Sarkar Live

Hyderabad

HYDRAA | హైదర్‌నగర్‌లో హైడ్రా కూల్చివేత‌లు
State, Hyderabad

HYDRAA | హైదర్‌నగర్‌లో హైడ్రా కూల్చివేత‌లు

ఆక్రమణకు గుఐన 1,094 గజాల భూమి స్వాధీనం HYDRAA Hyderabad : హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన ఆస్తి రక్షణ సంస్థ (HYDRAA) మంగళవారం రాజేంద్రనగర్ మండలం హైదర్‌నగర్‌లోని ఆక్రమణలను కూల్చివేసింది. అక్రమంగా క‌బ్జాచేసిన 1,094 చదరపు గజాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది. 2001లో, ఏజీ ఆఫీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ హైదర్‌నగర్‌ (Hydernagar) లోని నలంద నగర్ కాలనీ పేరుతో ఒక లేఅవుట్‌ను అభివృద్ధి చేసింది, దీనిని అప్పట్లో హుడా ఆమోదించింది. అయితే, ఆ భూమిని అమ్మినవారు పక్కనే ఉన్న 1,004 చదరపు గజాల స్థలాన్ని తమ ఆస్తిలో భాగంగా క్లెయిమ్ చేసుకుని దానిని ఆక్రమించుకున్నారని హైడ్రా అధికారులు తెలిపారు. ప్రజా సౌకర్యాల కోసం కేటాయించిన భూమి ఆక్రమణకు గురైందని పేర్కొంటూ నలంద నగర్ కాలనీ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు తర్వాత, హైడ్రా 1,094 చదరపు గజాలు నలంద నగర్‌కు చెందినవిగా గుర్తించింది. మంగళవారం, హైడ్రా అధ...
పేదలకు గుడ్ న్యూస్.. ఈనెలలోనే 2.4 లక్షల కొత్త రేషన్‌కార్డులు.. మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన  – Ration Cards
State, Hyderabad

పేదలకు గుడ్ న్యూస్.. ఈనెలలోనే 2.4 లక్షల కొత్త రేషన్‌కార్డులు.. మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన – Ration Cards

హైదరాబాద్‌: కొత్త రేషన్‌ కార్డుల (Ration Cards) పంపిణీకి తెలంగాణ సర్కారు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్‌ కార్డు మంజూరు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (Minister Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. అమేరకు అర్హులందరికీ రేషన్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 6 నెలల్లో 41 లక్షల మందికి రేషన్ కార్డులు అందించినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తాజాగా, ఈ నెలలో మరో 2.4 లక్షల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వీటితో కలిపి 11.3 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. గడిచిన 6 నెలల్లో 41 లక్షల మందికి కొత్తగా రేషన్‌ అందించినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెలలో మరో 2.4 లక్షల కొత్త కార్డులు పంపిణీ చేస్తామని చెప్పారు. వీటి ద్వారా మరో 11.30 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని ఆదివారం మ...
Free Bus | ఉచిత బ‌స్సు ప‌థ‌కంపై మంత్రి పొన్నం కీల‌క వ్యాఖ్య‌లు
Hyderabad, State

Free Bus | ఉచిత బ‌స్సు ప‌థ‌కంపై మంత్రి పొన్నం కీల‌క వ్యాఖ్య‌లు

Hyderabad | ప్రజాభవన్‌లో శ‌నివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 151 మండల మహిళా సంఘాల బస్సు యజమానులకు రూ.1.05 కోట్ల చెక్కులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ర‌వాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు. ఈ సంద‌ర్భంగా మ‌హాల‌క్ష్మి ఉచిత బ‌స్సు ( Free Bus scheme) ప‌థ‌కంపై ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో మహిళా సాధికారతను ముందుకు తీసుకెళ్లే దిశగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన "మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం" విజయవంతమవుతోంద‌న్నారు. అంతకుముందు మహిళా రచయితలు, కవులు రచించిన "మహా లక్ష్మి – మహిళా సాధికారతలో ప్రగతి చక్రాలు" అనే పుస్తకాన్ని నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహిళల ప్రయాణ అనుభవాలను కవిత్వం రూపంలో చదివి వినిపించారు. ఈసంద‌ర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ “ఒక్క చేతి గుర్తు చూపితే చాలు.. బస్సు ముంగిట నిలుస్తుంది.ఇది మహిళలకు సమానత్వం మీద ముందడుగు.” అని అన్నారు. ఇప్పటివరకు ప్రభ...
జాబ్ క్యాలెండ‌ర్ కోసం ఉద్యమానికి పిలుపు.. BRSV నేతల అరెస్టులతో తీవ్ర‌ ఉద్రిక్తత
Hyderabad, State

జాబ్ క్యాలెండ‌ర్ కోసం ఉద్యమానికి పిలుపు.. BRSV నేతల అరెస్టులతో తీవ్ర‌ ఉద్రిక్తత

BRSV Protest in Hyderabad : రాష్ట్రంలో ఉద్యోగ నియామ‌కాల‌ను చేప‌ట్టాల‌ని డిమాండ్ చేస్తూ యువత చేపట్టిన ‘చలో సెక్రటేరియట్’ నిరసనకు ముందు రాష్ట్రంలో ఉద్రిక్తత నెలకొంది. BRS విద్యార్థి విభాగం (BRSV) నాయ‌కులు , నిరుద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడంతో వివాదాస్పద పరిస్థితులు తలెత్తాయి. ఉద్యోగ నోటిఫికేషన్ క్యాలెండర్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ 'చలో సెక్రటేరియట్' నిరసనకు ముందు భారత రాష్ట్ర సమితి విద్యార్థి (BRSV) మరియు నిరుద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) నాయకులను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకోవడంతో హైదరాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన‌ హామీ హామీల‌ను నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేశారు. అలాగే అదుపులోకి తీసుకున్న నాయకులందరినీ వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగ క్యాలెండర్‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని నిరసనకారులు డిమాండ...
Anganwadi | అంగన్వాడీ హెల్పర్లకు శుభవార్త
Hyderabad, State

Anganwadi | అంగన్వాడీ హెల్పర్లకు శుభవార్త

ప్రమోషన్ గరిష్ట వయోపరిమితిని 45 నుంచి 50 ఏళ్లకు పెంపు అంగన్వాడీ హెల్పర్ల (Anganwadi Helpers) కు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి (Promotion) పొందే గరిష్ట వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఫైల్ పై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) గురువారం సంతకం చేశారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గల సుమారు 4322 మంది అంగన్వాడీ హెల్పర్లకు టీచర్లుగా పదోన్నతి పొందే అవకాశం ఏర్పడుతుంది. గతంలో 45 ఏళ్లు దాటిన తర్వాత ప్రమోషన్ కోసం అవకాశాలు లేకపోయినా, ఇప్పుడు వారికీ మళ్లీ చాన్స్ లభించనుంది. Anganwadi హెల్పర్స్ యూనియన్స్ వినతి మేరకు.. గరిష్ట వయో పరిమితిని పెంచాలని అంగన్వాడీ హెల్పర్ యూనియన్ల విజ్ఞప్తి మేరకు సాధ్యసాధ్య...
error: Content is protected !!