Sarkar Live

Hyderabad

ACB Rids | ఏసీబీ అదుపులో  ఇరిగేషన్ మాజీ చీఫ్ ఇంజనీర్
State, Hyderabad

ACB Rids | ఏసీబీ అదుపులో ఇరిగేషన్ మాజీ చీఫ్ ఇంజనీర్

హైదరాబాద్‌, కరీంనగర్‌, జహీరాబాద్‌ లోని పది చోట్ల ఏకాలంలో సోదాలు.. Hydrabad : నీటి పారుదల శాఖ మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ మురళీధర్‌రావు (Muralidar Rao) ఇంట్లో ఏసీబీ ఆకస్మికంగా సోదాలు (ACB Rids) చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో ఏసీబీ ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. ఈఎన్సీగా పనిచేస్తూ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు మురళీధర్ రావుపై పలు ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్‌, కరీంనగర్‌, జహీరాబాద్‌.. మొత్తం 10 చోట్ల ఏకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఈఎన్‌సీ జనరల్‌ (ENC General) గా కీలకంగా వ్యవహరించిన మురళీధర్ రావు ఉమ్మడి ఆంధ్రప్రదేవ్ రాష్ట్రంలోనే పదవీవిరమణ పొందారు. ఆ తర్వాత ముళీధర్‌రావు పదవీ కాలాన్ని 13 సంవత్సరాల పాటు పొడిగించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన కొన్నాళ్లు...
Raja Singh | ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామాను ఆమోదించిన బిజెపి అధిష్ఠానం
Hyderabad, State

Raja Singh | ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామాను ఆమోదించిన బిజెపి అధిష్ఠానం

గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ (MLA Raja Singh) రాజీనామాను బిజెపి హైకమాండ్ ఆమోదించింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆయన తెలంగాణ బిజెపిని బహిరంగంగా విమర్శించారు. తెలంగాణ బిజెపిలో జరుగుతున్న పరిణామాలకు నిరసనగా ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన తన రాజీనామా లేఖను బిజెపి హైకమాండ్‌కు పంపారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామాను ఒక వారం తర్వాత పార్టీ అధిష్ఠానం ఆమోదించింది. దీనిని జూలై 11, 2025న బిజెపి జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ అధికారికంగా ప్రకటించారు. బీజేపీపీ నాయకుడు, గోషామహల్ (Goshamahal ) ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామాను పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆమోదించారు. ఈ మేరకు పార్టీ హైకమాండ్ శుక్రవారం (జూలై 11) అధికారిక లేఖను విడుదల చేసింది. కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రాజా సింగ్ ఇటీవల తన రాజీనామా లేఖను కేంద్...
Hydraa | కొరడా ఝులిపిస్తున్న హైడ్రా.. కూకట్‌పల్లి, రాజేంద్రనగర్‌లో కూల్చివేతలు
Hyderabad, State

Hydraa | కొరడా ఝులిపిస్తున్న హైడ్రా.. కూకట్‌పల్లి, రాజేంద్రనగర్‌లో కూల్చివేతలు

Hydraa demolitions in Hyderabad : హై రాబాద్‌లో అక్రమ భవనాలపై హైడ్రా (Hydraa ) గట్టి చర్యలు తీసుకుంటోంది. కాలువలు, చెరువులు, కుంటలు, పబ్లిక్ పార్కులపై నిర్మించిన నిర్మాణాలను తొలగిస్తోంది. శుక్రవారం (జూలై 11) కూకట్‌పల్లి ప్రాంతంలో హైడ్రా బృందాలు కూల్చివేతలు చేపట్టాయి. హబీబ్ నగర్‌లో అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లారు. పోలీసుల భద్రత మధ్య వారు ఆక్రమణలను తొలగించారు. హబీబ్ నగర్‌లోని డ్రెయిన్ (నాలా) 7 మీటర్ల పొడవు ఉంది. హైడ్రా NRC గార్డెన్, NKNR గార్డెన్ నుండి సరిహద్దు గోడలకు, డ్రెయిన్‌కు అడ్డుగా ఉన్న మరొక గోడను కూల్చివేసింది. వారు ఆ ప్రాంతం నుండి చెత్త, ఇతర వ్యర్థాలను కూడా తొలగించారు. Hydraa : రాజేంద్ర నగర్​ లో పార్కు భూమి స్వాధీనం మరో కేసులో, రాజేంద్రనగర్‌లోని పార్క్ భూమిలో అక్రమ భవనాలను హైడ్రా తొలగించింది. పార్క్ భూమిని అనధికారికంగా ఉప...
TGSRCT | రోడ్ల‌పైకి కొత్త బస్సులు.. ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ
State, Hyderabad

TGSRCT | రోడ్ల‌పైకి కొత్త బస్సులు.. ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ

TGSRCT | తెలంగాణ‌లో కొత్తగా 422 బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఈమేర‌కు తెలంగాణ స‌ర్కారు అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో భాగంగా మ‌హిళ‌ల‌కు ఉచితంగా ప్ర‌యాణం అందిస్తుండ‌డంతో బస్సులు నిత్యం కిట‌కిట‌లాడుతున్నాయి. సీట్లు దొర‌క‌క ప్ర‌యాణికులు అనేక అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. బ‌స్సుల కోసం బ‌స్టాండ్లు, బ‌స్టాపుల జ‌నం గంట‌ల త‌ర‌బ‌డి ప‌డిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో ప్ర‌భుత్వం స్పందించి కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకువ‌స్తోంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు టీజీఆర్టీసీ తెలిపింది. మ‌రోవైపు కాలంచెల్లిన 294 పల్లె వెలుగులు, 88 మెట్రో డీలక్స్ లు , 17 ఎక్స్ప్రెస్ లు, 22 డీలక్స్ బ‌స్సుల‌ స్థానంలో కొత్త బస్సులను ప్ర‌వేశపెడుతున్నారు. 13 నుంచి 15 లక్షల కిలోమీట‌ర్లు తిరిగిన లేదా 15 ఏళ్ల కాలం దాటిన బస్సులను ఆర్టీసీ ప‌క్క‌నపెట్ట‌నుంది. తెలుగు వార్తలు, ప్రత్...
Secunderabad | ప్రయాణికులకు గుడ్​ న్యూస్​.. పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు
Hyderabad, State

Secunderabad | ప్రయాణికులకు గుడ్​ న్యూస్​.. పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు

Secunderabad : ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో పలు కీలక మార్గాల్లో తాత్కాలికంగా ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ మేరకు రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. Secunderabad -ఆర్సీకేరే (07079/ 07080) ప్రత్యేక రైలు ఈనెల 13 నుంచి ఆగస్టు 31 వరకు ప్రతీ ఆదివారం సాయంత్రం 6.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.45 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 14 నుంచి సెప్టెంబర్ 1 వరకు ప్రతి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు అర్పికేరేలో బయ లుచేరి మరుసటి రోజు ఉదయం 7.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్-అర్సికెరే (07060/07010) హైదరాబాద్-అర్సీకేరీ (07060/07010) స్పెషల్ ట్రైన్ ఈ నెల 8 నుంచి ఆగస్టు 26 వరకు ప్రతి మంగళవారం సాయంత్రం 7.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.45కు చేరుకుం టుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 8వ తేదీ నుంచి ఆగస్టు 27 వరకు ప్రతి ...
error: Content is protected !!