Sarkar Live

National

 ఢిల్లీలో పెను ప్రమాదం.. కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం – Delhi Building Collapse
Crime, National

 ఢిల్లీలో పెను ప్రమాదం.. కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం – Delhi Building Collapse

Delhi Building Collapse : న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలోని వెల్‌కమ్ ప్రాంతంలో శనివారం ఉదయం నాలుగు అంతస్తుల భవనం కుప్ప‌కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో శిథిలాల కింద ప‌లువురు చిక్కుకున్నారని పోలీసులు తెలిపారు. శిథిలాల నుంచి ముగ్గురిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప‌లు సంస్థలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని పోలీసులు తెలిపారు. "శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుపోవచ్చు" అని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. "ఉదయం 7 గంటలకు భవనం కూలిపోయినట్లు మాకు కాల్ వచ్చింది. ఏడు అగ్నిమాపక దళాలు సహా స‌హాయ‌క బృందాలు పనిచేస్తున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది" అని అధికారి తెలిపారు. స్థానికులు ఉదయం నడకకు వెళ్లినప్పుడు భవనం కూలిపోయింది. వీరిలో చాలామంది అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపు చిక్కుకున్న వారిని రక్షించడానికి ప్రయత్నించారు. తరువాత అగ్నిమాపక శాఖ సహాయంతో, ముగ్గురిని రక్షించారు. సీలంప...
Bridge Collapse | 10 మంది మృతికి కారణమైన బ్రిడ్జి ఎలా కూలిపోయింది.. ?
National

Bridge Collapse | 10 మంది మృతికి కారణమైన బ్రిడ్జి ఎలా కూలిపోయింది.. ?

Bridge Collapse : గుజరాత్​ లోని ఆనంద్ – వడోదర జిల్లాలను కలిపే గంభీర వంతెనలోని ఒక భాగం పద్రా తాలూకాలోని ముజ్‌పూర్ గ్రామం సమీపంలో కూలిపోవడంతో రెండు ట్రక్కులు, ఒక బొలెరో SUV, ఒక పికప్ వ్యాన్ సహా నాలుగు వాహనాలు మహిసాగర్ నదిలోకి పడిపోయాయి. ఈ ప్రమాదంలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. రెస్క్యూ ఆపరేషన్​లో తొమ్మిది మందిని రక్షించారు. సంజయ్ సింగ్ డీసీ, యు/సి ఇన్‌స్పెక్టర్ కృష్ణ కుమార్ పర్యవేక్షణలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. గంభీర వంతెన నాలుగు దశాబ్దాలకు పైగా మధ్య గుజరాత్, సౌరాష్ట్ర మధ్య కీలకమైన లింక్‌గా పనిచేసింది.ఈ ఆకస్మిక కూలిపోవడం వల్ల ఆనంద్, వడోదర, భరూచ్, అంకలేశ్వర్ మధ్య రవాణా సంబంధాలు తెగిపోయాయి. ఈ కారిడార్ రోజువారీ ప్రయాణికులు, వస్తువుల రవాణా, మధ్య గుజరాత్ – సౌరాష్ట్ర మధ్య అంతర్-జిల్లా కనెక్టివిటీకి కీలకమైనది. ప్రతిరోజూ ప్రయాణీకులు, కార్గో వాహనాలతో ఈ వంతెన నిత్యం రద్దీగా ఉ...
Bharat Bandh : నేడు భారత్ బంద్.. సమ్మెలో 25 కోట్ల మంది కార్మికులు?
National

Bharat Bandh : నేడు భారత్ బంద్.. సమ్మెలో 25 కోట్ల మంది కార్మికులు?

బ్యాంకింగ్, బీమా, బొగ్గు గనులు, తపాలా, నిర్మాణ రంగాల్లో సేవలకు అంతరాయం Bharat Bandh LIVE updates : దేశవ్యాప్తంగా బుధవారం (జూలై 9) 'భారత్ బంద్'కు పిలుపునిచ్చాయి. దీనికి దాదాపు 10 కేంద్ర కార్మిక సంఘాల కూటమి, అనేక రైతు సంఘాలు మ‌ద్ద‌తు ఇచ్చాయి. కేంద్రం అనుస‌రిస్తున్న "కార్పొరేట్ అనుకూల" విధానాలను నిరసిస్తూ ప‌లు సంఘాలు ఈ సమ్మెను నిర్వహిస్తున్నాయి. బ్యాంకింగ్, బీమా, బొగ్గు గనులు, తపాలా, నిర్మాణ రంగాల వంటి పబ్లిక్ సర్వీస్ విభాగాలకు చెందిన 25 కోట్ల మందికి పైగా కార్మికులు నేటి దేశవ్యాప్త సమ్మె (భారత్ బంద్)లో పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న "కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలు"పై నిరసనగా 10 కేంద్ర కార్మిక సంఘాలు ఈ బంద్ పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే.. ఈ సంద‌ర్భంగా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కి చెందిన అమర్ జీత్ కౌర్ మాట్లాడుతూ, “25 కోట్ల మంద...
Toll charges | ప్రయాణికులకు శుభవార్త:  వంతెనలు, సొరంగాలు, ఎలివేటెడ్ రోడ్లపై కేంద్రం సంచలన నిర్ణయం
National

Toll charges | ప్రయాణికులకు శుభవార్త: వంతెనలు, సొరంగాలు, ఎలివేటెడ్ రోడ్లపై కేంద్రం సంచలన నిర్ణయం

టోల్ ఛార్జీలు (Toll charges) 50% తగ్గింపు New Delhi : జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సొరంగాలు, వంతెనలు, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ హైవేలు వంటి నిర్మాణాలు ఉన్న రహదారి సెక్షన్‌లపై టోల్ ఛార్జీలను 50 శాతం వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న ఈ చర్యతో వాహదారుల ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గిపోనున్నాయి. ఫ్లైఓవర్లు లేదా ఎలివేటెడ్ రోడ్లు, సొరంగాలు, వంతెనలు వంటి నిర్మాణాలు కలిగిన జాతీయ రహదారుల్లో ప్రభుత్వం టోల్ రేట్లను 50 శాతం వరకు తగ్గించింది. జాతీయ రహదారి రుసుము నియమాలు, 2008 ప్రకారం జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద వినియోగదారు రుసుములు వసూలు చేస్తున్నవిషయం తెలిసిందే.. 2008లో అమలులోకి వచ్చిన నేషనల్ హైవే టోల్ నియమాలను సవరించిన మంత్రిత్వ శాఖ, కొత్త లెక్కింపు పద్ధతిని తాజా నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఇందులో పేర్...
జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. Parliament Session-2025
National

జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. Parliament Session-2025

Parliament Monsoon Session-2025 | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 21, 2025 వరకు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 15న జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సన్నాహాలు, భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆగస్టు 13, 14 తేదీల్లో సమావేశాలు ఉండవని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ సెష‌న్‌ను లోక్‌సభ. రాజ్యసభ రెండింటినీ ఏర్పాటు చేయడానికి భారత రాష్ట్రపతి ఆమోదం తెలిపారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. "జూలై 21 నుండి ఆగస్టు 21, 2025 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనను భారత రాష్ట్రపతి ఆమోదించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల దృష్ట్యా, ఆగస్టు 13, 14 తేదీలలో సమావేశాలు ఉండవు" అని ఆయన Xలో పోస్ట్ చేశారు. ఆప‌రేష‌న్‌ సిందూర్‌పై వాడీవేడిగా చర్చ‌ల‌కు అవ‌కాశం జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జర...
error: Content is protected !!