Sarkar Live

Hyderabad

బస్సు ఛార్జీల పెంపుపై BRS ఎమ్మెల్యేల వినూత్న నిర‌స‌న‌
Hyderabad, State

బస్సు ఛార్జీల పెంపుపై BRS ఎమ్మెల్యేల వినూత్న నిర‌స‌న‌

Hyderabad | RTC ఛార్జీల పెంపును నిరసిస్తూ, BRS ఎమ్మెల్యేలు వినూత్నంగా నిర‌స‌న తెలిపారు. ఎమ్మెల్యేలు డి. సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి అసెంబ్లీకి సిటీ బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులపై ఆర్థిక భారం మోపే ఆలోచ‌న‌లు మానుకోవాల‌ని, వెంట‌నే బ‌స్సు చార్జీల‌ను త‌గ్గించాల‌ని వారు డిమాండ్ చేశారు. బ‌స్సులో ప్ర‌యాణిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రయాణికుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. కాగా ప‌లువురు ప్ర‌యాణికులు చార్జీల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు, ఈ పెంపుదల రోజువారీ ప్రయాణికులపై నెలకు రూ. 400-500 అదనపు భారం ప‌డుతోంద‌ని అన్నారు. ప్రభుత్వం పేదలపై భారం మోపుతోందని, సేవలను మెరుగుపరచడంలో విఫలమైందని చాలా మంది ఆరోపించారు. అసెంబ్లీ సమీపంలో దిగిన తర్వాత, BRS శాసనసభ్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్...
BC Reservations : బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
Hyderabad, State

BC Reservations : బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

హైదరాబాద్‌: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అంశంపై సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి ఉపశమనం కల్పించింది. బీసీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్‌నాథ్‌, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఈ కేసు హైకోర్టులో ఇప్పటికే విచారణలో ఉందని, అదే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల శాతం పెంపుపై పిటిష‌న‌ర్‌ వంగా గోపాల్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ సందర్భంగా, “హైకోర్టులో కేసు కొనసాగుతుండగా ఇక్కడకు ఎందుకు వచ్చారు?” అని ధర్మాసనం పిటిషనర్‌ తరఫు లాయర్‌ను ప్రశ్నించింది. దీనికి ప్రతిగా ఆయన “హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది” అని సమాధానమిచ్చారు. ఆపై ధర్మాసనం, “అక్కడ స్టే నిరాకరించి...
South Central Railway | ద‌క్షిణ మ‌ధ్య రైల్వేకు రికార్డు స్థాయిలో ఆదాయం
Hyderabad

South Central Railway | ద‌క్షిణ మ‌ధ్య రైల్వేకు రికార్డు స్థాయిలో ఆదాయం

Hyderabad | దక్షిణ మధ్య రైల్వే (SCR- South Central Railway) ఈ ఏడాది ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య కాలంలో సరుకు రవాణా, ప్రయాణీకుల రైళ్ల‌ విభాగాలలో అత్యుత్తమ పనితీరును నమోదు చేసింది. గత సంవత్సరం అత్యధికంగా రూ.9,966 కోట్ల స్థూల ఆదాయాన్ని అధిగమించి రూ.10,143 కోట్ల స్థూల ఆదాయాన్ని ఆర్జించింది. SCR అధికారుల ప్రకారం, ఈ జోన్ 71.14 మిలియన్ టన్నుల (MTs) ఆల్ టైమ్ హై సరకు రవాణాను సాధించింది. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో 67 MTల నుంచి 6 శాతం పెరిగి, ఆదాయానికి రూ.6,635 కోట్లను అందించింది. ఇనుప ఖనిజం, ఉక్కు కర్మాగారాలకు ముడి పదార్థాలు, సిమెంట్ రవాణా పెరగడం వల్ల ఈ పెరుగుదల ప్రధానంగా జరిగిందని SCR జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. కాగా ప్రయాణీకుల ఆదాయం కూడా ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే వృద్ధిని నమోదు చేసుకుని రూ.2,991 కోట్లకు చేరుకుంది. ఇది 2024-25లో రూ.2,909 కోట్ల నుంచి 2.8 శాతం పెరిగింది. . వందే భారత...
Hyderabad |పెట్టుబడులకు తెలంగాణే సరైన గమ్యం
State, Hyderabad

Hyderabad |పెట్టుబడులకు తెలంగాణే సరైన గమ్యం

జీటో కనెక్ట్‌ 2025 ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధ‌ర్ బాబు Hyderabad : విలువలతో కూడిన వృద్ధికి కేరాఫ్‌గా తెలంగాణ రాష్ట్రం నిలుస్తోందని, దేశానికి రోల్ మోడల్‌గా అవతరించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పారిశ్రామికాభివృద్ధికి అత్యంత అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ హైటెక్స్‌ (Hyderabad itex), హెచ్‌ఐసీసీ లో మూడు రోజులపాటు జరుగుతున్న ‘జీటో కనెక్ట్‌ 2025’ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిలతో కలిసి ఆయన శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధ్ బాబు మాట్లాడుతూ, “ఇప్పటి పారిశ్రామికవేత్తలు కేవలం రాయితీలు, ప్రోత్సాహకాలు కాకుండా నైతికత, సమ్మిళితత, సుస్థిరతను పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నారు. భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా, భవిష్యత్తునే తెలంగ...
Kaleshwaram Project : కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ పై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం
State, Hyderabad

Kaleshwaram Project : కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ పై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ స‌ర్కారు సంచ‌ల‌న‌ నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరంలో దెబ్బతిన్న ముఖ్య‌మైన‌ బ్యారేజీలను పున‌రుద్ధ‌రించాల‌ని రాష్ట్ర‌ ప్రభుత్వం ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ప్రాజెక్టులోని కీల‌క‌మైన‌ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు అవసరమైన కొత్త డిజైన్లను రూపొందించేందుకు అంతర్జాతీయ స్థాయి కంపెనీల‌ నుంచి ఆహ్వానానికి నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ క్రమంలో జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) దర్యాప్తు ఆధారంగా పునరుద్ధరణ చేయాలని నిర్ణయించింది. ఇక, వచ్చిన డిజైన్‌ టెండర్లను ప్రభుత్వం సీల్డ్‌ కవర్‌లో ఉంచుతుంది. ఈనెల 15న టెండర్లను ప్రభుత్వం తెరువ‌నుంది.కాగా, కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు ఈవోఐ పిలవాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా గత నెల 19న ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత కేవలం రెండు వారాల్లోగా డిజైన్ కన్సల్టెంట్‌ను ఎంపిక చే...
error: Content is protected !!