Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case ) సంచలనం సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే రాజకీయ నాయకులు, ముఖ్య పార్టీల నేతలు, అనుచరుల ఫోన్ సంభాషణలను ట్యాప్ చేసినట్టు తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ (SIT Investigation) చేస్తుండగా తాజా సమాచారం ప్రకారం 4200 మందికి పైగా వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు వెల్లడైంది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొన్ని పార్టీలు, వ్యక్తులు ఎన్నికల పక్రియను ప్రభావితం చేస్తున్నారన్న నెపంతో, పలువురు కీలక రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ కేసులో 4,200 మందికి పైగా వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) పై ఆరోపణలు వచ్చాయి. 2023 నవంబర్ 15 నుంచి 30వ తేదీ మధ్యలోనే కనీసం 618 మంది నేతల ఫోన్లను ట్యాప్ చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇందుల...




