Heat wave | భానుడు నిప్పులు కురిపిస్తున్న వేళ.. సర్కారు యాక్షన ప్లాన్ ఇదే..
Heat wave : వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే భానుడు నిప్పులు కురిపిస్తుండడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే వణికి పోతున్నారు. ఇక కరెంటు కోతలు విధిస్తుండడంతో ఉక్కపోత భరించలేక ప్రజలు విలవిలలాడుతున్నారు. ఈక్రమంలోనే తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో తాగునీటి సౌకర్యం, విద్యాసంస్థల్లో ప్రతి గంటకు ఒక తాగునీటి కోసం బెల్, రోజువారీ వేతన కార్మికులు, ఉపాధి హామీ కార్మికులు, షెల్టర్లు, వ్యవసాయ కార్మికుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వేడి ప్రభావాన్ని తగ్గించే ప్రణాళికలు, రాబోయే ఎండల వివరాలతో కూడిన బల్క్ SMS హెచ్చరికలను పంపిస్తోంది.
జూన్ వరకు ఎండలు ఇలాగే కొనసాగుతాయనే అంచనాలతో ప్రజలు తీవ్రమైన వేడిని తట్టుకునేందుకు రెవెన్యూ (విపత్తు నిర్వహణ) విభాగం రూపొందించిన 'హీట్వేవ్ యాక్షన్ ప్లాన్ 2025' (Heat wave action plan 2025) లో, ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీలకు కొన్ని సిఫార...

