Pension : జర్నలిస్టుల పెన్షన్ మొత్తాన్ని భారీగా పెంచిన ప్రభుత్వం
Bihar News : బీహార్ ఎన్నికలకు ముందు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జర్నలిస్టుల పెన్షన్ (Journalist Pension) మొత్తాన్ని రెట్టింపు చేసింది. దీంతో బీహార్లో జర్నలిస్టులకు భారీ ఊరట లభించింది. బీహార్ పత్రకర్ సమ్మాన్ పెన్షన్ యోజన (Patarkar Samman Pension Yojana) కింద, ఇప్పుడు అర్హత ఉన్న జర్నలిస్టులందరికీ ప్రతి నెలా రూ. 6 వేలకు బదులుగా రూ. 15 వేల పెన్షన్ మొత్తాన్ని అందిస్తారు. ముఖ్యమంత్రి నితిష్కుమార్ (Nitish Kumar) ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో పోస్ట్ చేశారు.
ఎక్స్లో ఆయన ఒక పోస్టులో.. బీహార్ పత్రకర్ సమ్మాన్ పెన్షన్ పథకం కింద, అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ నెలకు రూ. 6,000 కు బదులుగా రూ. 15,000 పెన్షన్ అందించాలని శాఖను ఆదేశించినట్లు తెలియజేయడానికి నేను సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు. అలాగే, బీహార్ పత్రకర్ సమ్మాన్ పెన్షన్ పథకం కింద పెన్షన్ పొందుతున్న జర్నలిస్టులు మరణిస్తే,...




