India Census | దేశంలో జనాభా గణన తేదీలు ఖరారు
India Census 2026 | భారతదేశంలో తదుపరి జనాభా గణన రెండు దశల్లో నిర్వహించబడుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది అక్టోబర్ 1, 2026 నుంచి ప్రారంభమై మార్చి 1, 2027 వరకు కొనసాగుతుంది.లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లోని మంచుతో కప్పబడిన ప్రాంతాలలో జనాభా గణన 2026 అక్టోబర్ 1 నుండి ప్రారంభమవుతుంది. అలాగే దేశంలోని మిగిలిన ప్రాంతాలలో 2027 మార్చి 1 నుండి చేపట్టనున్నారు. ఈరోజు హోం మంత్రిత్వ శాఖ (Ministry of Home Affairs) జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా దీనిని ప్రకటించారు.
భారతదేశ 16వ జనాభా లెక్కల అధికారిక నోటిఫికేషన్ను భారత రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ కార్యాలయం ద్వారా హోం మంత్రిత్వ శాఖ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, దేశంలోని చాలా ప్రాంతాలకు మార్చి 1, 2027న 00:00 గంటలుగా ఉంటుంది. అయితే, కఠినమైన వాతావరణ పరిస్థితులు, క్లిష్ట భూభాగం కారణంగా, లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ...




