Sarkar Live

Hyderabad

పంటనష్ట పరిహారం నిధుల విడుదల  – Crop Loss Compensation
State, Hyderabad

పంటనష్ట పరిహారం నిధుల విడుదల – Crop Loss Compensation

Crop Loss Compensation | రాష్ట్రంలో గత రెండు నెలలుగా పలుధఫాలుగా వడగళ్ల వానలు, అకాలవర్షాలకు పంట నష్టం సంభవించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలమేరకు వ్యవసాయ శాఖ రైతుల వారీగా పంటనష్టం అంచనవేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ నష్ట పరిహారాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసేందుకు వీలుగా సర్వేకు ఆదేశాలివ్వగా నివేదికలు ప్రభుత్వానికి సమర్పించింది. దాదాపు 29 జిల్లాల్లో 41,361 మంది రైతులకు సంబంధించి 5,528 ఎకరాలలో పంట నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేశారు. దీనికి సంబంధించిన 51.528 కోట్లు నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులను సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకొని త్వరలోనే నష్టపోయిన రైతుల ఎకౌంట్లలో జమ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను వ్యవసాయశాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు. డమైనది. రాష్ట్రవ్యాప్తం...
Special Trains | 44 స్పెషల్‌ ట్రైన్స్‌ ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
Hyderabad, State

Special Trains | 44 స్పెషల్‌ ట్రైన్స్‌ ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

Special Trains | రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు వారంత‌పు ప్ర‌త్యేక‌ రైళ్లను నడిపించనున్నట్లు వెల్ల‌డించింది. వేస‌వి సెల‌వులు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న త‌రుణంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 44 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్న‌ట్లు పేర్కొంది. Special Trains : ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవీ.. విశాఖపట్నం – బెంగళూరు (08581) మధ్య జూన్‌ ఒకటి నుంచి జూన్‌ 29వ తేదీ వరకు ప్రతి ఆదివారం రైలు రాకపోకలు సాగిస్తుందని పేర్కొంది. ఇక బెంగళూరు-విశాఖపట్నం (08582) మధ్య జూన్‌ 2 నుంచి 30 వరకు ప్రతి సోమవారం రైలు నడుస్తుందని ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వ వెల్ల‌డించింది. విశాఖపట్నం – తిరుపతి (08547) రైలు జూన్‌ 4 నుంచి జులై 30 వరకు ప్రతి బుధవారం రైలు నడుస్తుంది విశాఖపట్నం-తిరుపతి (08548) రైలు జూన్‌ 5 నుంచి జులై 31 వరకు ప్రతి గురువ...
Heavy Rains | తెలంగాణ‌కు ఆరెంజ్ అలెర్ట్ ఈనెల 29వ‌ర‌కు భారీ వ‌ర్షాలు
State, Hyderabad

Heavy Rains | తెలంగాణ‌కు ఆరెంజ్ అలెర్ట్ ఈనెల 29వ‌ర‌కు భారీ వ‌ర్షాలు

Heavy Rains | రాష్ట్రంలో ఈనెల 29 వరకు భారీ వర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చ‌రించింది. ఈ మేర‌కు ప‌లు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా సాగుతున్నాయ‌ని. నైరుతి విస్తరణకు పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని పేర్కొంది. మంగళవారం పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే చాన్స్ ఉంద‌ని తెలిపింది. ఇక సోమవారం వికారాబాద్‌, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా వానలు కురిశాయి. 27న ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు ఈనెల 27న ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం ...
హైద‌రాబాద్ మెట్రో ఫేజ్ 2 డిపీఆర్ రెడీ.. – Hyd Metro Phase II
State, Hyderabad

హైద‌రాబాద్ మెట్రో ఫేజ్ 2 డిపీఆర్ రెడీ.. – Hyd Metro Phase II

Hyd Metro Phase II : హైద‌రాబాద్ మెట్రో ఫేజ్-II (బి) కారిడార్‌లైన JBS - మేడ్చల్, JBS - షామీర్‌పేట్, విమానాశ్రయం - ఫ్యూచర్ సిటీకి సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు (DPRలు) పూర్తిగా సిద్ధమ‌యయ్యాయి. కొత్త డీపీఆర్ లు మే 8న హైదరాబాద్ విమానాశ్రయ మెట్రో లిమిటెడ్ (HAML) బోర్డు ఆమోదించిందని మెట్రో రైలు అధికారులు తాజాగా ధృవీకరించారు. ప్రతిపాదిత JBS-షామీర్‌పేట్ మార్గం 22 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇందులో 1.65 కి.మీ అండ‌ర్ గ్రౌండ్ రైల్వే లైన్ కూడా ఉంది. డీపీఆర్‌లు ప్రస్తుతం ప్రభుత్వ సమీక్షలో ఉన్నాయని HAML మేనేజింగ్ డైరెక్టర్ NVS రెడ్డి వెల్ల‌డించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందే వరకు కొన్ని వివరాలు గోప్యంగా ఉండాలని ఆయన స్ప‌ష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, ఇతర రాష్ట్రాల్లో మెట్రో నిర్మాణ అంచనాలు, హైదరాబాద్ ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా డీపీఆర్‌ల (Hyd Metro Phase II DPRs) ను సమగ్ర...
Hyd Metro | మెట్రో రైలు కొత్త ఛార్జీలపై 10 శాతం తగ్గింపు
Hyderabad

Hyd Metro | మెట్రో రైలు కొత్త ఛార్జీలపై 10 శాతం తగ్గింపు

Hyd Metro | ఎల్ అండ్ టి మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (ఎల్ అండ్ టిఎంఆర్హెచ్ఎల్) మూడు మెట్రో కారిడార్లలోని అన్ని ఛార్జీల జోన్లలో కొత్తగా సవరించిన ఛార్జీలపై 10% తగ్గింపును ప్రకటించింది, ఇది మే 24 నుండి అమల్లోకి రానుంది. మెట్రో కార్యకలాపాలు, నిర్వహణ యొక్క దీర్ఘకాలిక స్థిరత్వాన్ని పెంపొందించేందుకు ఛార్జీల స్థిరీకరణ కమిటీ (FFC) సిఫార్సుల ఆధారంగా ఈ ఛార్జీల సవరణను ప్రవేశపెట్టినట్లు ఒక పత్రికా ప్రకటన తెలిపింది.ప్రయాణీకుల అభిప్రాయాలను జాగ్రత్తగా పరిశీలించి, ఆర్థిక విచ‌క్ష‌ణ‌ను కొనసాగిస్తూ ప్రయాణికులకు కాస్త ఊర‌ట క‌లిగించేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. "మెట్రో కార్యకలాపాల స్థిరత్వాన్ని కొనసాగించడానికి ఛార్జీల సవరణ చాలా అవసరం అయినప్పటికీ, మా విలువైన ప్రయాణీకులపై ఆర్థిక భారాన్ని తగ్గించాల‌ని నిర్ణ‌యించామ‌ని L&TMRHL MD & CEO KVB రెడ్డి అన్నారు. "మా ప్రయాణీకుల అభిప్రాయం మేర‌కు మే 24 నుం...
error: Content is protected !!