Sarkar Live

Hyderabad

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల.. తొలిరోజు నామినేషన్లు ఎంతంటే.. – Jubilee Hills By Election
State, Hyderabad

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల.. తొలిరోజు నామినేషన్లు ఎంతంటే.. – Jubilee Hills By Election

Jubilee Hills By Election | జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కోసం రాష్ట్ర‌ ఎన్నిక‌ల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సోమవారం నుంచి ఈనెల 21వ తేదీ వరకు నామినేషన్లను స్వీక‌రించనున్న‌ట్లు ఎన్నికల సంఘం వెల్ల‌డించింది. 22న నామినేషన్ల పరిశీలన, 24 వరకు ఉప సంహరణ ప్రక్రియ కొనసాగనుంది. ఉప ఎన్నిక పోలింగ్‌ వచ్చే నెల 11న పోలింగ్‌, 14న యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. 16వ తేదీన ఎన్నికల ప్రక్రియ పూర్తి స్థాయిలో ముగియనుంది. షేక్‌పేట తహసీల్దార్‌ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. సెలవు రోజు మినహా మిగతా రోజుల్లో నామినేషన్ల స్వీకరించ‌నున్నారు. కార్యాలయంలో నేరుగా లేదా ఆన్‌లైన్‌ విధానంలో దాఖలు చేసే వీలు క‌ల్పించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారని అధికారులు వెల్లడించారు. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థులకు ఒక ప్రతిపాదించే నియోజకవర్గ ఓటరు ఉండాలన...
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో “ఓటు చోరీ” వివాదం — ఒకే చిరునామాలో 43 మంది ఓటర్లు నమోదు! Jubilee Hills By-Election
State, Hyderabad

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో “ఓటు చోరీ” వివాదం — ఒకే చిరునామాలో 43 మంది ఓటర్లు నమోదు! Jubilee Hills By-Election

Jubilee Hills By-Election : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన “ఓటు చోరీ” ప్రచారం ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌కే తిప్పికొడుతోందన్న చర్చ నడుస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills By-Election) నేపథ్యంలో యూసుఫ్‌గూడ డివిజన్‌లో భారీ స్థాయిలో నకిలీ ఓటర్లు నమోదైనట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూసుఫ్‌గూడలో ఒకే చిరునామాలో 43 మంది ఓటర్లు నమోదైనట్లు తేలింది. యూసుఫ్‌గూడ డివిజన్‌లోని కృష్ణనగర్ బి బ్లాక్ తాజా ఓటర్ల జాబితా ప్రకారం, బూత్ నంబర్ 246 కింద ఒకే చిరునామాలో 43 మంది ఓటర్లు నమోదు అయి ఉన్నారు. అంతేకాకుండా ఉప ఎన్నికకు ముందు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాలలో ఓటర్లను నమోదు చేసుకుంటున్నారని అనేక ఫిర్యాదులు వచ్చాయి. BRS ప్రతినిధి వై సతీష్ రెడ్డి ఎక్స్‌లో ఇలా పోస్ట్ చేశారు, “వేలాది మందిలో ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. (ఒకే చిరునామాలో 43 మంది ఓటర్లు) ఇక్క‌డి ఓటరు, జాగ్రత్తగా చూ...
TG | స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్…
State, Hyderabad

TG | స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్…

ఎన్నికల నోటిఫికేషన్, జీవో నంబర్ 9పై స్టే విధించిన హైకోర్టు… TG News | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు (Telangana Local Body Elections) బ్రేక్ పడింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధిస్తూ హైకోర్టు ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. బుధ, గురువారాల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం… స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై స్టే విధించింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నాలుగు వారాల్లో కౌంటర్ ద...
KTR | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ‘చలో బస్‌భవన్‌’ ఆందోళన.. కేటీఆర్‌, హరీష్‌ రావు హౌస్‌ అరెస్ట్‌
State, Hyderabad

KTR | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ‘చలో బస్‌భవన్‌’ ఆందోళన.. కేటీఆర్‌, హరీష్‌ రావు హౌస్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఆర్టీసీ చార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే ర‌ద్దు చేసుకోవాల‌ని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌గురువారం 'చలో బస్‌భవన్‌' కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు వెంట‌నే రంగంలోకి దిగి. బీఆర్‌ఎస్‌ నేతలను హౌస్‌ అరెస్ట్ చేశారు. గురువారం ఉదయమే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR ), మాజీ మంత్రి హరీష్‌ రావు(Harish Rao)ను పోలీసులు గృహ‌నిర్బంధం చేశారు. ఈ క్రమంలో కోకాపేటలోని వారి నివాసాల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఇక, చలో బస్‌భవన్‌ కార్యక్రమంలో భాగంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR), మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పద్మారావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఉదయం 9 గంటలకు రేతిఫైల్‌ బస్టాండ్‌కు చేరుకుని అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో ఆర్టీసీ బస్‌భవన్‌ వరకు వెళ్లాలని నిర్ణ‌యించుకున్నారు. అనంతరం టీజీఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు వ...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కొత్త సంస్కరణలు – Jubilee Hills bye-election
State, Hyderabad

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కొత్త సంస్కరణలు – Jubilee Hills bye-election

Jubilee Hills bye-election | ముఖ్య ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) ప్రవేశపెట్టిన కొత్త ఎన్నికల సంస్కరణలతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ నిర్వహించ‌నున్న‌ట్టు రాష్ట్ర‌ ముఖ్య ఎన్నికల అధికారి సుద‌ర్శ‌న్‌రెడ్డి అన్నారు. తొలిసారిగా బీహార్‌ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో అమల్లోకి వస్తున్నాయని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక (Jubilee Hills bye-election)షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో, ముఖ్య ఎన్నికల అధికారి సుద‌ర్శ‌న్‌రెడ్డి మంగళవారం వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశమ‌య్యారు. బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఎంఐఎం తదితర పార్టీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఈ ఎన్నిక‌ల్లో ఎన్నిక‌ల సంఘం చేప‌ట్ట‌నున్న చ‌ర్య‌ల‌ను ఆయా పార్టీల నేత‌ల‌కు వివ‌రించారు. కొత్త సంస్క‌ర‌ణ‌లు ఇవీ.. ఒక్కో...
error: Content is protected !!