Sarkar Live

Hyderabad

KCR | క్షేత్రస్థాయిలో ఉద్యమాలకు సిద్ధం కండి
State, Hyderabad

KCR | క్షేత్రస్థాయిలో ఉద్యమాలకు సిద్ధం కండి

హైదరాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారమే దిశగా రేవంత్ ప్రభుత్వంపై (Revanth Govt) క్షేత్రస్థాయిలో పోరాాటాలకు సిద్ధంకావాలని గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) పిలుపునిచ్చారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో మంగళవారం (జులై 29) బీఆర్ఎస్ శ్రేణులతో కేసీఆర్ సమావేశమయ్యారు. రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఆంధ్రా ప్రయోజనాలను కాపాడేందుకు స్వయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే పాలనా విధానాలను అమలుచేయడం దుర్మార్గమని అన్నారు. ఇక్కడ చంద్రబాబు..అక్కడ మోదీల ప్రయోజనాలను కాపాడేందుకు సీఎం తహతహ లాడుతున్నాడని, దీనిని తెలంగాణ సమాజం గమనిస్తున్నదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశాపూర్వకంగా పండబెట్టి.. వానాకాలం నాట్లు దగ్గరపడుతున్నా కూడా.. ఇంతవరకు రైతాంగానికి సాగునీరు అందించని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదీయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కన్నేపల్లి పంప్ హ...
HYDRAA : మూసీ నది ఆక్రమణలపై కొరడా – షెడ్లు, షాపుల తొలగింపు
State, Hyderabad

HYDRAA : మూసీ నది ఆక్రమణలపై కొరడా – షెడ్లు, షాపుల తొలగింపు

మూసపేటలో ఆక్రమణల నుంచి పార్కుకు విముక్తి పార్కు స్థలంలో కబ్జాలు తొలగించిన హైడ్రా హైదరాబాద్ (Hyderabad) లోని మూసీ నది (Musi River)లో ఆక్రమణలను హైడ్రా (HYDRAA) తొలగించింది. మూసీ పరీవాహక ప్రాంతంలోని చాదర్ ఘాట్ బ్రిడ్జి నుంచి ఉస్మానియా హాస్పిటల్ వరకు పలు అక్రమ నిర్మాణాలను మంగళవారం హైడ్రా నేలమట్టం చేసింది. ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్ల నుంచి మూసీని ఆక్రమించి, పలు నిర్మాణాలు చేపట్టారు. వాటిని ప్రయివేట్ బస్సులకు, లారీలకు కిరాయికి ఇస్తున్నారు. అంతేకాకుండా రాత్రి వేళల్లో ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్నట్టు స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో మూసీ ప్రాంతంలో విచారణ చేపట్టిన అధికారులు, ఆక్రమణలు నిజమేనని నిర్ధారించారు.మంగళవారం ఉదయం నుంచి పోలీసు భారీ బందోబస్తు మధ్య మూసీలో తిష్టవేసిన షెడ్డులను తొలగించారు. ఇలా ఉండగా న‌గ‌రంలోని మూసాపేట ఆంజ‌నేయ న‌గ‌ర్‌లో అక్...
Vande Bharat Express | తెలుగు రాష్ట్రాల నుంచి మరో వందేభారత్ – రూట్, షెడ్యూల్ ఇదే..!
Hyderabad

Vande Bharat Express | తెలుగు రాష్ట్రాల నుంచి మరో వందేభారత్ – రూట్, షెడ్యూల్ ఇదే..!

Vande Bharat Express | తెలంగాణ, ఏపీలో వందేభారత్ రైళ్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే సేవ‌లందిస్తున్న వందేభారత్ రైళ్ల‌లో దాదాపు అన్నీ ఫుల్‌ ఆక్యుపెన్సీని న‌మోదు చేశాయి. దీంతో.. కీల‌క‌మైన‌ మార్గాల్లో వందేభారత్ కోసం పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ప్రధాన రైళ్లల్లో వెయిటింగ్ లిస్టు ఉండడంతో ఆయా మార్గాల్లో వందేభారత్ ట్రైన్స్‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే భావిస్తోంది. ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణ ప్రయాణీకులు సుదీర్ఘ కాలం వేచి చూస్తున్న విధంగా మరో ప్రధాన మార్గం లో కొత్తగా వందేభారత్ సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ను న‌డిపించ‌నున్నారు. కొత్త‌గా ఈ మార్గంలోనే.. కొత్తగా పూణే న‌గ‌రం నుంచి నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వే శాఖ నిర్ణ‌యం తీసుకుంది. వీటిని బెలగావి, షెగోన్, వడోదర, సికింద్రాబాద్ కు కేటాయించాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ - నాగపూర్ మధ్య ప్రస్తుతం వందేభ...
Special Trains | ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్ నుంచి ప్ర‌త్యేక రైళ్లు..
State, Hyderabad

Special Trains | ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్ నుంచి ప్ర‌త్యేక రైళ్లు..

South Central Railway | వచ్చే ఆగస్టు నెలలో ప్రయాణీకుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలలోని కీలక మార్గాల్లో 38 ప్రత్యేక రైళ్లను (Special Trains) ప్రవేశపెట్టింది. సికింద్రాబాద్–తిరుపతి, రిటర్న్ సర్వీసులు రైలు నంబర్ 07009 జూలై 31 నుంచి ఆగస్టు 28 వరకు ప్రతి గురువారం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07010 ఆగస్టు 1 నుంచి 29 వరకు శుక్రవారం తిరుపతి నుండి సికింద్రాబాద్‌కు నడుస్తుంది. కాచిగూడ–నాగర్​సోల్​ స్పెషల్ ట్రైన్​ నంబర్ 07055 ఆగస్టు 7, 28 మధ్య గురువారం కాచిగూడ నుంచి నాగర్సోల్‌కు బయలుదేరుతుంది. రైలు నంబర్ 07056 ఆగస్టు 8 నుండి 29 వరకు శుక్రవారం నాగర్సోల్ నుండి కాచిగూడకు తిరిగి వస్తుంది. నాందేడ్-తిరుపతి వారాంతపు రైళ్లు రైలు నంబర్ 07015 ఆగస్టు 2 నుండి ఆగస్టు 30 వరకు నాందేడ్ నుండి తిరుపతికి ప్రతి శనివ...
Harish Rao | ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ పాల‌న‌కు ఇదే నిద‌ర్శ‌నం.. : మాజీ మంత్రి హ‌రీష్ రావు ఫైర్‌..
State, Hyderabad

Harish Rao | ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ పాల‌న‌కు ఇదే నిద‌ర్శ‌నం.. : మాజీ మంత్రి హ‌రీష్ రావు ఫైర్‌..

48 గంటల్లో 4 ఫుడ్ పాయిజన్ ఘటనలు.. కాంగ్రెస్ పాలనపై హరీశ్ రావు ఆగ్రహం గురుకులాలు, హాస్ట‌ళ్ల‌లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (MLA Harish Rao) ఫైర్ అయ్యారు. సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్, నాగల్ గిద్ద మోడల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ గ్రామం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం గురుకుల కళాశాలలో ఫుడ్ పాయిజన్.. ఇలా 48 గంటల్లో జరిగిన ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనాలు అని హ‌రీష్ రావు విమర్శించారు. 48 గంటల్లో 4 ఘటనలు: సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ మండలం నాగల్‌గిద్ద మోడల్ పాఠశాల నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి గురుకుల పాఠశాల జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామం గురుకుల పాఠశాల భద్రా...
error: Content is protected !!