Odisha Stampede : పూరీ జగన్నాథయాత్రలో తొక్కిసలాట, ముగ్గురు మృతి
Odisha Stampede : ఒడిశాలోని చారిత్రాత్మక నగరం పూరీలో జగన్నాథ స్వామి రథయాత్ర సందర్భంగా దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున గుండిచా ఆలయం వద్ద భక్తులు పెద్దఎత్తున గుమిగూడడంతో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు.
ఒడిశాలోని పూరిలో రథయాత్ర సందర్భంగా గుండిచా ఆలయం సమీపంలో జరిగిన తొక్కిసలాట (Puri Stampede ) కారణంగా పెద్ద ప్రమాదం సంభవించింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఒడిశాలోని పూరిలో జరిగిన రథయాత్రలో ఈ ప్రమాదం ఆదివారం ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు జరిగింది.
పూరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ ఎస్ స్వైన్ మాట్లాడుతూ, తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వందలాది మంది భక్తులు ఆలయం సమీపంలో గుమిగూడినప్పుడు ఈ సంఘటన జరిగిందని చెప్పారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, ఆరుగురి పరిస్థితి విషమంగా ఉం...




