Gorrekunta Murder Case | బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడి హత్య మిస్టరీ: 45 రోజులు గడిచినా ఆధారాలు దొరకలేదా?
వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో కలకలం రేపిన బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడి అనుమానాస్పద మృతి (Gorrekunta Murder Case) కేసులో దర్యాప్తు మిస్టరీగానే కొనసాగుతోంది. ఈ ఘటన జరిగి సుమారు 45 రోజులు గడిచినప్పటికీ, ఈ హత్య మిస్టరీని ఛేదించడంలో పోలీసులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారనేది స్థానికుల్లో పెద్ద ప్రశ్నగా మారింది. ఈ కేసులో ఏం జరుగుతోందనేది ఇప్పటికీ రహస్యంగానే ఉంది.
జిల్లాలో అత్యంత సంచలనం సృష్టించిన మర్డర్ మిస్టరీలను కూడా అవలీలగా ఛేదించిన ట్రాక్ రికార్డు పోలీసు శాఖకు ఉంది. సుమారు ఐదేళ్ల క్రితం గొర్రెకుంట శివారులో ఏకంగా 9 మంది బావిలో శవాలై తేలిన మిస్టరీని చాకచక్యంగా ఛేదించిన ఘనత పోలీస్ శాఖకు ఉంది. అలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నప్పటికీ, ప్రతిపక్ష పార్టీకి చెందిన గ్రామ అధ్యక్షుడు ల్యాదల్ల.రాజు(లవ్ రాజ్ )అనుమానాస్పదంగా మృతి చెంది 45 రోజులు గడిచినా కేసు మిస్టరీ ఎందుకు వీడటం లేదు అన్నది ప్రశ్న.
ఈ...




