Hanamkonda | ‘వినాయకా’.. ధాన్యం ఎక్కడా?
                    కోట్లు విలువ చేసే ధాన్యం మాయం చేసిన మిల్లు యాజమాన్యం?
రబీ సీజన్లో ప్రభుత్వం కేటాయించిన ధాన్యం మాయం పై అనేక ఆరోపణలు
పౌరసరఫరాల శాఖ అధికారులకు తెలుసా? తెలియదా ?
Hanamkonda | ఆ మిల్లు యాజమాన్యం కోట్లు విలువ చేసే ధాన్యం మాయం చేసిందా?ప్రభుత్వం సదరు మిల్లుకు పంపిన ధాన్యం ఆ మిల్లులో ఎందుకు లేనట్లు?కేటాయించిన ధాన్యాన్ని మిల్లు యాజమాన్యం బహిరంగ మార్కెట్ కు తరలించిందా?లేక అసలు ఆ మిల్లుకు పూర్తిస్థాయిలో ధాన్యమే రాలేదా?అనే ప్రశ్నలు ఇప్పుడు పౌరసరఫరాల శాఖలో చక్కర్లు కొడుతున్నాయి.హన్మకొండ జిల్లా (Hanamkonda District) గట్లకానిపర్తిలో ఉన్న వినాయక మిల్లుకు ప్రభుత్వం 2024-25 రబీ సీజన్ లో 3225.080 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మరాడించేందుకు పంపించింది. సదరు మిల్లు యాజమాన్యం ఆ ధాన్యాన్ని మరాడించి 2160 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్ రూపంలో పౌరసరఫరాల శాఖ కు అప్పగించాల్సి ఉండగా ఇప్పటివరకు నామమాత్రంగానే ...                
                
             
								



