుతప్పి జారి కిందపడిపోయారని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు.
సోమవారం, ముంబ్రా రైల్వే స్టేషన్ వద్ద లక్నో (Mumbai To Lucknow) కు వెళ్లే పుష్పక్ ఎక్స్ప్రెస్ (Pushpak Express) (12534) రైలు నుండి అనేక మంది ప్రయాణికులు పట్టాలపై పడిపోయారు, అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది. రైలులో ప్రయాణికులు కిక్కిరిపోవడంతో ఈ ప్రమాదం జరిగ...



